• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యం

కోనసీమ: పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో ఆదివారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల రామకృష్ణ (60)గా స్థానికులు గుర్తించారు. వీఆర్వో భగవన్నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 5, 2026 / 08:02 AM IST

విషాదం.. కుప్పకూలిన విమానం

అమెరికాలోని మసాచుసెట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కేప్‌కాడ్ ప్రాంతంలోని ప్రావిన్స్‌టౌన్ ఎయిర్‌పోర్టు వద్ద ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. విమానం రన్‌వే సమీపంలో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రతికూల వాతావరణం కారణమా, సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది.

January 5, 2026 / 07:38 AM IST

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం

ఈశాన్య భారతదేశంలో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి అసోం, త్రిపుర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అసోంలోని మోరిగావ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు కాగా, త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

January 5, 2026 / 06:07 AM IST

కాల్పులు.. 30 మందికిపైగా మృతి

ఉత్తర నైజీరియా ప్రాంతంలోని నైబర్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. బోర్గు ప్రభుత్వ పరిధిలోని కసువాన్-డాజీ గ్రామంలోకి ఆయుధాలతో దుండగులు చొరబడి.. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందారు. మరికొందరిని అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అపహరణకు గురైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

January 4, 2026 / 07:13 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

January 4, 2026 / 04:41 PM IST

పమిడిపాడులో ఈతకు దిగి బాలుడు మృతి

BPT: కొరిశపాడు మండలం పమిడిపాడు శివారు వద్ద చెక్ డ్యామ్‌లో ముగ్గురు పిల్లలు ఈతకు దిగారు. ఈ క్రమంలో వారిలో ఒకరు గల్లంతవగా, మిగిలిన పిల్లల సమాచారంతో గ్రామస్తులు, వారి తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 4, 2026 / 04:11 PM IST

స్విమ్మింగ్‌పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

TG: HYDలోని కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్‌పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్ మృతి చెందాడు.హైదర్‌నగర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. దీంతో బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లరు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఉలుకుపలుకు లేకుండా ఉండటంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

January 4, 2026 / 03:53 PM IST

మద్యం మత్తులో తల్లిని హత్య చేసిన కుమారుడు

AP: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండల పరిధిలోని కొండముది గ్రామంలో మద్యం మత్తులో ఓ కుమారుడు తల్లిని హత్య చేశాడు. కొమ్ము జయమ్మ (60) కుమారుడు నాగరాజు మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉండేవాడు. ఈ విషయంపై శనివారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నాగరాజు మద్యం మత్తులో తల్లిని రోకలి బండతో తలపై దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

January 4, 2026 / 03:04 PM IST

13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం!

కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 14 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలురు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

January 4, 2026 / 10:02 AM IST

SVS కెమికల్స్ ప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు

AP: అనకాపల్లి SVS కెమికల్స్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెంట్రిఫ్యూజ్ వద్ద మంటలు చెలరేగినట్లు గుర్తించారు. టోలున్ అనే రసాయనంతో మంటలు తీవ్రంగా వ్యాపించినట్లు తెలిపారు. ప్రమాద కారణాలు, పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

January 4, 2026 / 09:30 AM IST

ప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం

TG: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మేడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 4, 2026 / 09:21 AM IST

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.21కోట్ల విలువ చేసే 2.1 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాలిథిన్ కవర్లలో కొకైన్ ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించారు. ఈ డ్రగ్స్‌ను బ్యాంకాక్ నుంచి తరలించినట్లుగా గుర్తించి ముగ్గురు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

January 4, 2026 / 08:48 AM IST

BREAKING: పేలిన గీజర్ సిలిండర్

AP: తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గీజర్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

January 4, 2026 / 08:36 AM IST

ఆటో బైక్ ఢీ.. ఐదుగురికి గాయాలు

అన్నమయ్య: మైసూరు వారిపల్లి సమీపంలో కడప-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

January 3, 2026 / 06:29 PM IST

అగ్రిప్రమాదం.. పరుగులు తీసిన కార్మికులు

AP: అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. SVS కెమికల్స్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో కార్మికులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.

January 3, 2026 / 06:18 PM IST