HYD: తన పేరుపై ఇన్స్టాలో నకిలీ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన కామెంట్స్తో పాటు, అశ్లీల ఫోటోలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఓ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనూ సహచర ఉద్యోగి ఇలాగే చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశానని ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా తనే చేసి ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్పోర్టు రోడ్డులో నటుడు బాబీ సింహా కారు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం డ్రైవర్ను అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బాబీ సింహా కారులో లేరని పోలీసులు వెల్లడించారు.
HYD: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్పల్లి PS పరిధిలోని హబీబ్ నగర్లో జరిగింది. మహమ్మద్ చోటు 4 నెలలుగా వెన్ను నొప్పితో పాటు కుడి చేతి నొప్పితో బాధపడుతూ వైద్యం తీసుకుంటున్నాడు. అది ఎంతకీ తగ్గకపోవడంతో ఈరోజు ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRD: మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన నర్సమ్మ(55) అదృశ్యమైనట్లు ఎస్సై రాజేష్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈనెల 16వ తేదీన సదాశివపేటకు వెళ్లిన నరసమ్మ ఇప్పటివరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద విచారించగా ఆచూకీ తెలియాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల సమీపంలోని ఘాట్ వద్ద మృతదేహం లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తోన్న ఫరూక్ను గుర్తుతెలియ వ్యక్తులు దారుణహత్య చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.మూడు రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: బాపట్ల పట్టణంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం లో గుర్తు తెలియని మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి గాయాల పాలైన మహిళను బాపట్ల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చేర్పించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని మహిళను గుర్తించిన వారు బంధువులకు సమాచార ఇవ్వాలని ఏరియా వైద్యశాల సిబ్బంది తెలిపారు.
ADB: దహెగాం మండలం ఈజ్ గాం గ్రామ బెంగాలీ క్యాంప్ యువకుడు రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన విశాల్ పని నిమిత్తం తన బైక్పై మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ పడిపోవడంతో తీవ్ర గాయలై మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనతో బెంగాలీ క్యాంప్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
NLR: అకారణంగా ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాత్రి నెల్లూరు అయ్యప్పగుడి సెంటరులో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బక్షు ఓ దుకాణంలో ఉండగా, అదే దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దుకాణదారుడితో బక్షు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ మీద పొడవడంతో బక్షు సొమ్ముసిల్లిపడిపోయాడు.
NLR: ఆత్మకూరు పట్టణ చెరువులో మట్టిమాఫియా ఎక్కువవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, టిప్పర్ల సాయంతో రాత్రి వేళల్లో మట్టి తరలిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాహనాల శబ్దాలతో రాత్రుల్లో తమకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NLR: కోవూరు మండలంలోని జాతీయ రహదారిపై సంభవించిన గాలివాన ప్రాణం తీసింది. ముంబయి నుండి ఫెడోరా రొయ్యల కంపెనీకి మేత తీసుకొచ్చిన లారీ క్లీనర్ కరణ్ మోహన్ గైక్వాడ్ (28) గాలులకు మేతపై పట్ట కప్పేందుకు లారీపైకి ఎక్కాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
కడప: పట్టణంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో గత అర్ధరాత్రి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాష్ వీధికి చెందిన ఉన్న సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్కు వెళ్లి షర్ట్తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
MHBD: నారసింహులపేట మండలంలో ఈ రోజు ప్రమాద వశాత్తూ విద్యుత్తు షాక్కు గురయ్యి రెండు ఆవులు మృతిచెందాయి. యజమాని వివరాల ప్రకారం నిన్న రాత్రి వచ్చిన గాలి వాన బీభత్సానికి విద్యుత్ వైర్లు తెగి ఉండడంతో ప్రమాదవశాత్తు రైతు వీరబోయిన మల్లయ్యకు చెందిన రెండు ఆవులు కరెంటు షాక్కు గురయ్యి చనిపోయాయి.
HYD: కార్ఖానా PS పరిధిలో అక్కా చెల్లెళ్ల మృతి ఆలస్యంగా వెలుగు చూసింది. కార్ఖానాలోని శ్రీనిధి అపార్ట్మెంట్లో వీణ, మీనాలు నివాసం ఉంటున్నారు. వీరి ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లోనికి వెళ్లి చూడగా వారిద్దరు ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
ప్రకాశం: పొదిలికి చెందిన పూర్ణిమ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నబజారు CI వివరాల మేరకు.. ఒంగోలుకి చెందిన AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో ములాపేట పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో పూర్ణిమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ప్రకాశం: కనిగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. మంగళవారం గ్రామానికి చెందిన యనముల పాపయ్య ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి, బీరువాలోని రూ. 70 వేలు విలువచేసే బంగారు ఆభరణాలను దొంగిలించి తీసుకెళ్లారని బాధితుడు పాపయ్య తెలిపాడు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు.