AP: కడప జిల్లా పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిలో వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్కుమార్ కూడా ఉన్నాడు. గతంలో తుపాకీ లైసెన్స్ కలిగి, ఒకరిని కాల్చి చంపిన కేసులో భరత్ నిందితుడు.
TG: HYD అబ్ధుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చెట్లకు నీరు పడుతున్న ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్గఢ్లోని వేదాంత పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణకు ఆదేశించింది.
ఛత్తీస్గఢ్లోని సక్తీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ పవర్ప్లాంట్లో పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
AP: మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో పొలంలో ఏర్పాటు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు శశి(12), దీపక్(10)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ఒంగోలులోని గద్దలగుంటలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన కన్నతల్లి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 544పై సోమవారం రాత్రి మాడమంచు ముసలయ్య గొర్రెల మందపైకి గుర్తుతెలియని లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 3 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చింతకుంట్ల నుంచి తిరుప్పాయిపాలెం వైపు వెళ్తుండగా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
AP: అనకాపల్లి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పొలంలో ఒక్కసారిగా 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సమీపంలోని సరుగుడు తోట పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అధికారులు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు.
TG: రంగారెడ్డి(D) చేవెళ్ల(M) నారాయణదాస్ గూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో భార్య లావణ్య, కుమార్తె ప్రార్ధన తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
తిరుపతి నుంచి విమానాశ్రయం వెళ్లే మార్గంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కాలువలో నీటి లోతు తక్కువగా ఉండటంతో డ్రైవర్ బాబు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ముర్బాద్ సమీపంలోని గోవిలి గ్రామం వద్ద ఉన్న రైతా వంతెనపై ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను సిమెంట్ మిక్సర్ బలంగా ఢీకొట్టిడంతో 11 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశాడు. బిస్కెట్ కలర్ షర్ట్, పాచి కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. అతడిని ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పలమనేరు పోలీసులు కోరారు.
TG: హైదరాబాద్ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రమణ ఓ NRI ఖాతా నుంచి రూ.7 కోట్లు కాజేశాడు. ఆస్ట్రేలియాలో ఉండే బాధితుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి 41 విడతల్లో ఈ సొమ్ము డ్రా చేశాడు. 2024లో ఫిర్యాదు అందగా, పరారీలో ఉన్న నిందితుడిని పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరికొందరు సిబ్బంది ప్రమేయంపై విచారణ జరుగుతోంది. ప్రజల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన మేనేజరే మోసానికి పాల్పడటం సంచలనం రేపింది.
TG: వికారాబాద్(D) పెద్దేముల్ మండలం తట్టేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరు రుక్మాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నైజీరియాలో భారీ వైమానిక దాడి జరిగి 200 మందికి పైగా మరణించారని సమాచారం. ఈశాన్య ప్రాంతంలో ఉన్న యోబో-బోర్నో రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో నైజీరియా ఎయిర్ఫోర్స్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే ప్రభుత్వ ఎయిర్ఫోర్స్ వైమానిక దాడుల వల్ల ఇన్ని వందల మంది పౌరులు చనిపోవడం ఇప్పుడు నిరసనలకు దారితీస్తోంది.