• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా రావూరుఘాట్ అడవుల్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ప్రదేశంలో పురుగుల డబ్బా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళకు ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

March 3, 2026 / 08:42 PM IST

కాల్పులు.. మృతుల్లో భారత సంతతి వ్యక్తి

ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్‌ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనికి బాధితులతో ముందే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

March 3, 2026 / 08:26 PM IST

కూలర్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

AP: రాష్ట్రంలో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. కర్నూలు బాలాజీ నగర్‌లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

March 3, 2026 / 06:15 PM IST

యుద్ధం.. 787కు చేరిన మృతుల సంఖ్య

యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక్క రోజులోనే మరణాల సంఖ్య 555 నుంచి 787కి పెరిగింది. ఇందులో సాధారణ పౌరులు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది బాలికలు మరణించినట్లు సమాచారం.

March 3, 2026 / 03:49 PM IST

కాలేజీలో అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

March 3, 2026 / 01:36 PM IST

డ్రగ్స్ పార్టీ భగ్నం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. లిఖిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 6 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:24 PM IST

ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

TG: హైదరాబాద్‌లోని నాగోల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఫొటో సెషన్ కోసం నాగోల్‌లో విద్యార్థులు బైక్ రైడ్ నిర్వహించారు. ఇందుకోసం స్పోర్ట్స్ బైక్‌ను విద్యార్థులు అద్దెకు తీసుకున్నారు.

March 3, 2026 / 01:00 PM IST

దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన వ్యక్తి

AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంకలో ఓ వ్యక్తి తన భర్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతారామరాజు, లత దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.

March 3, 2026 / 10:37 AM IST

కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దుండు మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో క్షతగాత్రులను ప్రభుత్వం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

March 3, 2026 / 10:15 AM IST

దారుణ హత్య.. వ్యక్తిని గొంతుకోసి చంపిన దుండగులు

AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంచంగిపుట్టులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, కొన్నాళ్లుగా మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

March 3, 2026 / 10:07 AM IST

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

TG: యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లెగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఐశ్వర్య ఉరేసుకుంది. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

March 3, 2026 / 09:07 AM IST

దక్షిణ సూడాన్‌లో 169 మంది మృతి

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది మరణించారు. ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు US మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.

March 3, 2026 / 05:22 AM IST

ప్రియురాలి ముందు ప్రియుడి ఆత్మహత్యయత్నం

AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.

March 2, 2026 / 08:56 PM IST

ప్రియురాలి ముందు ప్రియుడి ఆత్మహత్యాయత్నం

AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.

March 2, 2026 / 08:56 PM IST

8 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్

AP: తిరుపతిలో టాస్క్ ఫోర్ట్స్ పోలీసులు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. 195 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు సీజ్ చేశారు.

March 2, 2026 / 07:13 PM IST