తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన ఒకే క్వార్టర్లో ఉన్నారు. తాజా ఫలితాలతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రు. ఈ క్రమంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయనున్నారు.
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ నెలలో కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రెండో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతోంది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర నెంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. కుండపోత వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం ఓట్ల లెక్కింపుతో ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారో తేలిపోనుంది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పోలీసులకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఆస్ట్రేలియాతో జరిగిన నేటి టీ20 మ్యాచ్లో టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో 4-1 తేడాతో భారత్ ముందంజలో నిలిచి సిరీస్ కైవసం చేసుకోనుంది.
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే 20 జట్లను ఐసీసీ ప్రకటించింది. ఇందులో 10 జట్లు నేరుగా అర్హత సాధించగా మిగిలిన జట్లకు క్వాలిఫయింగ్ మ్యాచులను నిర్వహించనుంది.
ఉత్తరకాశీలోని టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తోంది. ఒక్కొక్కరినే టన్నెల్ లో అమర్చిన సేఫ్ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. వచ్చిన వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలిస్తున్నారు. 17 రోజుల తర్వాత కార్మికులు టన్నెల్ నుంచి బయటకు రావడంతో కుటుంబీకుల్లో ఆనందం నెలకొంది.
తెలంగాణలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కామ్ కేసులో ఆయన బెయిల్ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్పై నేడు విచారణ జరగ్గా సుప్రీం విచారణను డిసెంబర్ 8వ తేదికి వాయిదా వేసింది. బాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సుప్రీం అనుమతులు ఇచ్చింది.
ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.