KRNL: హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. దొంగలు ఆలయ తాళాలను పగలగొట్టి, రూ.35 వేలు విలువైన 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువైన రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా: మల్లాయిపాలెంకు చెందిన ఓ వృద్ధుడు మిల్లులో కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సైకిల్పై రైస్ మిల్లు వైపు వెళ్తుండగా ముదినేపల్లి వైపు నుంచి వస్తున్న ఓ బైకును గమనించి భయంతో సైకిల్ అదుపు కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఈరోజు మృతి చెందాడు. అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MDCL: జాతీయ రహదారిపై గల కండ్లకోయ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని కీర్తన(20) అనే ప్రైవేట్ ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు తగలడంతో బైక్ వెనుక ఉన్న కీర్తన కిందపడటంతో, ఆమె తలపై నుంచి బస్సు టైర్లు వెళ్లాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AKP: నర్సీపట్నంలో పైన లీలా షర్మిలా అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. టౌన్ సీఐ గోవిందరావు తెలిపిన వివరాలు ప్రకారం.. వివాహిత గైనిక్ సమస్యతో బాధపడుతూ.. ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి పద్మావతి ఫిర్యాదు చేసిందన్నారు. హైదరాబాదులో ఉండే షర్మిల వారం రోజుల కింద నర్సీపట్నం వచ్చిందని పేర్కొన్నారు.
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. బావతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఓ వివాహితను అత్తమామలు వేధించారు. అందుకు ఆమె నిరాకరించడంతో గత 10 రోజులుగా గదిలో బంధించి వేధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆమెను రక్షించారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ATP: కళ్యాణదుర్గం మండలం గోళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుచ్చకాయల లోడుతో వెళ్తున్న బొలెరో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉంది. టైర్ పగిలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని దారుణం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు అత్యాచారం చేశారు. చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. అనంతరం చిన్నారిని ఆస్పత్రికి తరలించి, నిందితులను పోలీసులకు అప్పగించారు.
SDPT: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి ఐదు వేలు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో జరిగింది. నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిస అయి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవకు దిగిన అనంతరం కోపంతో తను మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: సికింద్రాబాద్లోని ప్యారడైజ్ మెట్రో స్టేషన్పై నుంచి దూకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.హైవే సేఫ్టీ సిబ్బంది సహాయంతో క్షతగాత్రుడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని కుసుమావలస గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కించుమండల వైపు నుంచి అరకు వారపు సంతకు కూరగాయలు తీసుకువెళుతున్న ఓ ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాయని పేర్కొన్నారు.
ATP: బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్ర కాలనీలో ఓ చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందింది. ప్రభాకర్, రజిని దంపతులు ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంకాలం వారి కూతురు చిన్నారి గీష్మ నీటి ఆడుకుంటూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
E.G: గోకవరం మండలం బావాజీపేట గ్రామానికి చెందిన దుల్ల చరణ్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
VSP: బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
GNTR: తెనాలిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. మారిస్పేట-మద్రాసు గేటు మధ్య రైలు పట్టాలు దాటుతున్న సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిని మిలటరీ స్పెషల్ ట్రైన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.