అమెరికాలో తెలుగు యువతి గొడిశాల నికితా రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చిక్కాడు. ఈనెల 2న భారత్ వచ్చిన అనుమానితుడు అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత పరారైన అర్జున్ ఇండియాకు వచ్చినట్లు గుర్తించి, పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. UAPA కేసులో వీరి బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని కోర్టు నిర్ణయించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖలీద్, ఇమామ్ల పరిస్థితి భిన్నంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వారి బెయిల్ వ్యవహారంపై తదుపరి విచారణల్లోనే స్పష్టత రానుంది.
TG: సిద్దిపేటలో లావణ్య అనే జూనియర్ డాక్టర్ ఆత్యహత్యకు పాల్పడింది. ప్రభుత్వ కళాశాలలో జూ. డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినట్లు గుర్తించారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిస్తోంది. దీంతో హాస్టల్ రూమ్లో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డిమందు ఎక్కించుకుంచుకోవడంతో మృతి చెందిది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కృష్ణ కిషోర్, ఆశ దంపతులు ఈ ప్రమాదంలో కన్నుమూశారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు. పది రోజుల క్రితమే వీరు పాలకొల్లు నుంచి తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
AP: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పీఎస్ వద్ద పోలీసులు చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈశ్వరప్ప అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ వివాహితను గూడూరు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఆమె భర్త హరి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గూడూరు నుంచి వాళ్లిద్దరిని పోలీసులు తనకల్లు తీసుకొచ్చారు. పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను హరి, అతని బంధువులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నికిత రావు.. మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ఫ్రెండ్ అర్జున్శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నికిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులను ఆశ్రయించాడు. అర్జున్ అదేరోజు భారత్కు వచ్చాడు. పోలీసులు నికిత డెడ్ బాడీని గుర్తించి, అర్జున్పై కేసు నమోదు చేశారు.
కోనసీమ: పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో ఆదివారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల రామకృష్ణ (60)గా స్థానికులు గుర్తించారు. వీఆర్వో భగవన్నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలోని మసాచుసెట్స్లో విషాదం చోటుచేసుకుంది. కేప్కాడ్ ప్రాంతంలోని ప్రావిన్స్టౌన్ ఎయిర్పోర్టు వద్ద ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. విమానం రన్వే సమీపంలో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రతికూల వాతావరణం కారణమా, సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది.
ఈశాన్య భారతదేశంలో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి అసోం, త్రిపుర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అసోంలోని మోరిగావ్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు కాగా, త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైబర్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. బోర్గు ప్రభుత్వ పరిధిలోని కసువాన్-డాజీ గ్రామంలోకి ఆయుధాలతో దుండగులు చొరబడి.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందారు. మరికొందరిని అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అపహరణకు గురైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు శివారు వద్ద చెక్ డ్యామ్లో ముగ్గురు పిల్లలు ఈతకు దిగారు. ఈ క్రమంలో వారిలో ఒకరు గల్లంతవగా, మిగిలిన పిల్లల సమాచారంతో గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: HYDలోని కూకట్పల్లి హైదర్నగర్లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్పూల్లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతి చెందాడు.హైదర్నగర్లోని గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లరు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
AP: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండల పరిధిలోని కొండముది గ్రామంలో మద్యం మత్తులో ఓ కుమారుడు తల్లిని హత్య చేశాడు. కొమ్ము జయమ్మ (60) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగరాజు మద్యం మత్తులో తల్లిని రోకలి బండతో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలురు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.