KDP: ప్రొద్దుటూరు-యర్రగుంట్ల మధ్య రైల్వే లైన్లో KM 115/10–11 వద్ద OHE పోల్ సమీపంలో HX/PSPY రైలు కిందపడి 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని GRP పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు GRP యర్రగుంట్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
KDP: వంటగదిలో వాయుబండ లీకేజీతో జరిగిన ప్రమాదంలో మైదుకూరు పురపాలక కౌన్సిలర్ మామిళ్ల వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దోమల నివారణకై అగరబత్తి వెలిగించే ప్రయత్నంలో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు గుర్తించి, ఆయనను బయటకు తీసుకువచ్చే లోపే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెడ్డినగర్లో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో MBBS విద్యార్థి ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా: పెదపారుపూడి మండలం భూషణగుళ్లలో కోడిపందేల బరిలో శుక్రవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పందెం గొడవలో అనగాని జగన్నాథం అనే వ్యక్తిపై ప్రత్యర్థులు కోడి కత్తితో పీకపై దాడి చేశారు. ఈ ఘటనలో జగన్నాథానికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్థానికులు అతడిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
AP: ప్రకాశం జిల్లా కొరిశెపాడు మండలం గుడిపాడు దగ్గర ప్రమాదం జరిగింది. బైక్ను బొలేరో వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న మత్స్యకారులు వెంటనే స్పందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో ఒక అక్రమ ఆయుధ ఫ్యాక్టరీపై పోలీసులు దాడి చేశారు. ఢిల్లీతో పాటు యూపీ, హర్యానాలో హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద నుంచి 20 పిస్టల్స్, 12 లైవ్ క్యాట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఆయుధాల తయారీ యంత్రాలు సీజ్ చేసి.. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: విజయవాడ కేదారేశ్వరరావుపేటలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. భర్తను వదిలేసి విడిగా ఉంటున్న మహిళ (39)ను శివకుమార్ అనే యువకుడు హత్య చేశాడు. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ కుమార్తెను కూడా రోకలి బండతో కొట్టి గాయపరిచాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. ఎయిర్పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 8 మందిని అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ నకిలీ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సృష్టించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తల్లాడ వద్ద వాటర్ ట్యాంకర్ను కారు ఢీకొట్టగా, వైరా వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పొగమంచు వల్లే ప్రమాదాలు జరిగాయని వాహనదారులు, స్థానికులు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూపులో న్యూడ్ వీడియోలు కలకలం రేపాయి. సమాచార శాఖ కుప్పం గ్రూపులో I&PR డీడీ పేరిట న్యూడ్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీటితో పాటు ఓ APK ఫైల్ సైతం వచ్చింది. దీంతో ఇతర ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రూపులో ఆ వీడియోలు తొలగించారు. డీడీ ఫోన్ హ్యాక్ కావడంతోనే ఇలా జరిగిందని సమాచారం. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరేబియా సముద్రం ద్వారా భారత్లోకి చొరబడేందుకు యత్నించిన తొమ్మిదిమంది పాకిస్తానీయులను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. మత్స్యకారుల వేషంలో పడవలో వస్తున్న వీరిని సరిహద్దుల్లోనే గుర్తించి బంధించారు. ప్రస్తుతం వారిని గుజరాత్కు తరలిస్తున్నారు. గతంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బుద్ధి చెప్పినా, పాక్ చొరబాటుదారులు పదేపదే ఇటువంటి పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు.
ప్రకాశం: కొత్తపట్నం వెళ్లే దారిలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అల్లూరు నుంచి కొత్తపట్నం వెళ్లే దారివైపు తొట్టెంపూడి కోటేశ్వరరావు అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో కోటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందారని, పోలీసులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
CTR: రొంపిచర్లకు సమీపంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్న యువకుడు గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. కలకత్తా నుంచి యువకుడు కుటుంబంతో వచ్చి ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్- వ్యాన్ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.