E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో శ్రీ ఉమా లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల రెండో తేదీన అర్ధరాత్రి హుండీని గుర్తుతెలియని వ్యక్తి దొంగలించారు. ఆలయ ఛైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోకవరం ఎస్సై పవన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన గుర్రం అదిత్య సాయికుమార్ దొంగతనం పాల్పడ్డాడని గుర్తించి అరెస్టు చేశారు.
VZM: బాడంగి మండలంలో మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఆనవరం గ్రామానికి చెందిన అంపవల్లి సంతు (31) కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం వేగావతి నదిలో స్నానానికి దిగింది. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయి కారాడ దగ్గర తేలింది. బంధవులు బాడంగి CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
KMR: భిక్కనూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నరసింహులు (35) మద్యం మత్తులో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి పని చేయకుండా మద్యం తాగుతూ తిరిగే నరసింహులు, ఇంట్లో డబ్బులు అడగ్గా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
RR: చేవెళ్ల బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు నగరంలోని ఓ మురుగు కాలువలో బుధవారం మృతదేహం కలకలం రేపింది. ఒకటవ పట్టణ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. మృతదేహం నీటిపై తేలి ఆడుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకటవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MLG: అడవి పందుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలంలో చోటుచేసుకుంది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన కుందురు వెంకటేశ్వర రెడ్డి(65) అనే రైతు ఇవాళ తన పంట పొలం వద్దకు వెళ్ళి, పంట పరిశీలిస్తుండగా హఠాత్తుగా అడవి పందులు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళల హాస్టల్ బాత్ రూమ్లలో స్పై కెమెరాలు కలకలం రేపాయి. ఈ ఘటన తమిళనాడు నాగమంగళగ్రామం పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆ కెమెరాలను అమర్చిన నేరారోపణపై ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తగిన భద్రత కల్పించాలని, అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవాలంటూ 2000 మంది మహిళలు డిమాండ్ చేయడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
SRPT: మోతే మండలం మామిళ్లగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కార్లో ఉన్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముంబైలో మోనో రైలు పట్టాలు తప్పింది. అయితే, ట్రైన్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వడాలా-జీటీబీ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కూడా మెట్రో రైలు తరహా లాంటిదే. అదృష్టవశాత్తు రైలు కింద పడలేదు. పైనే ఉంది. కింద పడి ఉంటే తీవ్రమైన ప్రమాదం జరిగేది. మోనో రైలు.. సింగిల్ ట్రాక్పై వెళ్తుంది. కొంత వరకు తేలిగ్గా, సన్నగా ఉంటుంది.
AP: కాకినాడ జిల్లా తుని మండలంలో విషాదం చోటుచేసుకుంది. లోవకొత్తూరుకు చెందిన పదో తరగితి విద్యార్థి కొండ్ర కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు సమీపిస్తుండటంతో చదవలేకపోతున్నానే మనోవేదనతో హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. సరిగా చదవలేకపోతున్నానని, మార్కులు రావట్లేదని తరచూ చెప్పేవాడని తండ్రి శ్రీను తెలిపాడు.
యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చునార్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు పట్టాలు దాటుతుండగా.. రైలు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ ప్రయాణికులు ప్లాట్ ఫాంపై కాకుండా పట్టాల వైపు రైలు దిగినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలోని హల్లిఖేడ్లో వ్యాను, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
AP: కళాశాల భవనం పైనుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరులో జరిగింది. కొంగారెడ్డిపల్లికి చెందిన రుద్రమూర్తి(19) మురకంబట్టులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. నిన్న 3వ అంతస్తుపైకి వెళ్లి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని యాజమాన్యం, పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాలి.
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం భాష్యం స్కూల్లో దారుణం జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న రంజిత అనే బాలిక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీచర్ వేధింపులకు మనస్థాపానికి గురైందని కుటుంబ సభ్యులు ఆరోస్తున్నారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
NZB: నవీపేట్ మండలంలోని ఓ పెట్రోల్ బంక్లో పార్క్ చేసిన ట్రాక్టర్ చోరీకి గురైందని ఎస్సై తిరుపతి తెలిపారు. నీల గ్రామానికి చెందిన అఫ్రోజ్ ఖాన్ బ్లేడ్ టాక్టర్ని అక్టోబర్ 18న పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉంచి తర్వాత అక్టోబర్ 22న సాయంత్రం వచ్చి చూడగా కనిపించలేదన్నారు. ఎంత వెతికినా కనిపించక పోయేసరికి మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు.