BPT: మార్టూరు జాతీయ రహదారిపై రెస్ట్ ఏరియా వద్ద శుక్రవారం వేకువ జామున ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది ప్రయాణికుల్లో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108, హైవే అంబులెన్స్ల ద్వారా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NGKL: తాడూరు మండలం తుమ్మలసూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్తో తల్లి జయమ్మ(40), కొడుకు శ్రీకాంత్(15) మృతి చెందారు. పిండిగిర్ని నడుపుతుండగా శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురైన నేపథ్యంలో కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో తల్లి జయమ్మ కూడా షాక్కు గురికావడంతో కొడుకుతోపాటు తల్లి మృతి చెందారు.
విజయవాడ పటమటలో ద్విచక్ర వాహనల దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువ చేసే 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా ప్రవర్తించిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ చెప్పారు. దుండగులు మోపిదేవికి చెందిన ప్రసాద్, కానూరుకు చెందిన రబ్బానీగా గుర్తించామన్నారు.
SRD: అర్సీపురం పోలీసు స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కన ఆటో స్టాండ్లో తన బ్యాగ్ పెట్టి ఫ్లైఓవర్ పైకి వెళ్లి కిందకు దూకగా వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి బ్యాగులో తాపీ తదితర సామాగ్రి ఉన్నాయి. పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది
WGL: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాయపర్తి మండలం ఆర్ఆర్ కాలనీ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో గొర్రెల కాపరి జయవర్ధన్ అనే యువకుడు గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు జయవర్ధన్ అనే యువకుడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. కుందూ నది దాటే క్రమంలో నదిలో పడి మృత్యువాత పడ్డాడు. రేవనూరు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసుకున్నారు.
SRPT: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడిగుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గొర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.
నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో ఈ నెల 9న పామూరు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ వాసు అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశారు. ఈ కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ వాసు హత్య కేసులో 9మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్కు తరలించారు.
బుచ్చి మండలం నాయగుంట గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన రఫీ ఈ ఘటనలో మృతి చెందారు. పోలి నాయుడు చెరువు గ్రామానికి చెందిన కొందరు కత్తులతో, కర్రలతో దాడి చేశారని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి, ఆస్పత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామం సమీపంలోని పొలాల్లో మంగళవారం ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఈ శవాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహం నుంచి అనేక ఆధారాలను పరిశీలించి, ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: కాకినాడ YSR బ్రిడ్జిపై సోమవారం ఉదయం ప్రయాణిస్తున్న బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనంపై ప్రయాణిస్తున్న వారు బండిని అక్కడే వదిలేశారు. వాహనం మొత్తం పూర్తిగా మంటలో కాలిపోయింది. దీంతో బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: పెయింటింగ్ పనులు చేస్తున్న పెయింటర్కు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఏలూరు 1వ పట్టణ పరిధిలో సుబ్రహ్మణ్యం కాలనీలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు పోతునూరుకు చెందిన లింగాల పరశురాం(31)గా గుర్తించారు. బ్యాంకు ఉద్యోగి ముత్తయ్య ఇంట్లో పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చివ్వెంల మండలం గుంజలూరు వద్ద చోటు చేసుకుంది. స్కూటీపై రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి దాసాయిగూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ADB: జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించిన కీర్తి హత్య అతి కిరాతకంగా హత్య చేసిన భర్త మారుతి కూడా స్థానిక వాగు పక్కన గల కాల్వలో శవమై తేలాడు. కీర్తిని హత్య చేసి పరారైన మారుతి అదే రోజు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కీర్తి మారుతి మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
WGL: వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.