AP: పల్నాడు జిల్లా తొండపిలో అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి ఒడిగట్టాడు. తన భార్య భూలక్ష్మిపై అనుమానంతో భర్త లక్ష్మయ్య గొడ్డలితో దాడి చేసి, ఆమె కాలును నరికేశాడు. అనంతరం తెగిపడిన కాలును సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడిన భూలక్ష్మిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.