AP: గుంటూరు జిల్లా తెనాలిలో అర్థనగ్న ఫోన్కాల్స్, చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్ట్రిప్ టాక్ పేరుతో ఓ యువకుడు ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నాడు. డబ్బులు చెల్లించిన వారితో మహిళలు న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు. చెంచుపేటలో ఓ ఇంటి నుంచి వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో పోర్టల్ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
థాయ్లాండ్లో వారం రోజులపాటు జరుపుకునే సోంగ్క్రాన్ వేడుకల్లో 191 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 951కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రయాణాల రద్దీ వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పండుగ సంతోషం నింపాల్సింది పోయి, ఇలా మారణహోమంగా మారడం కలచివేస్తోంది.
ఇండోనేషియా వెస్ట్ కాళీమంతన్ ప్రావిన్స్లో హెలికాప్టర్ కుప్పకూలి ఎనిమిది మంది మృతిచెందారు. మెలావి జిల్లాలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
AP: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు సంభవించాయి. రాంబిల్లి పరిసరాల్లో రా.12 గంటల తర్వాత కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.7గా నమోదైంది. ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
AP: పల్నాడు జిల్లా తొండపిలో అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య భూలక్ష్మిపై అనుమానంతో భర్త లక్ష్మయ్య గొడ్డలితో దాడి చేసి, ఆమె కాలును నరికేశాడు. అనంతరం తెగిపడిన కాలును సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG: తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని ఓ మహిళ తోడి కోడలి కుమారుడి(4)పై దారుణానికి ఒడిగట్టింది. జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని చెప్పి యాసిడ్ తాగించింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాలుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: తిరుపతి గ్రామీణ(M) అడపారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంతో అమర్నాథ్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో గొంతు కోసి చంపేశారు. అదే గ్రామానికి చెందిన బొమ్మ రాహుల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ రెడ్డి కుటుంబసభ్యులతో పరారు కావడంతో ఆయన బైకుకు మృతుడి బంధువులు నిప్పుపెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
AP: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలు, బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటకలోకి చిక్ మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వికాస్నగర్ స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం పెను ప్రమాదం తప్పింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మహారాష్ట్రలో తన్వీర్ అనే ఓ యువకుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సుమారు 180 మంది పిల్లలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక మున్సిపల్ అధికారులు అతడి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్తో కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
TG: HYD బడంగ్పేట్ BJP అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా పేరు సంపాదించారు. బడంగ్పేట్ సర్కిల్లో అవినీతిపై పోరాడి రూ.150 కోట్ల స్కామ్ను వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిలెటిన్ స్టిక్స్ పేలడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
TG: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో విషాదం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ పాప ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయింది. చరణ్య కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వెతికారు. పక్కింటివారు కారులో ఉన్న పాపను అపస్మారక స్థితిలో గుర్తించారు. హుటాహుటిన పేరెంట్స్ పాపను కామినేని ఆస్పత్రికి తరలించగా.. చరణ్య అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.