GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు. డ్రైనేజీ కెనాల్ దగ్గర మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఆచూకీ తెలిసినవారు చేబ్రోలు పోలీసులను సంప్రదించాలని కోరారు.
JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. సితార హోటల్ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద నలుగురు కార్మికులు చిక్కుకోగా.. ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా.. మృతులు బీహార్కు చెందిన కార్మికులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ATP: వజ్రకరూరు మండలం చాకిరేవు వద్ద బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చీరలు పూర్తిగా కాలిపోయాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 2 వేలకు పైగా చీరలు కాలిపోయాయని, రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
KKD: కరపలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి ఓ ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఢీ కొట్టిన ఆటో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వారికి, ఆటోలో ఉన్నవారికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRCL: ముస్తాబాద్ మండలంలో ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో ఈత కొట్టాడు. చరణ్కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
HYD: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన పటాన్చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణా: గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్పల్లి మండలం బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్మెన్గా పని చేస్తున్నాడు.
కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని కొండాలమ్మ చింత వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడటంతో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడుని వేరే అంబులెన్స్లో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
MDK: శివంపేట మండలం సామ్య తండాలో మదన్ (35) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా, కుటుంబ కలహాల కారణంగా మదన్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉన్న మదన్ అనుమానస్పదంగా మృతి చెందారు. హత్య చేసినట్లుగా పలువురు అనుమానిస్తున్నారు.
SRD: మునిపల్లి మండలం బుదేరా సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న మిషన్ భగీరథ పైపులకు మంటలు వ్యాపించడంతో మంటలు వ్యాపించాయి. అగ్నికి పైపులు దగనమవడంతో మంటలు పెద్ద ఎత్తున అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.
పశ్చిమ బెంగాల్ హౌరాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త కిడ్నీని బలవంతంగా రూ.10 లక్షలకు అమ్మించి డబ్బు తన వద్దే ఉంచుకుంది. తన కూతురి చదువుకు ఉపయోగపడుతుందని చెప్పడంతో భర్త గుడ్డిగా నమ్మాడు. కానీ, ఆ మహిళ తన భర్తను నిలువునా ముంచి రాత్రికి రాత్రే ప్రియుడితో డబ్బు తీసుకొని పరారైంది. దీంతో భర్త పీఎస్లో ఫిర్యాదు చేశారు.
విశాఖలోని ఆశిల్ మెట్ట వద్ద గల యూనియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పి వేశారు. బ్యాంకులో ఏసీ ఆఫ్ చేయకపోవడం వల్లే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తేల్చారు. బ్యాంకులో ఏసీ, ఫర్నిచర్ మంటల్లో కాలిపోయాయి.
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్ శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామ్మన్నారు.