W.G: తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రూరల్ ఎస్సై కే.చంద్రశేఖర్ తెలిపారు. తణుకు ఫ్లై ఓవర్ మధ్య ఫుట్ పాత్పై సుమారు 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
CTR: గంగవరం మండలం దండపల్లిలో బైపాస్ రోడ్డుపై ఓ కారు బోల్తా కొట్టింది. చిత్తూరు వైపు నుంచి వస్తున్న కారు స్పీడ్ బ్రేకర్ దగ్గర అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా, అందులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. గంగవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘర్షణకు వివాహేతర సంబంధాలు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో మంటలు వచ్చినట్లు సమాచారం. దీంతో విమానం లాస్వెగాస్ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయ్యింది. విమానంలో ఉన్న 165 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: నవీపెట్ మండలం లింగపూర్ శివారులో బుధవారం రెంజర్ల పోశెట్టి విద్యుత్తు షాక్ తగిలి మరణించాడు. విద్యుత్తు సరఫరా నిలిపివేయకుండా స్తంభం ఎక్కడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
W.G: భీమవరం వన్ టౌన్లో వేణుగోపాలస్వామి గుడి వద్ద నాగమణి అనే మహిళపై పోలిశెట్టి హేమంత్ బుధవారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నాగమణికి గాయాలు కాగా పరుగులు తీసుకుంటూ తన తల్లి వద్దకు చేరుకుంది. దీంతో తల్లి నాగమణిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు దాటుతున్న గోపాల్ అనే వృద్ధుడిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
MLG: రామయ్య పల్లెలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గుగులోతు సోములు (53) అనే వ్యక్తి మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్లగా పాము కాటుకు గురయ్యాడు. అది పురుగు కుట్టినట్లు భావించి ఇంటికి వచ్చి నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు చూసేసరికి అతను మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలోని పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన దుండగులు ఆపై హత్య చేశారు. మృతురాలు ధర్మారెడ్డిపల్లికి చెందిన సత్తెమ్మ (65)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ELR: రైలు ఢీకొనడంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన పులప మహేష్ (32) స్థానికంగా ఒక జ్యూయలరీ దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తుంటాడు. మంగళవారం తన ఇంటి సమీపంలో పట్టాలను దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KMR: భిక్కనూర్ మండలం కాచాపూర్ శివారులో మంగళవారం ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. HYD నుంచి వేల్పూర్కు ఇంటి సామగ్రితో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ORR ఎగ్జిట్ వద్ద కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మేడ్చల్ SOT పోలీసులు అరెస్టు చేశారు. రూ. 50 లక్షల విలువ గల 120.17 కిలోల గంజాయిని వైజాగ్ నుంచి హరియాణాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు ముఠా సభ్యులలో నలుగురు పరారీలో ఉన్నట్టు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
VZM: తెర్లాం పరిధిలో సోమవారం విషాధ ఘటన చోటుచేసుకుంది. రామకృష్ణ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెర్లాం మండలం గంగన్నపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ ఓ గుత్తేదారి వద్ద విద్యుత్ పనులు చేస్తున్నాడు. విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి కింద పడిపోవడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
GNTR: తెనాలిలో ఒంటరి వృద్ధ మహిళలే టార్గెట్గా దారుణ హత్యలు జరుగుతున్నాయి. నెల వ్యవధిలో జరిగిన 4 హత్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ ఓ ముఠా హత్యలకు పాల్పడటంతో పాటు వారి ఒంటిపై బంగారం దోచుకెళ్తున్నారు. ఇటీవల జరిగిన జంట హత్యల కేసును పోలీసులు విచారిస్తుండగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
KKD: కరప మండలం పెనుగుదురు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సైకిల్పై వస్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై తోట సునీత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు