AP: విశాఖపట్నంలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక బీహెచ్పీవీ కూడలిలో రెండు కార్లు, మూడు బైకులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.