బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు శివారు వద్ద చెక్ డ్యామ్లో ముగ్గురు పిల్లలు ఈతకు దిగారు. ఈ క్రమంలో వారిలో ఒకరు గల్లంతవగా, మిగిలిన పిల్లల సమాచారంతో గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: HYDలోని కూకట్పల్లి హైదర్నగర్లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్పూల్లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతి చెందాడు.హైదర్నగర్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లరు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
AP: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండల పరిధిలోని కొండముది గ్రామంలో మద్యం మత్తులో ఓ కుమారుడు తల్లిని హత్య చేశాడు. కొమ్ము జయమ్మ (60) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగరాజు మద్యం మత్తులో తల్లిని రోకలి బండతో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలురు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
AP: అనకాపల్లి SVS కెమికల్స్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెంట్రిఫ్యూజ్ వద్ద మంటలు చెలరేగినట్లు గుర్తించారు. టోలున్ అనే రసాయనంతో మంటలు తీవ్రంగా వ్యాపించినట్లు తెలిపారు. ప్రమాద కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
TG: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.21కోట్ల విలువ చేసే 2.1 కిలోల కొకైన్ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాలిథిన్ కవర్లలో కొకైన్ ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించారు. ఈ డ్రగ్స్ను బ్యాంకాక్ నుంచి తరలించినట్లుగా గుర్తించి ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అన్నమయ్య: మైసూరు వారిపల్లి సమీపంలో కడప-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SVS కెమికల్స్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో కార్మికులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.
TG: మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ల కోసం ఈగల్ టీమ్ గాలింపు చేపట్టింది. నీతు భాయ్ కుమారుల కోసం నానక్రామ్గూడ IT కారిడార్లో నీతుభాయ్ డెన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఖాలు సింగ్, గౌతమ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీతూ భాయ్ గతంలో పీడీ యాక్ట్లో అరెస్టయి విడుదలయ్యాడు. అతడిపై ఇప్పటికే 12 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
AP: BJP ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ సుధీర్ రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ కేసులో దొరికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. ఆయనతో పాటు మరోకరిని కూడా అరెస్ట్ చేసినట్లు ఈగల్ టీమ్ పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: BJP ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలోనూ సుధీర్ రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ కేసులో దొరికినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని డీ అడిక్షన్ సెంటర్కు తరలించారు. ఆయనతో పాటు మరోకరిని కూడా అరెస్ట్ చేసినట్లు ఈగల్ టీమ్ పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దాముద్యా ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు ఆయన చెరువులో దూకినప్పటికీ, తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.