• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

మహిళకు వేధింపులు.. ZPTCపై కేసు నమోదు

AP: ప.గో జిల్లా వీరవాసరం ZPTC జయప్రకాష్‌పై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.10 లక్షల నగదు, బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. శారీరకంగా, మానసికంగా వేధించాడని వీడియో విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు అతడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

April 10, 2026 / 09:04 AM IST

తిరుమలలో VIP దర్శనం పేరుతో మోసం

AP: తిరుమలలో VIP దర్శనం పేరుతో ఓ దుండగుడు మోసానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడు సెంథిల్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. TTD లోగోతో నకిలీ ప్రకటనలు చేస్తూ.. ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసానికి తెర దించాడు. ఒక్కో టికెట్‌కు రూ.16,500 వరకు వసూలు చేశాడు. అతడిపై కేసు నమోదు చేసి ల్యాప్‌టాప్, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 10, 2026 / 08:54 AM IST

ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

KKD: తునిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తాటిపర్తి బాలాజీ(28) అనే యువకుడు గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. మృతుడు ప్రత్తిపాడు ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 

April 10, 2026 / 08:22 AM IST

హైవే పై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: కలువాయి మండలంలోని సచివాలయం సమీపంలో గురువారం రాత్రి 2 బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అనంతరం 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 08:17 AM IST

డ్రంకెన్ డ్రైవ్.. ఇద్దరికి జరిమానా

E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని SI పీ.మనోహర్ హెచ్చరించారు. దేవరపల్లి పరిధిలోని NHపై మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బైక్ నడుపుతున్న రామారావు, లారీ నడుపుతున్న సుబ్రహ్మణ్యంలను పట్టుకుని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా రూ. 11, 500 జరిమానా విధించినట్లు తెలిపారు. 

April 10, 2026 / 06:50 AM IST

మైనర్ డ్రైవింగ్‌పై 98 కేసులు నమోదు

ATP: జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మొత్తం 98 కేసులు నమోదు చేసి, 97 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

April 10, 2026 / 06:16 AM IST

ముంబై విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1Bలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్మినల్ లోపలి కేబుల్ ట్రేలు, స్విచ్ బాక్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

April 10, 2026 / 05:43 AM IST

విషాదం.. ముగ్గురు బాలికలు మృతి

AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతూ నలుగురు బాలికలు జలపాతంలో పడిపోయారు. దీంతో ముగ్గురు మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా పోలీసులు గుర్తించారు.

April 9, 2026 / 04:05 PM IST

హైవేపై ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

NLR: వరికుంటపాడు సమీపంలో 565 జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పేలి బోల్తా పడిన ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బోల్తాపడ్డ ఆటో మర్రిపాడు మండలం పొంగూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 03:50 PM IST

సెల్ఫీల సరదా… ముగ్గురు ప్రాణాలు బలి

ASR: అనంతగిరి మండలంలో సెల్ఫీల సరదా విషాదంగా మారింది. వాలసి పంచాయతీ మలుంగుమ్మి జలపాతంలో గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువతులు మృతి చెందారు. బూర్జ పంచాయతీ జంబువలసకు చెందిన నలుగురు అమ్మాయిలు ఫొటోలు తీసుకునేందుకు జలపాతానికి వెళ్లారు. ముగ్గురు నీటిలోకి దిగగా, మరో యువతి సెల్ఫీ తీస్తుండగా జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

April 9, 2026 / 03:37 PM IST

రెండు స్కూటీలు ఢీకొని ఇద్దరు మృతి

AP: కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లె వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్ టేక్ చేయబోయి రెండు స్కూటీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మృతులు నాగిరెడ్డి(35), కుందా శేఖర్(45)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 12:51 PM IST

హైవే‌పై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ATP: పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలోని 63వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

April 9, 2026 / 12:33 PM IST

మానవత్వం ఉన్న మంచి దొంగ..!

MBA చదివి గోల్డ్ మెడల్ సాధించిన వంశీకృష్ణ, జల్సాల కోసం గజదొంగగా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 62 చోరీలు చేశాడు. దొంగిలించిన సొమ్ముతో బౌన్సర్లను పెట్టుకుని తిరిగేవాడు. అదే సమయంలో పేద పిల్లలను చదివిస్తూ మానవత్వం చాటుకునేవాడని తెలుస్తోంది. చివరికి చౌటుప్పల్ పోలీసులు వాహనాల తనిఖీలో ఇతడిని అరెస్ట్ చేసి, నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

April 9, 2026 / 12:27 PM IST

యూరియా నీరు తాగి 15 గొర్రెలు మృతి

సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.

April 9, 2026 / 10:05 AM IST

ఉద్యోగినిపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

AP: పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితుడికి మాచర్ల కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. నిందితుడు నామాల శ్రీనును నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం మాచర్ల కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో గురజాల సబ్ జైలుకు తరలించారు.

April 9, 2026 / 09:58 AM IST