AP: కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారి సుద్ద వాగు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి డివైడర్ ఎక్కడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు లారీ ముందు భాగం భారీగా దెబ్బతింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
AP: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. డీఎన్ఏ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. డీఎన్ఏ నివేదికలు రాగానే బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే, బస్సు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.
AP: కన్న కుమార్తెను తండ్రి హతమార్చిన దారుణ ఘటన మార్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. కుమార్తె తులసి(9) మెడకు తీగ బిగించి హత్య చేశాడు. ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా.. అదే కాలనీలో మరో వివాహిత ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.
AP: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన భువనేశ్వరి అనే మహిళ కూల్డ్రింక్లో విషం కలిపి పిల్లలకు తాగించింది. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అత్తతో జరిగిన గొడవల కారణంగా ఈ ఘాతుకానికి యత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరోవ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఏ4గా ఉన్న దిల్కష్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ATP: ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన రైతు సురేశ్ (35) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి 2 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. సాగు చేసిన పంటలు దిగుబడి రాకపోవడంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు చేపట్టారు.
AP: ప్రకాశం జిల్లా మార్కాపురం బస్సు ప్రమాదస్థలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సిలిండర్ వల్లే మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు దీన్ని తీసుకువచ్చారు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
AP: పాలకోసం ఏడ్చిన చిన్నారిని కన్నతల్లే కడతేర్చిన హృదయవిదారక ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. తమిళనాడు నుంచి ఉపాధి కోసం సత్యవేడుకు వచ్చిన దంపతులకు ఓ కుమారుడు, ఆరు నెలల కూతురు ఉన్నారు. అయితే తల్లి పనిలో ఉండగా.. చిన్నారి పాల కోసం గుక్కపట్టి ఏడ్చింది. దీంతో అసహనానికి గురైన ఆ తల్లి ఆ పసికందు గొంతు నులిమేయడంతో విగతజీవిగా మారింది. ఈ ఘటన అందరి హృదయాలను కలచివేసింది.
NLR: మల్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 13 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. సుమారు15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.మంత్రి స్పందిస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
AP: మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతదేహాలను కుటుంబసభ్యుల DNA ఆధారంగా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిపోవడంతో గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. మృతదేహాలు మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో ఉన్నాయి. పోలీసులు నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ టీమ్ను రప్పిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
AP: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ప్రమాద స్థలానికి చేరుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ.. ‘ఇంకా బస్సులోనే మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. గాయాలైనవారికి మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
AP: మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. 10 మంది సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
AP: మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కుమారుడే కన్న తండ్రిని హతమార్చిన ఘటన బాపట్ల జిల్లా చుండూరు మండంలం మోదుకూరులో చోటుచేసుకుంది. ఆస్తి కోసం తండ్రి నరసింహారావు కుమారుడు రవీంద్ర హత్య చేశాడు. అనంతరం తండ్రి మృతదేహాన్ని గూడవల్లిలోని బావిలో పడేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్లో పెద్దఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. ఈ ఘటనతో ఓర్వకల్లు, గుట్టపాడు పరిసరాల్లో పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.