TG: సూర్యాపేట మండలంలో యర్కారంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. చింతలపాటి మధు అనే వ్యక్తి దారుణ హత్య చేశారు. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కి పడేశారు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న మధును.. ఆ కేసు విచారణ ముగిసే దశలో ఉండటంతోనే హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్య నేపథ్యంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.