SRPT: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పోసానికుంట గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి తన ఇంట్లోని మోటర్ పంపును ఆన్ చేశాడు. నీరు రాకపోవడంతో పంపును పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
ప్రకాశం: పెద్దచెర్లోపల్లి మండలంలోని బట్టుపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పెద్దచెర్లోపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కనిగిరి నుండి ఇంటి నిర్మాణ సామాగ్రితో ట్రాక్టర్పై వెళుతుండగా బట్టుపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడక్కడ మృతి చెందాడు.
VZM: చీపురుపల్లి మండల కేంద్రంలోని ఓ బట్టల షాపులో ఇవాళ్ళ ఉదయం అగ్ని ప్రమాదం సంబవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాజాలో ఉన్న న్యూ లుక్ రెడీ మెడ్ బట్టల దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
NRML: కలెక్టరేట్లో ప్రజావాణికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బైంసా పట్టణం సంతోష్ నగర్ కు చెందిన బాధితులు కలెక్టరేట్ వెళ్తున్న క్రమంలో చిట్యాల బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుండి ఢీకొనడంతో ఆటో బోల్తా పడి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.
ADB: ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. సోమవారం ఓ కారు బీర్సాయిపేట శివారులోని ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
KKD: కరప మండలం పెనుగుదురులో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి దాడి చేసినట్లు కరప ఎస్సై తోట సునీత తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 2,080 నగదు, 104 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు.
కోనసీమ: ఆలమూరు మండలం మడికి గ్రామ కూరగాయల మార్కెట్ సమీపంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 14, 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ సి.హెచ్. విద్యాసాగర్ తెలిపారు.
NRML: బాసర గోదావరి నదిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు మునిగి ఆదివారం దుర్మరణం చెందారు. మృతులు హైదరాబాద్లోని బేగంబజార్కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. సరస్వతీ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన 18 మంది సభ్యులతో కూడిన మూడు కుటుంబాల్లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NDL: పలు జిల్లాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసులు శనివారం తెలిపారు. మిర్యాలగూడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వేముల శివశంకర్, పవన్ కుమార్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.39 లక్షల విలువైన 394 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు.
HNK: ధర్మసాగర్ మండలం ఎల్కతుర్తి క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై శనివారం టిప్పర్ బోల్తా పడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
SKLM: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి సముద్ర తీర ప్రాంతంలో జూద శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ముందస్తు సమాచారంతో శుక్రవారం సాయంత్రం ఎస్ఐ నిహార్ తన సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కార్యకలాపాలపై నిఘా కొనసాగుతోందని ఎస్ఐ తెలిపారు..
WG: తాడేపల్లిగూడెం, తణుకు, గుడివాడ, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసుల్లో పూతి ప్రసాద్ అలియాస్ పెరుమాళ్ల దాలయ్యను అరెస్ట్ చేసినట్టు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సమావేశం నిర్వహించారు. రూ.13 లక్షల విలువైన 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చిత్తూరులో గురువారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని 47వ డివిజన్లో వెంకట రెడ్డి(50)ని ఆయన కుమారుడే హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
AKP: నర్సీపట్నం పట్టణం 6వ వార్డులో ట్రాన్స్ఫార్మర్ పేలుడు సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వస్తున్నా, విద్యుత్ శాఖ అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. ఈ రోజు రాత్రి ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.
KRNL: కోడుమూరులో నూతనవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎస్సై ఎర్రిస్వామి వివరాల ప్రకారం.. వర్కూరుకు చెందిన శృతిని కోడుమూరుకు చెందిన నాగరాజు వివాహం చేసుకున్నాడు. చెప్పులు కొనుక్కోవడానికి భర్తను డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెంది వాస్మోయిల్ తాగడంతో కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.