HYD: మహారాష్ట్రకు చెందిన యువతి(22) రాత్రి సమయంలో జూబ్లీహిల్స్లో ఒంటరిగా నిల్చొని ఉండగా మల్లికార్జునరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఆశ్రయమిస్తానని నమ్మించాడు. కమలాపురికాలనీలోని గదికి తీసుకెళ్లి భోజనం పెట్టి ఆకలితీర్చాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించగా యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు.
KDP: చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. కవల పిల్లలైన రామ్, లక్ష్మణ్ నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వీరు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందినవారు. చిన్నప్పుడే వీరి తండ్రి చనిపోవడం, తల్లి మరొకరితో వెళ్లిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పిఠాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దుర్గాడకు చెందిన మమత కాకినాడ వెళ్తుండగా.. రాపర్తి రోడ్డు వద్ద గేదె అడ్డురావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె చెల్లి కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: పిఠాపురంలో బొజ్జ రాంప్రసాద్, బొజ్జ వీరబాబు అనే వ్యక్తులు ఆదివారం తనపై దాడి చేశారని జనసేన నాయకుడు, పిఠాపురం మాజీ ఎంపీపీ కురుమళ్ రాంబాబు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటిక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో తాను పాపిడి దొడ్డి చెరువు వద్దకు వెళ్లగా.. తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మణిపాల్ స్కూల్ వెనుక విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని పెట్రోల్ పోసి దుండగులు తగలబెట్టారు. వారం ముందు విద్యార్థిని అదృశ్యమైనట్లు తెలుస్తోంది. కాగా వన్టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం మిట్టమీదపల్లిలో రైతు సురేశ్కు చెందిన పాడి ఆవు ఆదివారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. రైతు సురేశ్ వివరాల మేరకు.. ఆదివారం పాడి ఆవును మేపడం కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ విద్యుత్ వైర్ తగిలి ఆవు మృతి చెందిందినట్లు తెలిపారు. తనకు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
SKLM: గార మండలం కోళ్లపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం శ్రీకాకుళానికి చెందిన ఆనందరావు అతని స్నేహితుడు గణపతి రావు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ కోళ్లపేట వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆనందరావు అక్కడికక్కడే మృతిచెందగా, గణపతి రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
NLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు నకిరేకంటి సైదులు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తిప్పర్తి మండలం తానేదారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన సైదులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చకిలం అనిల్ కుమార్ ప్రధాన శిష్యుడిగా స్వరాష్ట్ర సాధన కోసం శ్రమించారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నారు.
TG: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో విషాదం జరిగింది. సాయి అనే వ్యక్తి ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని చూస్తుండగానే సాయి సజీవ దహనం అయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు.
ATP: గుత్తి ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శనివారం కంటైనర్ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
VZM: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. బూరిపేటకు చెందిన పూడివలస వెంకటమ్మ (40) శుక్రవారం మధ్యాహ్నం పశువులను మేపుతున్న సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడటంతో ఆమె అక్కడకక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కృష్ణా: మచిలీపట్నం బందర్ బైపాస్ రోడ్డు నందు ఆటో, డీసీఎం ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ గాయపడి రోడ్డుపై పడి ఉండగా అటుగా వస్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా తన కారులో బందర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
NTR: కంచికచర్ల పట్టణనికి చెందిన దేవిరెడ్డి నాగరాజు ఆర్థిక బాధలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అతని మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
సత్యసాయి: మడకశిర మండలంలో వైస్ ఎంఎంపీ శ్రీరామిరెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రూ.లక్ష నగదు, రెండు బంగారు చైన్లు, రెండు జతల కమ్మలు అపహరించారని సీఐ నాగేశ్ బాబు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: విద్యుత్ ఘాతంతో యువకుడికి గాయాలైన సంఘటన, హుజూర్నగర్ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తన ఇంట్లో ఉన్న చెట్టుకు మునగ కాయలు కోస్తున్న క్రమంలో, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.