జార్ఖండ్లోని బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరికొందరు కార్మికులు గనిలో చిక్కుకుపోయారు. ప్రమాదస్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. గనిలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాలు పెరుగుతున్నాయి. తాజాగా, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయ్యాక లోపం గుర్తించిన పైలట్, తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. రెండు గంటలుగా ప్రయాణికులు అందులోనే ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
KDP: ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దాసర్ల దొడ్డి బేస్ క్యాంపులో ఐదుగురు పనిచేస్తున్నారు. వారిలో ప్రొటెక్షన్ వాచర్ D వెంకటయ్యపై ఎలుగుబంటి గురువారం దాడి చేయగా అతని కుడి మోకాలుకు తీవ్రగాయమైంది. క్షతగాత్రుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు చింతరాజు పల్లె DY రేంజ్ అధికారి నాగూర్ నాయక్ తెలిపారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పాత కక్షల కారణంగా గురువారం ఆటో డ్రైవర్ జయరాముడుపై శ్రీనివాసులు అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో జయరాముడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచనలతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.
AP: నంద్యాల జిల్లాలో బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్ దందా చేస్తున్నారు. రైల్వే స్టేషన్లను షెల్టర్ జోన్లుగా వినియోగిస్తున్నారు. బిచ్చగాడు దస్తగిరి హత్య తర్వాత బిచ్చగాళ్లను పోలీసులు విచారించారు. 120మందిలో 30 మందికి నేర చరిత్ర ఉన్నట్లు నివేదికలో తేలింది. పోలీసులు వారి డేటాను సేకరించి, మందలించి పంపించారు. పోలీస్ పికెట్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
MNCL: కన్నేపల్లి మండలం మెట్ పల్లి గ్రామంలో గురువారం దారుణం హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ముడిమడుగుల తిరుపతి అనే వ్యక్తి తన భార్య ముడిమడుగుల తులసిని (30) గొడ్డలితో నరికి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు SI గంగారాం ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు.
MDK: నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తగిలి వంజరి నరసింహులు (35) మృతి చెందినట్లు ఎస్సై అహ్మద్ మైనుద్దీన్ తెలిపారు. కాసులబాద్ గ్రామానికి చెందిన గణేష్ వద్ద కొన్నేళ్లుగా వ్యవసాయ పనుల కోసం కూలీగా పనిచేస్తున్నాడు. వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో మరమ్మత్తు చేస్తుండగా షాక్ తగినట్లు వివరించారు.
W.G: ఆకివీడు నుంచి భీమవరం వెళ్తున్న ఓ బస్సు నుంచి మంగళవారం ఉదయం ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. భీమవరం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బస్సు నుంచి ఈ పొగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను కిందకి దింపేశారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
RR: నాగోల్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల సుభాష్ నగర్కు చెందిన బండారి విజయ్ కుమార్ (35) రాత్రి 11:45కు నాగోల్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్పై నిలుచున్న సమయంలో వేగంగా వచ్చిన లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
HYD: బాలానగర్ PS పరిధిలోని జగ్జీవన్ వంతెనపై సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. బాలానగర్ నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తూ వంతెన దిగుతున్న సమయంలో కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రొబిషన్ SI వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తుండగా అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో SIకు తీవ్ర గాయాలయ్యాయి.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రిసార్టులో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్టులో ప్రేమికులిద్దరు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ATP: శెట్టూరు మండలం చిన్నంపల్లి సమీపంలో జనార్ధన్ అనే రైతుకు చెందిన దూడపై ఆదివారం తెల్లవారుజామున చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో దూడ చనిపోయింది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
VKB: వీధికుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చౌడాపూర్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పాచావ్ కుంట తండాకి చెందిన నాగేశ్, నీలా కూతురు జయ శ్రీ ఇంటి వద్ద ఆడుకుంటుంది. వీధి కుక్కలు చిన్నారిని పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని మహబుబ్ నగర్ హాస్పిటల్కి తరలించారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఏల్చూరు టోల్ ప్లాజా అంబులెన్స్లో నరసరావుపేట హాస్పిటల్కి తరలించారు.
బాపట్ల: అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని మరొక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ పి శ్రీను, క్లీనర్ పి లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 10 8అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది