E.G: జిల్లాలోని రాజానగర మండలం కానవరంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 25న కోరాడ శివలక్ష్మి ఇంట్లో 82 గ్రాముల బంగారం, 45 తులాల వెండిని అపహరించిన నిందితుడు జామీ వీరగణేశ్ను శనివారం కాకినాడలో అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ DSP బి.రామకృష్ణ తెలిపారు. క్లూస్ టీం ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
AP: కాకినాడ జిల్లా ఒమ్మంగిలో దారుణం చోటుచేసుకుంది. ఆటో సీటు చింపాడని పక్కింటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఓ తండ్రి తన ఏడేళ్ల కుమారుడిని ఇనుప చువ్వలతో కొట్టి, దారుణంగా వాతలు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తన సోదరి చూసేటప్పటికి బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. చలించిపోయిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు.
KKD: సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద పశువులకు మేత పట్టుకుని వెళుతుండగా, బొలెరో వ్యాన్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి , ఆయనను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు రాజమండ్రి జాంపేటకు చెందిన వారిగా గుర్తించారు.
దాద్రానగర్ హవేలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సిల్వాస్సాలోని డెమానీ రోడ్డులో ఉన్న ఒక నైట్రోజన్ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ధాటికి గోడౌన్ పైకప్పు ఎగిరిపోవడమే కాకుండా, సిలిండర్ల ముక్కలు, ఇతర శిథిలాలు సమీపంలోని రహదారిపై పడ్డాయి. ఈ పేలుడు శబ్దంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్రముఠాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. లక్నో, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఓ సంస్థ వీరికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ముగ్గురు ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ATP: గుత్తి మండలం చెట్నేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ స్తంభాన్ని సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మత్తు పనులు చేపట్టారు. ఆ సమయంలో ఈ రోడ్డు మార్గాన జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామ సమీపంలో శనివారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న ఓ విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రీక్రియేషన్ క్లబ్లో ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిరుతపులి బారినపడి చనిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.. జింక ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మరణించింది? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: కె .గంగవరం (M) కోటిపల్లికి చెందిన నవ వధువు ఓలేటి వీరలక్ష్మి (19) సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. ఫిబ్రవరి 26న పెళ్లి అయిన వీరలక్ష్మి పేరెంట్స్ ఇంటి వద్ద ఉరేసుకుని తనువు చాలించారు. తన కూతురు మృతికి అత్తింటి వారే కారణమని మృతురాలి తండ్రి సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామంలోని ఏసుబాబును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
AP: నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కొలగట్ల గ్రామం వద్ద లారీని తప్పించబోయి బస్సు పక్కకు పడింది. దీంతో ఐదుగురికి గాయాలు కాగా.. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ జిల్లాలో ఓ కారు బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతిచెందారు. నాసిక్కు 25 కిలోమీటర్ల దూరంలోని దిండోరిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చీకట్లో బావిని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు టిప్పర్తో వెంబడించి ఢీకొట్టారు. ఆ యువకుడు తీవ్రంగా గాయపడటంతో రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: అనంతపురానికి చెందిన లోకేశ్(29) హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫార్మా కంపెనీలో పనిచేసే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన, పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి దుస్తులు ధరించి, భోజనం తీసుకురావాలని ప్రియురాలిని బయటకు పంపారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.