AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.