AP: విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో రాజరాజేశ్వరి పేటకు చెందిన ఓ యూట్యూబర్ మద్యం మత్తులో కారు నడిపి ముగ్గురిని ఢీకొట్టాడు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
TG: హైదరాబాద్లో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. తిరుమల వైకుంఠద్వార దర్శనం టికెట్ల పేరుతో మహిళ మోసానికి పాల్పడింది. 150 మంది భక్తుల నుంచి రూ.3 వేల చొప్పున వసూళ్లకు పాల్పడింది. ఈ మేరకు సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
TG: హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో చైనా మాంజా ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి చేతికి మాంజా చుట్టుకోవడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చైతన్యకు తీవ్రగాయాలయ్యాయి. కాగా సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఢిల్లీలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి వృద్ధ దంపతులు రూ.14.85cr పోగొట్టుకున్నారు. ఐరాస రిటైర్డ్ ఉద్యోగులైన వీరిని 17 రోజులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మనీలాండరింగ్ కేసులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని నకిలీ పోలీసులు వీడియో కాల్స్లో బెదిరించి డబ్బు గుంజారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
AP: NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకండి సమీపంలో కారు వాగులోకి దుసుకెళ్లింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ఉండగా.. స్థానికులు వెంటనే వాగులోకి దూకి వారిని కాపాడారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో నీలకంఠ(హైదరాబాద్) అనే వ్యక్తి అందులో ఇరుక్కుని మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు సహా మహిళ మృతి చెందింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు కుంటలో పడగా.. వారికి కాపాడానికి వెళ్లిన మహిళ కుంటలో పడి మరణించింది. మృతులు ఉమాదేవి మాంజి(32), కిరానికుమార్(13), బిర్జు మాంజి(6)గా పోలీసులు గుర్తించారు.
అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. క్లే కౌంటీలో జరిగిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మూడు వేర్వేరు ప్రదేశాల్లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకొని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పిటి) గ్రామానికి చెందిన రావెల్లి దుర్గయ్య చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబీకుల దశదినకర్మ పురస్కరించుకుని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దుర్గయ్య కాలుజారి చెరువులో పడి మృతి చెందాడు. గజ ఈతగాల్ల సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
బీహార్లో భారీ స్కాం బయటపడింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో మహిళలను గర్భవతులను చేస్తే రూ.10L.. ఫెయిలైతే రూ.5L ఇస్తామని సైబర్ నేరగాళ్లు పలువురిని మోసం చేశారు. అందమైన ఆడవాళ్ల ఫొటోలు చూపించి రిజిస్ట్రేషన్కు రూ.799, సెక్యూరిటీ డిపాజిట్ కింద 25 వేలు, ఇలా పలు కారణాలతో 100 మంది నుంచి రూ.50 లక్షల వరకు కాజేశారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదైంది.
TG: పెట్టుబడుల పేరుతో మాజీ IPS భార్యను సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.2.58 కోట్లు మోసం చేశారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వాట్సాప్లో నేరగాళ్లు పంపించిన నకిలీ సెబీ సర్టిఫికేట్లు, ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈనెల 5 వరకు మాజీ IPS భార్య లావాదేవీలు నిర్వహించారు. మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లను పంపించారు.
ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: వరంగల్లో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ క్రమంలో ఆరుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు ముఠా సభ్యులు నరేష్, యాదగిరిని అరెస్ట్ చేశారు. పిల్లలులేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, 12 సెల్ఫోన్లను సీజ్ చేశారు. చిన్నాలను కొన్న 8 మందిపై కేసు నమోదు చేశారు.
TG: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. శంషాబాద్ పరిధిలోని మధురానగర్ ప్రాంతంలో దుండగులు ఓ యువకుడిని గొంతు కోసి హతమార్చారు. నడిరోడ్డుపై, జన సంచారం ఉన్న చోట హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.