ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఒడిశా రవుర్కెలాలోం ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో 9 మంది ప్రయాణికులు ఫ్లైట్లో ఉన్నట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: వరంగల్లో చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు అయింది. ఈ క్రమంలో ఆరుగురు చిన్నారులను రక్షించిన పోలీసులు ముఠా సభ్యులు నరేష్, యాదగిరిని అరెస్ట్ చేశారు. పిల్లలులేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, 12 సెల్ఫోన్లను సీజ్ చేశారు. చిన్నాలను కొన్న 8 మందిపై కేసు నమోదు చేశారు.
TG: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య జరిగింది. శంషాబాద్ పరిధిలోని మధురానగర్ ప్రాంతంలో దుండగులు ఓ యువకుడిని గొంతు కోసి హతమార్చారు. నడిరోడ్డుపై, జన సంచారం ఉన్న చోట హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక చెంచుపేట సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద షేక్ ఫయాజ్(50) అనే వ్యక్తిపై దుండగులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫయాజ్ AC మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడని తెలిపిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: నిందితుడి నుంచి డబ్బులు తీసుకుని వదిలేశారు కర్నూలు జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. HYDకు చెందిన అతణ్ని పట్టుకుని కర్నూలుకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో నలుగురు కానిస్టేబుళ్లు డబ్బులు తీసుకున్నారు. దీనిపై తాను చేయని తప్పుకు బెదిరించి లక్షలు వసూలు చేశారని అతను ఆధారాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లపై వారు చర్యలకు సిద్ధమయ్యారు.
చిత్తూరులో దివ్యాంగుడైన SBI మేనేజర్ గణేష్, పెళ్లి కోసం ఒత్తిడి చేసిన తన ప్రియురాలు దివ్యాంగురాలైన కవితను దారుణంగా హత్య చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్గా గుర్తింపు పొందిన గణేష్, ఆమెను వంతెన పైనుంచి తోసి చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు పంపిన వాయిస్ సందేశాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
TG: ఖమ్మం నగరంలో నడిరోడ్డుపై ప్రమిళ అనే వివాహితను దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. నగరంలోని కస్బానగర్లో ఈ ఘటన జరగ్గా.. మృతురాలిని భద్రాచలం వాసిగా గుర్తించారు. పిల్లలు పుట్టని కారణంతో ఆమె, తన భర్త RMP డాక్టర్ BN రావు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఆమెను శ్రావణ్ అనే ఫ్రెండ్ వేధించడంతో.. అతనిపై కేసు పెట్టింది. దీంతో అతనే ఈ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
హిమాచల్ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడటంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ బస్సు సిమ్లా నుంచి కుప్వి వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది. ముగ్గురు బాలలకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల బిక్షాటన చేసే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ శంకర్, పోలీస్ అధికారులు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పర్వతగిరి పోలీస్ స్టేషన్, ఎస్సై ప్రవీణ్ (8712685028, 8712685242)ను సంప్రదించాలని కోరారు.
AP: విశాఖపట్నంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గాజువాకలోని ఓం జ్యూవెలరీ, పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యూవెలరీలో చోరీకి ముఠా సభ్యులు పథకం రూపొందించారు. కస్టమర్లుగా వచ్చి ఆభరణాలను కొప్పులో, చీరల్లో దాచి పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే సమాచారం ఇవ్వడంతో రెండు ముఠాలకు చెందిన ఏడుగురిని పోలీసులకు అరెస్ట్ చేశారు.
AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత పట్టాదారు పాస్ పుస్తకాలు, దస్త్రాలు ఉన్న గదిలో మంటలు చెలరేగాయి. కార్యాలయం పక్కన ఉన్న స్థలంలో చలిమంట నుంచి వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. చలిమంట, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, కావాలనే చేశారా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు ఆర్డోవో బాలకృష్ణ వెల్లడించారు.
AP: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. మంటల తీవ్రత తగ్గినా పూర్తి నియంత్రణకు ఓఎన్జీసీ ముమ్మర చర్యలు చేపట్టింది. గూడపల్లి నుంచి నీటిని వినియోగించుకుని అగ్నికీలలను సిబ్బంది చల్లారుస్తున్నారు. బ్లో అవుట్తో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేశారు.
TG: సినిమా షూటింగ్కు వెళ్లొస్తున్న బస్సు హైదరాబాద్ శివారు పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారుజామున ఫ్లైఓవర్ స్టార్టింగ్లో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా.. మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ నుంచి HYD మణికొండకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.