కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురి మృతి చెందారు. మృతులంతా ఐదో తరగతి విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో చోటు చేసుకుంది. మృతులంతా అదే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నీటికుంటలో స్నానానికి దిగి వీరంతా చనిపోయారని గ్రామస్తులు తెలిపారు.
AP: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వద్ద ఉన్న ఓ నీటి కుంటలో ఆడుకునేందుకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు అందులో పడిపోయారు. ఆరుగురు నీటిలో పడి మృతి చెందారు. మృతులంతా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
AP: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ వద్ద ఉన్న ఓ నీటి కుంటలో ఆడుకునేందుకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు అందులో పడిపోయారు. వారంతా నీటిలో మునిగి ప్రాణాలు విడిచారు. మృతులంతా ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
TG: రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.ఈ పరిణామాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
VSP: విశాఖ తూర్పు నియోజకవర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. దీంలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
NTR: విజయవాడ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు చేశారు. ఏసీపీ దామోదర్ వివరాల ప్రకారం.. అశోక్ నగర్కు చెందిన జనార్ధన్ వివాహం నిమిత్తం శ్రీశైలం వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉండాల్సిన బంగారం చోరీ అవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 130 గ్రాములు బంగారం వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
HYD: బాచుపల్లి PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. పోలీసుల వివరాలిలా.. PS సమీపంలోని హనుమాన్ ఆలయం దగ్గర ఓఇంట్లో 8 (M), 3 ఏళ్ల చిన్నారులను తల్లి లక్ష్మీ సంపులో పడవేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలు మృతి చెందినట్లు గుర్తించి, లక్ష్మీని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కొడవలూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ని వెనుక నుంచి టాటా ఎస్ వ్యాన్ ఢీకొట్టింది.ఈ ఘటనలో టాటా ఎస్ వాహనంలోని మాధవరావు, హుస్సేన్ అనే చెన్నైకి చెందిన ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కావలికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: అడ్డాకులలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. HYD నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న WNP డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి బొలెరోవాహనం ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఆత్మకూరు మండలం పిన్నెంచెర్లకుచెందిన కుమ్మరి నాగలక్ష్మన్న(40) అక్కడికక్కడే మృతిచెందాడు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
TG: హైదరాబాద్ జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్నగర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దట్టంగా పొగలు అలుముకోవడంతో.. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
AP: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారుకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఉదయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై విజయగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక రాజకీయ కుట్ర ఉన్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
KRNL: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదోని మండల పరిధిలోని పాండవగల్లు గ్రామ సమీపంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు, బైక్లను ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గంగావతి డిపోకు చెందిన బస్సు ఆదోని నుంచి రాయచూరు వెళ్తూ.. ముందు వెళ్తున్న రెండు బైక్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: గిద్దె పెరుమాండ్ల దేవస్థానం గ్రౌండ్లో పెను ప్రమాదం తప్పింది. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో వ్యక్తి కారు నేర్చుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ట్రాక్పై ఉన్న స్ట్రీట్ లైట్స్, పూలమొక్కలు, కుండీలను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వాకర్లు భయాందోళనకు లోనయ్యారు.
ATP: హిందూపురంలోని ఆటోనగర్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు.
MDK: శివంపేట మండలం సికింద్రాపూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గుండంలో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వారం వారం జరిగే ఉత్సవాలకు హైదరాబాద్ బాలాజీనగర్కు చెందిన కరుణాకర్ (14) కుటుంబం విచ్చేసింది. ఈ క్రమంలో ఆలయం వద్ద గుండంలో స్నానం చేసేందుకు దిగిన కరుణాకర్ మునిగి మృతి చెందాడు.