TG: వికారాబాద్ జిల్లా తాండూరులో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: వికారాబాద్ జిల్లా తాండూరులో మరో బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ముంబై ఎయిర్పోర్టులో అధికారులు భారీగా విదేశీ కరెన్సీ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.87 లక్షల విలువైన అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
KDP: సిద్ధవటంలో రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి భాకరాపేట – కనుములోపల్లె మధ్యలో మిట్టపల్లి వద్ద ఉన్న రైల్వే ట్రాక్ పై గూడ్స్ రైలు కింద పడి(60) వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు గీతలు ఉన్న బులుగు రంగు చొక్కా ఉన్నట్లు రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. SI 9440 900811, CI 9440627398 నంబర్లకు తెలపాలన్నారు.
WNP: పాము కాటుతో యువకుడు మృతి చెందిన విషాద ఘటన పెబ్బేరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గంధం రవి(19) సోమవారం రాత్రి తన వరి పొలానికి నీళ్లు పెట్టి వస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు.
NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ ఎదుట మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ చెరువు కట్టపై అతివేగంగా వచ్చిన థార్ వాహనం పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. చెరువులో పడి యువతి చనిపోయింది.
TG: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కొడుకు, కూతురు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
VKB: ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటన తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్గనూర్ గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్దపుల్లన్న అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
దీపావళి రోజు తండ్రీకొడుకులు టపాసులకు బదులు తుపాకీలను కాల్చటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని శాస్త్రీనగర్కు చెందిన ముకేశ్, అతని తండ్రి పండుగ రోజున తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.
NRML: కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి శనివారం ఖానాపూర్లో వివాహానికి వెళ్లే సందర్భంలో మార్గమధ్యలో కడెం ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగి క్రమంలో ప్రాజెక్టులో పడి గల్లంతాయాడని వారు తెలిపారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
ATP: గుత్తి మండలం చెరువు తండాకు చెందిన లక్ష్మీబాయి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా శనివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడులోని ఎన్నూరు బీచ్ వద్ద సముద్ర స్నానం కోసం వెళ్లిన నలుగురు యువతులు అలల తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులను దేవకి సెల్వమ్(30), భవాని(19), షాలిని(17), మరియు గాయత్రి(18)గా గుర్తించారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతుల్లో ఒకరైన దేవకి, శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.