AP: సెల్ ఫోన్ చూడొద్దని మందలించారని యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో జరిగింది. సుమిత్ర(18) అనే యువతి అక్క, బావతో కలిసి నివాసం ఉంటోంది. యువతి ఎప్పుడూ ఫోన్ చూస్తుండటంతో అక్కా బావ మందలించారు. సెల్ ఫోన్ కూడా పగులగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని TNGO కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్సర్క్యూట్ కారణంగా భవనం సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. భవనం పై అంతస్తుల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో భవనవాసులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను HYD పోలీసులు ఛేదించారు. 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, 32 మంది బ్యాంకు అధికారులతో సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. పెట్టుబడి స్కామ్లు, డిజిటల్ అరెస్టుల పేరిట.. నేరస్థులతో కుమ్మక్కైన బ్యాంక్ అధికారులు.. వారికి ఖాతాలు తెరచి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
TG: మేడ్చల్ జిల్లా డబిల్పూర్ గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి వెళ్లి ఉమన్(14), ఇర్ఫాన్(12) అనే ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వీరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతులు 9వ, 7వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: తెనాలిలో న్యూడ్ కాల్స్, చాటింగ్ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. న్యూడ్కాల్స్ పోర్టల్లో బంధువులైన ఇద్దరు మహిళలు తప్ప ఎవరూ లేరని నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. కాగా, స్ట్రిప్ టాక్ పేరుతో డబ్బులు చెల్లించిన వారితో మహిళలు న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు.
ఇటలీలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బెర్గామో ప్రావిన్స్లోని కోవో పట్టణంలో ఈ ఘటన జరిగింది. వైశాఖీ పండగ నేపథ్యంలో గురుద్వారాకు వెళ్లి తిరిగి బయటకు వస్తుండగా కాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులను రాజిందర్ సింగ్ (48), గుర్మీత్ సింగ్ (48)గా గుర్తించారు. కాల్పుల అనంతరం దుండగులు కారులో పారిపోయారు.
TG: నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శేఖర్ అనే వ్యక్తి రూ.28 కోట్ల అప్పు చేసి మరణించాడు. స్థానికులకు అధిక వడ్డీ ఆశజూపి భారీ మొత్తంలో అప్పలు చేశాడు. శేఖర్ మృతి చెందడంతో బాధితులు అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు నాలుగేళ్ల కుమారుడు మృతి చెందాడు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పంట కాల్వ గుంతలో బోల్తా పడిన బస్సును క్రేనుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. విశాఖ నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు చెన్నై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో ఇద్దరు సైనికులు సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయపడ్డారు. ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికుల్లో ఒకరు 25 ఏళ్ల చిన్నరాజ్ అని తెలుస్తోంది.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కార్తిక్ షా అనే ప్రయాణికుడి నుంచి 1990 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
TG: హైదరాబాద్లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని బాబా ఫంక్షన్ హాల్కు ఎదురుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: పార్వతీపురం పి.కోనవలస చెక్పోస్ట్ దగ్గర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి గ్యాస్ లారీ బోల్తా పడింది. దీంతో లారీ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్ధానికులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
AP: పోలండ్లో మృతి చెందిన విశాఖ జిల్లా వాసి ప్రసాద్బాబు(45) మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాన్ని వార్సా నుంచి తుర్కియేలోని ఇస్తాంబుల్ మీదుగా ఆదివారం రాత్రికి HYDకి చేరుకొనుంది. అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ‘ఓపస్’ ఫ్యునరల్ సర్వీసెస్ సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి సమన్వయం చేస్తోంది. కాగా, అనారోగ్యంతో అతడు ఈ నెల 4న మృతి చెందాడు.
TG: హైదరాబాద్ బేగంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూజ చేస్తుండగా దీపం చీరకు అంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. సోఫా, కర్టెన్లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.