TG: భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుక్కపురం గ్రామంలో నీలిమ అనే మహిళ తన కుమారుడు, కుమార్తెపై కత్తితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యకు యత్నించింది. తన భర్తతో కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉండటంతో తన తల్లి ఇంటికి చేరుకున్న నీలిమ తెల్లవారుజామున పిల్లలపై దాడి చేసింది. గొంతు కోయడంతో కుమార్తె (13) అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడికి గాయాలయ్యాయి.