బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దంపతులు ప్రయాణిస్తున్న కాన్వాయ్కు ముంబైలోని జుహూలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు ఆటోను ఢీకొనగా, ఆ ఆటో అదుపుతప్పి అక్షయ్ ఎస్కార్ట్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని వారికి గాయాలు కాగా, అక్షయ్, ట్వింకిల్ ఖన్నా తృటిలో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తమిళనాడు కళ్లకురుచిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్సవాల్లో గ్యాస్ బెలూన్లను నింపుతుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి అక్కడి ప్రజలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
E.G: రాజానగరం మండలం రామస్వామిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మానం వీరబాబు (47) దుర్మరణం పాలయ్యారు. అనపర్తిలో డ్యూటీ ముగించుకుని అర్ధరాత్రి రంగంపేట పోలీస్ స్టేషన్కు వస్తుండగా.. గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మరణించడంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.
AP: పల్నాడు జిల్లా వినుకొండ RTC బస్టాండ్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావటంతో బస్టాండులో రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడకు వెళ్లే బస్సు రాగా.. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడటంతో ఈ తొక్కిసలాట జరిగింది.
ATP: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో నివాసముండే జయమ్మ సోమవారం ప్రమాదవశాత్తు మిద్దె మెట్ల మీద నుంచి జారి కింద పడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయమ్మ తలకు వైద్యులు ఆరు కుట్లు వేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి యువకుడు మృతి చెందాడు. మృతుడు కస్తూరిపాడుకు చెందిన కుహరామిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
పాకిస్తాన్ పెషావర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని కుటుంబంలోని ఏడుగురిని కాల్చి చంపాడు. ఫరూక్ అనే వ్యక్తి తన భార్య, 2 నెలల కుమార్తె సహా ఏడుగురిని చంపాడు. మరణించిన వారిలో ఇద్దరు సోదరులు, వారి భార్యలు ఉన్నారు. కుటుంబ వివాదాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విజయనగరం జిల్లా అప్పన్నవలస వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో రోడ్డు పక్కనే బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ బస్సు రాజాం నుంచి విజయనగరం వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యాపారి హత్య జరిగింది. లిటన్ చంద్ర ఘోష్(55) అనే వ్యాపారి మరి కొంత మంది స్ధానికుల మధ్య అరటిపళ్ల విషయంలో గొడవ జరిగింది. దీంతో వారు అతడిపై విచాక్షణారహితంగా దాడి చేయగా.. లిటన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత కొంత కాలంగా బంగ్లాలో హిందువులు హత్యకు గురవుతున్న సంగతి తెలిసిందే.
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది తీవ్ర గాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ ఘటనలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల విలువ చేసే కొకైన్, MDMA మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మహారాష్ట్రలోని పూణె-సోలాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, సౌతాఫ్రికాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 100 మందికి పైగా మృతిచెందారు. జింబాంబ్వేలో 70, సౌతాఫ్రికాలో 30 మంది మృతిచెందినట్లు సమాచారం. మొజాంబిక్లో 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నాయి. నేషనల్ పార్క్లో 600 మంది పర్యాటకులు చిక్కుకున్నారు.