కృష్ణా: తాడిగడప సెంటర్ వద్ద సోమవారం విషాదకర ఘటన జరిగింది. ట్రాక్టర్పై వెళ్తున్న పెద్ద ఒగిరాల గ్రామానికి చెందిన ఘంటసాల రాధారాణి (38) ప్రమాదవశాత్తు జారి పడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో రైలు కిందపడి శ్రీనివాసులు అనే యువకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.
UPలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. సునీల్(45) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలోని చెట్టు కింద నిద్రిస్తున్నాడు. పారిశుద్ధ్య సిబ్బంది అతన్ని గుర్తించకుండా ట్రాక్టర్ మట్టి లోడ్ తీసుకొచ్చి అతనిపై పోసేశారు. దీంతో ఊపిరాడక సునీల్ మృతి చెందాడు. అనంతరం, కుమారుడు తన తండ్రి మృతదేహాన్ని గుర్తించి స్థానికుల సాయంతో వెలికితీశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KMR:సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్వంచకు చెందిన చిన్న సిద్ధయ్య (57) నిన్న రాత్రి సైకిల్పై వెళ్తుండగా KMR వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సిద్ధయ్యకు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై అనిల్ తెలిపారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్ గ్రామాలో ఐదు జీవాలు గురువారం విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. మండల కేంద్రంలోని రాములు గొర్రెలు వర్షానికి డివైడర్ పైకి ఎక్కగా, మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలకు అమర్చిన ఏర్త్వైర్కు విద్యుత్ సరఫరా కావడంతో రెండు గొర్రెలు, మూడు మేకలు గ్రామ శివారులో కరెంట్ షాక్తో మృత్యువాత పడ్డాయన్నారు.
ప్రకాశం: మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డినగర్లో గురువారం రాత్రి విద్యుత్ షాక్కు గురై 19గేదెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. పొలంలో విద్యుత్ వైర్లు తెగి పడడంతో గేదెలకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు చెబుతున్నారు. సుమారు రూ. 13 లక్షల నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
TG: రేవంత్ రెడ్డి ఓఎస్డీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ క్రికెటర్ నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఓఎస్డీ పేరుతో ఫేక్ ఈ మెయిల్ క్రియేట్ చేసి పలువురు హై ప్రొఫైల్ వ్యక్తులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా నాగరాజుపై కేసులు ఉన్నాయి.
MNCL: జన్నారం మండలం మహమ్మదాబాద్లో కురిసిన భారీ ఈదురుగాలులకు చెట్టు తలపై పడి సునీత అనే మహిళ (37) మృతి చెందినట్లు జన్నారం ఎస్సై రాజావర్ధన్ గురువారం తెలిపారు. దండేపల్లి నుంచి జగన్ అతడి భార్య సునీత కడెం మండలానికి వెళ్లి వస్తుండగా గాలివాన రావడంతో చెట్టుకింద ఆగారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. జగన్ స్వల్ప గాయాలపాలై చికిత్స పొందుతున్నాడన్నారు.
E.G: నల్లజర్ల హైవేపై గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కొరియర్ లోడు వ్యాను నల్లజర్ల వచ్చేసరికి అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ మేకల వెంకట్(35) తీవ్ర గాయాలతో పాటు కుడికాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందజేశారు.
KDP: వల్లూరు మండల పరిధిలోని కొప్పోలి బస్టాండ్ సమీపాన బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఇటికల బట్టిలలో పనిచేస్తున్న చరణ్ నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్ ఢీకొట్టింది. దీంతో అతడికి, బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని కడప రిమ్స్కు తరలించారు.
NLG: పిడుగుపాటుకు రెండు పాడి గెదెలు మృతి చెందింన ఘటన కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్మిడి దామోదర్ రెడ్డి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు బర్రెలను కట్టేశాడు. మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపడటంతో రెండు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
BPT: పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న కారు డ్రైవర్ తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆపగా, వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, తాటి ముంజలు అమ్మే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యప్తు చేపట్టారు.
MBNR: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి .స్థానికులు తెలిపిన వివరాలు. జడ్చర్ల రహదారి మయూరి పార్క్ దగ్గర బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తూ కిందపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NGKL: జిల్లా చారకొండ మండలం కమ్మలపూర్ తండాలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి మంగ్య నాయక్ అనే రైతు పొలంలో రెండు పాడి ఆవులు మృతిచెందినట్లు బాధితుడు తెలిపారు. చనిపోయిన ఆవుల విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పేర్కొన్నారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
MDK: అదృశ్యమైన మహిళ మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నిజాంపేట మండలం రజాక్పల్లికి చెందిన బాల మల్లవ్వ (45) మార్చి 13న చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిర్తిపల్లిలోని తమ బంధువుల వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి అదృశ్యమైంది. ప్రస్తుతం ఆమె మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైంది.