AP: తిరుపతి గ్రామీణ(M) అడపారెడ్డిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంతో అమర్నాథ్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో గొంతు కోసి చంపేశారు. అదే గ్రామానికి చెందిన బొమ్మ రాహుల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాహుల్ రెడ్డి కుటుంబసభ్యులతో పరారు కావడంతో ఆయన బైకుకు మృతుడి బంధువులు నిప్పుపెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.