ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, సౌతాఫ్రికాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 100 మందికి పైగా మృతిచెందారు. జింబాంబ్వేలో 70, సౌతాఫ్రికాలో 30 మంది మృతిచెందినట్లు సమాచారం. మొజాంబిక్లో 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. సహాయక బృందాలు హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నాయి. నేషనల్ పార్క్లో 600 మంది పర్యాటకులు చిక్కుకున్నారు.
TG: HYDకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో 300 శాతం లాభాలంటూ నమ్మించి ఓ నకిలీ యాప్ డౌన్లోడ్ చేయించారు. తొలుత రూ.50 వేల లాభం చూపించి నమ్మకం కలిగించారు. దీంతో ఆయన విడతల వారీగా రూ.2.9 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రూ.3.47 కోట్ల బ్యాలెన్స్ కనిపిస్తున్నా, విత్డ్రా కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
TG: HYDకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో 300 శాతం లాభాలంటూ నమ్మించి ఓ నకిలీ యాప్ డౌన్లోడ్ చేయించారు. తొలుత రూ.50 వేల లాభం చూపించి నమ్మకం కలిగించారు. దీంతో ఆయన విడతల వారీగా రూ.2.9 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రూ.3.47 కోట్ల బ్యాలెన్స్ కనిపిస్తున్నా, విత్డ్రా కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
NZB: బోధన్ చెక్కి క్యాంప్ శివారులో శనివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెంటాఖుర్దు నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
విశాఖ మద్దిలపాలెంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, స్కూటీ ఒకే దిశలో వెళ్తుండగా, స్కూటీ అదుపుతప్పి పల్సర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి బస్సు వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నంద్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. నంద్యాల పట్టణం లలితా నగర్కు చెందిన మల్లిక.. తన పిల్లలకు విషమిచ్చి తానూ ఉరి వేసుకుంది. కొన ఉపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. మల్లికను భర్త, ఆడపడుచులే హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తుండటంతో.. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: గ్రేటర్ HYD ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ రాంరెడ్డి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసింహ(50) అనే వ్యక్తి డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందాడు. సైకిల్పై వెళ్తున్న సమయంలో రోడ్డు పరిస్థితి అద్వానంగా ఉండటంతో టైర్ స్లిప్ అయి డ్రైనేజీ కాలువలో పడ్డాడు. కాగా, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు స్థానికులు తెలిపారు.
HYD: గ్రేటర్ HYD ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ రాంరెడ్డి నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసింహ(50) అనే వ్యక్తి డ్రైనేజీ కాలువలో పడి మృతి చెందాడు. సైకిల్పై వెళ్తున్న సమయంలో రోడ్డు పరిస్థితి అద్వానంగా ఉండటంతో టైర్ స్లిప్ అయి డ్రైనేజీ కాలువలో పడ్డాడు. కాగా, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు స్థానికులు తెలిపారు.
VZM: శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
TG: ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో విషాదం జరిగింది. కుమారుల మృతితో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి.. ఇద్దరు కుమారుడు చనిపోయారు. వారి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తల్లిదండ్రులు.. ఇవాళ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది.
AP: నంద్యాల జిల్లా ఎన్జీవో కాలనీలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషం ఇచ్చి చంపింది. అనంతరం తల్లి మల్లిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను నంద్యాల జీజీహెచ్కు తరలించారు.
KDP: ప్రొద్దుటూరు-యర్రగుంట్ల మధ్య రైల్వే లైన్లో KM 115/10–11 వద్ద OHE పోల్ సమీపంలో HX/PSPY రైలు కిందపడి 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని GRP పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు GRP యర్రగుంట్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.
KDP: వంటగదిలో వాయుబండ లీకేజీతో జరిగిన ప్రమాదంలో మైదుకూరు పురపాలక కౌన్సిలర్ మామిళ్ల వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. దోమల నివారణకై అగరబత్తి వెలిగించే ప్రయత్నంలో మంటలు చెలరేగడంతో ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు గుర్తించి, ఆయనను బయటకు తీసుకువచ్చే లోపే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రెడ్డినగర్లో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో MBBS విద్యార్థి ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా: పెదపారుపూడి మండలం భూషణగుళ్లలో కోడిపందేల బరిలో శుక్రవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పందెం గొడవలో అనగాని జగన్నాథం అనే వ్యక్తిపై ప్రత్యర్థులు కోడి కత్తితో పీకపై దాడి చేశారు. ఈ ఘటనలో జగన్నాథానికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్థానికులు అతడిని గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

