• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ముక్కు అందంగా ఉందని కొరికేసిన భర్త

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బేర్పారాకు చెందిన బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్ ముక్కును కొరికేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన ముక్కు చాలా అందంగా ఉందని, అవకాశం దొరికితే దానిని కొరికి తినేస్తానని భర్త తరచూ అనేవాడని ఫిర్యాదులో పేర్కొంది. చివరకు అతను అన్నంత పని చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

May 5, 2025 / 11:26 AM IST

రేపల్లెలో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

బాపట్ల: రేపల్లెలో సోమవారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. 5వ వార్డులో నివసించే సింగోటి కోటేశ్వరమ్మ అనే మహిళా ఉద్యోగి తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

May 5, 2025 / 10:18 AM IST

BREAKING: అగ్నిప్రమాదం

TG: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. 

May 4, 2025 / 08:23 PM IST

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

HYD: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళం అని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2025 / 03:00 PM IST

పాము కాటుతో వివాహిత మృతి

NRML: పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రజిత ఇంటి సమీపంలో పాముకాటుకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రజిత మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

May 4, 2025 / 12:53 PM IST

చెట్టు విరిగిపడి బాలుడు మృతి

ELR: ముసునూరు గ్రామంలో ఈదురు గాలులు వర్షానికి విరిగిపడిన చెట్టు కారణంగా 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా బాల గోవిందం అనే బాలుడు నిద్రిస్తుండగా ఆరు బయట ఉన్న వెలగ చెట్టు ఈదురు గాలులకు విరిగిపడింది. ఈ సంఘటనలో బాల గోవిందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

May 4, 2025 / 11:19 AM IST

వాటర్ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

VSP: గాజువాక డిపో వద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్‌లో పడి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ లోపలికి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. పరిసరప్రాంత ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.

May 3, 2025 / 08:24 PM IST

బైక్ ఢీకొని మహిళ మృతి

MBNR: మరికల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్లో మృతి చెందింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు మండల కేంద్రానికి చెందిన తిరుపతమ్మ హోటల్‌లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూన్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే మృతి చెందింది.

May 3, 2025 / 08:17 PM IST

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

ASR: డుంబ్రిగుడ మండల కురిడి సమీపంలోని చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పాపినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోగిలికి చెందిన కే.నాగేశ్వరరావు అనే గిరిజనుడు కనిపించడం లేదని ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శనివారం కురిడి సమీపంలోని ఆయన మృతదేహం లభ్యం అయిందన్నారు.

May 3, 2025 / 08:07 PM IST

గుడిపాల వద్ద రోడ్డు ప్రమాదం

CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్రబాబు (35)తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 3, 2025 / 06:51 AM IST

నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం

PLD: నరసరావుపేటలోని ఎస్‌ఆర్కేటీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాత మాగులూరుకి చెందిన గోపి బుక్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎస్‌ఆర్కేటీ కాలనీ వద్ద వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను వదిలి డ్రైవర్ పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 2, 2025 / 08:09 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్ర బాబు తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతి వేగంగా వచ్చిన జేసీబీ ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.

May 2, 2025 / 07:55 PM IST

వైన్స్‌లో గొడవ.. యువకుడు మృతి

మేడ్చల్: కూకట్‌పల్లి PS పరిధిలోని దారువాల వైన్‌షాప్ పర్మిట్ రూమ్‌లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రకారం.. గత నెల 5న కేశవ్, ధనుష్ ఇద్దరు దారువాల వైన్స్ పరిమిట్ రూంలో మద్యం తాగుతుండగా గొడవ జరిగింది. ధనుశ్‌పైన కేశవ్ అతడి స్నేహితులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. గాయాలపాలైన అతడు ఇవాళ మృతి చెందాడు.

May 2, 2025 / 07:07 PM IST

సిగరెట్ ఇవ్వలేదని MURDER..!

HYD: పాతబస్తీ ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలకుంటా చస్మా ప్రాంతంలో మజీద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి మజీద్‌పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

May 2, 2025 / 04:37 PM IST

అనుమానస్పదంగా వివాహిత మృతి

KKD: పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో అబ్బిరెడ్డి వర్షిత(21) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ బిడ్డను భర్త బాబ్జి, కుటుంబసభ్యులు కలిసి హింసించి చంపేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని మృతురాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

May 2, 2025 / 01:12 PM IST