• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగి పడి 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

October 7, 2025 / 08:33 PM IST

వృద్ధురాలిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

BHNG: భువనగిరి బస్టాండ్ వద్ద వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక వృద్ధురాలిని ఢీకొట్టింది. ఇవ్వాళ బస్టాండ్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను భువనగిరి జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

October 7, 2025 / 08:22 PM IST

BREAKING: భారీగా డ్రగ్స్ పట్టివేత

TG: HYD మియాపూర్‌లో 4.25 కిలోల గసగసాలు(Poppy Seeds) పట్టుబడ్డాయి. శంషాబాద్ SOT పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న మన్ని రామ్ అనే కార్పెంటర్‌ను అరెస్ట్ చేశారు. ఇతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ దందాకు తెరలేపాడు. పోలీసులు ఇద్దరు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

October 7, 2025 / 05:53 PM IST

ప్రేమ పెళ్లి.. యువకుడి దారుణ హత్య

AP: గుంటూరులోని ఏటుకూరులో దారుణ ఘటన చోటుచేసకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడని కుర్రా గణేశ్ అనే యువకుడిని యువతి సోదరుడు కత్తులతో పొడిచి చంపాడు. యువతి సోదరుడితోపాటు మరో ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడినా.. చంపారని గణేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

October 7, 2025 / 04:27 PM IST

అమెరికాలో మరో భారతీయుడి హత్య

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో సూరత్‌కు చెందిన రాకేశ్ పటేల్ (50)ను దారుణంగా హత్య చేశారు. ఈనెల 3న హోటల్లో పార్ట్‌నర్‌గా ఉన్న రాకేశ్‌ను, దుండగుడు స్టేన్లీ వెస్ట్ పాయింట్ బ్లాంక్‌లో తలపై గన్‌తో కాల్చి చంపాడు. అయితే బయట కాల్పుల శబ్దం విని షాప్ లోపలి నుంచి వచ్చిన రాకేశ్‌పై స్టేన్లీ వెస్ట్ దాడి చేసినట్లుగా సమాచారం.

October 7, 2025 / 04:11 PM IST

BREAKING: ఇంటర్‌ విద్యార్థిని దారుణహత్య

TG: నల్గొండలో ఇంటర్ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. ఓ యువకుడు హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

October 7, 2025 / 01:25 PM IST

ఢిల్లీలో భారీగా పట్టుబడిన ఎర్రచందనం 

AP: ఢిల్లీలో భారీగా ఎర్రచందనం నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించిన దాదాపు 10 టన్నుల దుంగలను సౌత్ ఈస్ట్ ఢిల్లీకి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

October 7, 2025 / 01:07 PM IST

నెల్లూరులో జంట హత్యల కలకలం

NLR: నగరంలోని రంగనాయకులపేట తిక్కన పార్కు ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని యువకులు దారుణహత్యకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, యువకులను కర్రలతో కొట్టి పెన్నానదిలో పడేసినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో విరిగిన కర్రలు, గ్రూపుల మధ్య పాతకక్ష్యలే కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

October 7, 2025 / 12:55 PM IST

విద్యుత్ షాక్‌.. ఐదు గొర్రెలు మృతి

NGKL: కల్వకుర్తి మండలం రామగిరిలో విద్యుత్ షాక్‌తో ఐదు గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పచ్చిక బయలు భూమిలో సోమవారం సాయంత్రం గొర్రెల కాపరి వాడాల హనుమంతు గొర్రెలను మేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కంచె లేని ట్రాన్సఫార్మర్ తగిలి ఐదు గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయని కాపరి తెలిపాడు.

October 7, 2025 / 11:15 AM IST

నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత

ప్రకాశం: జరుగుమల్లిలో నాలుగు టన్నుల చౌక బియ్యాన్ని స్థానిక పోలీసులు ఇవాళ తెల్లవారుజామున పట్టుకున్నారు. ఓ మినీ ట్రక్‌లో 80 బస్తాలలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ట్రక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పోలీసులు సమాచారం అందించి వారి ఫిర్యాదు ద్వారా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

October 7, 2025 / 09:49 AM IST

కల్వర్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి

ATP: బెలుగుప్ప మండల పరిధిలోని బూధివర్తి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్ శంకర్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతి చెందిన డ్రైవర్ శంకర్ మృతదేహాన్ని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

October 7, 2025 / 09:30 AM IST

కుక్కలు ఢీ.. ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలు

KMR: కుక్కలను బైక్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం స్థానికుల వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన బండారు బసవయ్య ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండా సిరిసిల్ల రోడ్ గంజి గేట్ సమీపంలో కుక్కలు గుంపుగా రావడంతో కుక్కలను ఢీకొని ద్విచక్ర వాహనం నుంచి కింద పడి తీవ్ర గాయాలు అయ్యాయి.

October 7, 2025 / 08:58 AM IST

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సీజ్

ATP: ఉరవకొండ పట్టణ శివారులో ఓ ఇంట్లో అక్రమంగా డంప్ చేసిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తహసీల్దార్ మహబూబ్ బాషా మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

October 7, 2025 / 08:00 AM IST

భార్యను చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త

BDK: జూలూరుపాడు మండలం పాపకొల్లులోని ముత్యమ్మకాలనీలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ధారావత్ గోపి అనే వ్యక్తి తన భార్య సునీతను వేట కొడవలితో నరికి చంపాడని అన్నారు. నిందితుడు భార్యను చంపిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

October 7, 2025 / 07:06 AM IST

విస్సన్నపేటలో కుక్కల స్వైర విహారం

NTR: విస్సన్నపేట మండలలోని రాజీవ్ నగర్ కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. నిన్న కుక్కల దాడిలో ఆరుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

October 7, 2025 / 07:03 AM IST