TG: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.