• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కందుకూరు హైవేపై యాక్సిడెంట్.. వ్యక్తి స్పాట్ డెడ్

NLR: కందుకూరు శివారులో కొండముడుసుపాలెం జంక్షన్ సమీపంలో బుధవారం హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి పామూరు వెళ్తున్న కారు నిలిపి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టడంతో చాంద్ బాషా మృతి చెందాడు. ఈయనది పామూరు సమీప గ్రామమని సమాచారం. గాయపడ్డ ఆదిశేషారెడ్డిని ఒంగోలు RIMSకు తరలించారు.

March 4, 2026 / 03:00 PM IST

చోరీకి వచ్చి దొంగ మృతి

AP: చోరీకి వచ్చి దొంగ మృతిచెందిన ఘటన సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి వచ్చారు. వారిని కాలనీవాసులు వెంటాడటంతో పరిగెత్తుతూ ఓ దొంగ రైల్వే ట్రాక్‌పై పడటంతో తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడి మృతిచెందాడు. పరారైన మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 4, 2026 / 10:34 AM IST

దారుణం: విద్యార్థిని కొట్టిచంపిన గ్రామస్తులు

మేకను దొంగిలించారన్న ఆరోపణలతో ఇద్దరు విద్యార్థులను తాడుతో కట్టేసి కొట్టడంతో ఒకరు మృతిచెందారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. సంబిత్, మరో బాలుడు కలిసి మేకను దొంగిలించారన్న ఆరోపణలపై ఇందకోలి గ్రామంలో వారిద్దరినీ తాడుతో కట్టేసి కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సంబిత్ మృతిచెందాడు.

March 4, 2026 / 08:19 AM IST

నకిలీ నోట్ల కేసులో ఏడుగురికి జైలుశిక్ష

AP: నకిలీ నోట్ల చలామణి కేసులో ఏడుగురు నిందితులకు విశాఖలోని NIA ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. నిందితులు అసోం, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. 2015లో వారు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి చలామణి చేసినట్టు NIA నిర్ధారించింది.

March 4, 2026 / 08:10 AM IST

VIRAL: స్కూల్‌లో 165 మంది బాలికలు మృతి!

దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌ పట్టణంలో ఫిబ్రవరి 28న జరిగిన ఘోర వైమానిక దాడిలో ఓ ప్రాథమిక పాఠశాల నేలమట్టమైంది. ఈ ఘటనలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోగా, మరో 96 మంది గాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా ఈ దాడి చేశాయని ఇరాన్ ఆరోపిస్తుండగా, వైరల్ అవుతున్న విద్యార్థినుల చివరి ప్రార్థన వీడియో ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది.

March 4, 2026 / 05:00 AM IST

చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నవీన్‌కుమార్‌(11), సాయి(16), వెంకటజోసఫ్‌(16)గా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌, వెంకటజోసఫ్‌ మృతదేహాలు లభ్యం కాగా.. సాయి మృతదేహం కోసం గాలింపు కొనసాగుత...

March 3, 2026 / 10:14 PM IST

VIDEO: భారీ అగ్నిప్రమాదం

AP: గుంటూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 09:20 PM IST

బెట్టింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

AP: నెల్లూరులో ఆర్777 బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహేష్ బాబు, హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రూ.53 లక్షలు మోసం చేయడంతో దర్యాప్తు చేపట్టి, వారి ఖాతాల్లోని రూ.1.64 కోట్లను సీజ్ చేశారు. దుబాయ్, శ్రీలంకలో శిక్షణ పొందిన మహేష్.. అక్కడి నుంచే యాప్ లింకులు పొంది ఈ దందా నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 3, 2026 / 09:06 PM IST

ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా రావూరుఘాట్ అడవుల్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ప్రదేశంలో పురుగుల డబ్బా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళకు ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

March 3, 2026 / 08:42 PM IST

కాల్పులు.. మృతుల్లో భారత సంతతి వ్యక్తి

ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్‌ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనికి బాధితులతో ముందే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

March 3, 2026 / 08:26 PM IST

కూలర్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

AP: రాష్ట్రంలో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. కర్నూలు బాలాజీ నగర్‌లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

March 3, 2026 / 06:15 PM IST

యుద్ధం.. 787కు చేరిన మృతుల సంఖ్య

యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక్క రోజులోనే మరణాల సంఖ్య 555 నుంచి 787కి పెరిగింది. ఇందులో సాధారణ పౌరులు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది బాలికలు మరణించినట్లు సమాచారం.

March 3, 2026 / 03:49 PM IST

కాలేజీలో అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

March 3, 2026 / 01:36 PM IST

డ్రగ్స్ పార్టీ భగ్నం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. లిఖిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 6 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:24 PM IST

ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

TG: హైదరాబాద్‌లోని నాగోల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఫొటో సెషన్ కోసం నాగోల్‌లో విద్యార్థులు బైక్ రైడ్ నిర్వహించారు. ఇందుకోసం స్పోర్ట్స్ బైక్‌ను విద్యార్థులు అద్దెకు తీసుకున్నారు.

March 3, 2026 / 01:00 PM IST