లడఖ్లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.
AP: చిత్తూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మం. శేషాపురం వద్ద నేషనల్ హైవేపై ఆగి ఉన్న RTC బస్సును కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్ణాటక విజయపుర జిల్లాలో ముగ్గురు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరగి గ్రామానికి చెందిన శంకరప్ప ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య రాజశ్రీ(28), పిల్లలు అనుశ్రీ(6), తను(3), కుమారుడు సంతోష్(1) కనిపించలేదు. గ్రామస్తులతో కలిసి వెతికారు. నలుగురూ ఓ బావిలో శవాలై కనిపించారు.
జమ్మూకాశ్మీర్లో మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. మార్కాపురం రెవెన్యూ అధికారులకు మృతుల డీఎన్ఏ నివేదిక చేరింది. గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్లో మృతదేహాలకు డీఎస్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు ఉదయం బంధువులకు మృతదేహాలు మృతదేహాలు అప్పగించనున్నారు. నిన్న 14 మంది మృతదేహాలకు శవపరీక్షలు ముగిశాయి. మరోవైపు 13 మంది బాధితులు కోలుకుంటున్నారు.
జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లను కలిపే జోజిలా కనుమ వద్ద భారీగా హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పలువురు వాహనదారులు ఇక్కడ చిక్కుకుపోయారు. అధికారులు ఈ మార్గాన్ని క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MNCL: బెల్లంపల్లి పట్టణ పోచమ్మ చెరువులో శుక్రవారం వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. తాళ్ళగురిజాల SI రామకృష్ణ వివరాలు.. బూడిదగడ్డ బస్తీలో నివసించే శీలం రాజం గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేదు. ఈనెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, చెరువు వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగి చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
AP: మార్కాపురం శివారులో బస్సు దగ్ధం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో యజమాని హరికృష్ణా రెడ్డి బస్సు నడిపాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన హరికృష్ణపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదం జరగగానే నిందితుడు బస్సు నుంచి దూకి పారిపోయాడు. తాజాగా కనిగిరి వద్ద పోలీసులు అతడిని అదుపుతోకి తీసుకున్నారు.
TG: కరీంనగర్లోని RBL బ్యాంక్లో జరిగిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మ్యూల్ ఖాతాల ద్వారా 100 కోట్ల మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బు మళ్లించారు. సైబర్ క్రైమ్, హవాలా చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కౌశాంబిలో కంటైనర్ను పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
AP: మార్కాపురం బస్సు ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సు యజమాని, డ్రైవర్ పి.హరికృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బస్సు ప్రమాదం తర్వాత ప్రయాణికులను వదిలి అతను పరారయ్యాడు. నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ను హరికృష్ణారెడ్డి నడుపుతున్నాడు.
TG: వరంగల్ NIT మాజీ ప్రొఫెసర్ సైబర్ వలలో పడి రూ. కోటి కోల్పోయారు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు లింక్ క్రియేట్ విడతల వారిగా ఉన్నదంతా దోచేశారు. పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు యాప్లో కనిపించినప్పటికీ, ఆ డబ్బును విత్ డ్రా చేసుకోబోతే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అక్షయ్, సాన్వికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అయితే, భార్యపై అనుమానంతో నడిరోడ్డుపై ఆమె గొంతు కోశాడు. అనంతరం మృతదేహాన్ని కారుతో తొక్కించి చంపేశాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే అక్షయ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
AP: కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు యువకులు ఉండగా ఇద్దరు మహిళలు ఉన్నారు. మరణించిన వారు కర్ణాటకలోని కురుడి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: అనంతపురంలోని కళ్యాణదుర్గం పాతచెరువులో భర్తను భార్య చంపేసింది. భర్త హనుమంతును చంపి ఇంటిముందే భార్య సుకన్య పాతిపెట్టింది. 4 నెలల ముందు హనుమంతును చంపి పాతిపెట్టింది. తల్లీకూతుళ్ల మధ్య గొడవతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీస్స్టేషన్లో నిందితురాలు లొంగిపోయింది.