KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదారుల వద్ద రూ. 22,67,469 నమ్మించి మోసం చేశాడని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
NLR: కోవూరు మండలం రామన్నపాలెం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వైజాగ్ నుంచి బెంగళూరుకు 27 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ట్రావెల్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: సత్యవేడు-తమిళనాడు సరిహద్దులోని మాదరపాకం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పదంగా వెళ్తున్న బాలమురుగన్ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. ఆయన వైజాగ్ నుంచి చెన్నైకి 8 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న విషయం తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పెద్దాపురంలో లలిత ఇండస్ట్రీస్లో జట్టు కార్మికుడు మంగళవారం స్నానం చేస్తూ బాత్ రూంలో మృతి చెందాడు. మృతుడు బిహార్ షబ్బీర్ ఆలం(34)గా గుర్తించారు. పచ్చకామర్లతో అనారోగ్యంగా ఉన్నాడని తోటి కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దాపురం పోలీసులు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMM: అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
KDP: రాజుపాలెం మండలంలో మిస్సింగ్ కేసు నమోదైంది. కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల అనే మహిళ, ఆమె పిల్లలు కమాల్ బాషా (8), మదియా (6) ఆదివారం నుంచి కనపడకుండా పోయారని రాజుపాలెం ఎస్ఐ కత్తి వెంకట రమణ తెలిపారు. ఈ విషయమై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసినవారు 91211 00600 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
NDL: పట్టణంలోని చిన్నచెరువు వద్ద ఉన్న వినాయక ఘాట్లో యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బిల్లలపురంకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చరణ్(25)గా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
VZM: వంట గ్యాస్ లీకై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తవలస మండలంలో చోటు చేసుకుంది. కంటకాపల్లిలో సోమవారం జరిగిన అమ్మవారి తీర్థ మహోత్సవాలు సందర్భంగా బాడితబోని మల్లయ్య ఇంట్లో పిండి వంటలు తయారు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని శారదా కంపెనీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కిందపడి ఓ గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
SRD: కోహిర్ మండలం గోటియర్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్జున్ పవన్, శంకర్ కోహిర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు. సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.