AP: నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటి 64 లక్షలను సీజ్ చేశారు. త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.
AP: గంజాయి కేసులో వైసీపీ ఎంపీటీసీ చెల్లూరి నగేష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన నగేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా గంజాయి కేసులో నగేష్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా వైసీపీ ముఖ్య నాయకుడికి ఆయన అనుచరుడిగా ఉన్నారు.
రాజస్థాన్లోని డీగ్ జిల్లా నియామత్ పూర్లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఊరేగింపులోని డీజే వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్కు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీ ముఖర్జీనగర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన రెండేళ్ల అల్లుడిని వాకింగ్కు తీసుకెళ్లి గొంతు కోసి చంపింది. ఈ ఘాతుకానికి పాల్పడిన సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
TG: హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితమే బాంబు ఉందని మెసేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగంతకులు మళ్లీ బాంబు ఉన్నట్లు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ కోర్టులో ఉన్న సిబ్బంది, ప్రజలను బయటకు పంపించి తనిఖీలు చేపట్టింది. కాగా, ఇటీవల బాంబు బెదిరింపు ఘటనలు పెరిగిన విషయం తెలిసిందే.
TG: అమీర్పేట్ మైత్రీవనంలోని ఓ అపార్ట్మెంట్ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలువురు విద్యార్థులు ఈ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడ ఉన్న యువకులు, పోలీసులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లో భారీ ఆన్లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
MP బుర్హాన్పూర్లో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరుగుతుండగా, ఓ టీచర్ ఏకంగా ప్రశ్నపత్రాన్ని తన వాట్సాప్ స్టేటస్లో పెట్టింది. విద్యార్థులు కాపీ కొట్టేందుకు ఆమె ఈ పని చేసినట్లు తేలింది. దీనిపై సీరియస్ అయిన అధికారులు ఆ ఉపాధ్యాయురాలితో పాటు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కుటుంబకలహాల కారణంగా ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్దూత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రంగా గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: HYDలోని అమీన్ పూర్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండున్నర కిలోల OPM డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న.. రాజస్థాన్కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
TG: HYD బాలాపూర్లో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగింది. 20 మంది దుండగులు వచ్చి ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.