KRNL: పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఉపాధికూలీ అడవి లక్ష్మన్న(58) సోమవారం కూలిపనిలో పాల్గొన్న సమయంలో ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురి కాగా చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ప్రాంతాల్లో శ్రమికులకు తగిన నీరు, మజ్జిగ వంటి సదుపాయాలు లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగింధన్నారు.
KRNL: వెల్దుర్తి సమీపంలోని లిమ్రాస్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం రుషిబాబు (14) మృతి చెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం తమ్ముడితో కలిసి పాలు పంపిణీకి బయలుదేరిన బాలుడు, కంటైనర్ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో వారి బైక్ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడు విక్కీబాబు తీవ్రంగా గాయపడ్డాడు.
GDWL: మానవపాడు మండలం తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వెళ్తున్న లారీని వెనక నుండి మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. లారీ ఓనర్ కం డ్రైవర్ షేక్ హుస్సేన్ భాష (56), క్లీనర్ ఈరన్న (58) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మీరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్ విండో ఛైర్మన్గా పని చేశారు. బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
KNR: చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో లక్ష్మీ అనే వృద్ధురాలు తన శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రేగొండ గ్రామానికి చెందిన లక్ష్మీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
JN: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఏఆర్ కానిస్టేబుల్ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన గుగులోతు నీల (26) వరంగల్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్ పని చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
HYD: ఓ వ్యక్తి పై కొంతమంది కత్తులతో దాడికి దిగిన ఘటన అత్తాపూర్ PS పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. అత్తాపూర్ పరిధిలోని ఖాజానగర్కు చెందిన సయ్యద్ బాబాపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏంబీటీ స్పోక్స్ పర్సన్ బాధితుడిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
NRML: నర్సాపూర్ జి మండలం తురాటి సమీపంలో శనివారం సాయంత్రం బస్సు లారీ ఢీకొన్న ఘటన విషయం తెలిసిందే. కాగా తీవ్ర గాయాల పాలైన లారీ డ్రైవర్ను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NDL: ఓర్వకల్లు మండలం శకునాలకు చెందిన శీలం మాధవి (45) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, భర్త శీలం చిన్నరాజు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
కృష్ణా: ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: నరసన్నపేట మండలం, మండపాం హైవే బ్రిడ్జ్ పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ATP: అనంతపురం జిల్లాలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం రాయదుర్గం నియెజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో డి. హిరేహల్ మండలం SR కోట గ్రామం సమీపంలో పిడుగు పడింది. కొబ్బరి చెట్టుపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
PLD: శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన మహాలక్ష్మమ్మ పనులు చేసుకొని ఆ వచ్చిన నగదును బ్యాంక్ ఖాతాలో దాచుకుంది. ఆమెకు తెలియకుండా ఎవరో బ్యాంక్ ఖాతా నుంచి నాలుగు విడతలుగా రూ.31వేల నగదు బదిలీ చేసుకున్నారు. గురువారం కొంత డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంక్కు వచ్చి ఖాతాలో ఎంత ఉన్నాయని వివరించగా, ఖాతాలో నగదు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా: ఆగిరిపల్లి మండలం వడ్లమాను రైతు సింహాద్రి జగన్మోహనరావు తన కుమారుని వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగా, బైకు చోరీ జరిగిందని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పెదవుటుపల్లి పిన్నమనేని ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్ళగా, పార్కింగ్ చేసిన బైక్ను అగంతకుడు దర్జాగా చోరీ చేసి వెళ్లిన సంఘటన సీసీ ఫుటేజ్లో రికార్డయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.