GDWL: నడిగడ్డలోని ప్రాజెక్టులను ప్రక్షాళన చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గద్వాల జిల్లా పర్యటన ఎందుకని బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, బీఎస్ కేశవ్, నాగర్ దొడ్డి వెంకట్రాములు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గట్టు ఎత్తిపోతల, నెట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.