• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

వార్డు మెంబర్‌గా విజయం.. గుండెపోటుతో మృతి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన మహేష్ వార్డు మెంబర్‌గా విజయం సాధించారు. అయితే, మహేష్ అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. కాగా, మహేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 15, 2025 / 11:56 AM IST

ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

మహారాష్ట్రలోని ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.

December 15, 2025 / 10:54 AM IST

BREAKING: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

మహారాష్ట్రలోని ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఏకంగా రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మీరా రోడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్ నిల్వలు బయటపడటం కలకలం రేపుతోంది.

December 15, 2025 / 10:54 AM IST

బస్సులో 40 మంది.. తప్పిన పెను ప్రమాదం

AP: శ్రీశైలం ఘాట్ రోడ్డులో 40 మందితో ప్రయాణిస్తున్న బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లిన బస్సు రక్షణ గోడపై నిలవడంతో.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. వైజాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా.. పెద్ దోర్నాల- శ్రీశైలం రహదారిలోని అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

December 15, 2025 / 10:22 AM IST

సీనియర్ న్యాయవాదిపై సైబర్ నేరగాళ్ల వల

AP: సైబర్ నేరగాళ్ల మాయ మాటలను నమ్మిన ఓ సీనియర్ న్యాయవాది భారీ మొత్తంలో మోసపోయాడు. దీంతో సదరు న్యాయవాది తనకు న్యాయం చేయాలంటూ కడప జిల్లా బద్వేల్ పోలీసులను ఆశ్రయించాడు. తనను మాటల్లో పెట్టి విడతల వారీగా రూ.72 లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

December 15, 2025 / 10:02 AM IST

16 మంది మృతి.. తండ్రీకొడుకుల ఉగ్రరూపమే!

ఆస్ట్రేలియాలోని బొండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక తండ్రీకొడుకులు ఉన్నారని తేలింది. పండ్ల వ్యాపారి సాజిద్ అక్రమ్(50), అతని కొడుకు నవీద్(24) కాల్పులకు తెగబడ్డారు. యూదుల ఉత్సవం జరుగుతుండగా ఈ ఘాతుకానికి పాల్పడంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ మృతి చెందాడు. ఈ ఘటనతో సిడ్నీ ఉలిక్కిపడింది.

December 15, 2025 / 07:33 AM IST

లిక్కర్ కేసు.. సుప్రీంలో నేడు కీలక విచారణ

AP: రాష్ట్ర లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో అరెస్టయిన బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వీరికి బెయిల్ వస్తుందా లేక జైలు జీవితం కొనసాగుతుందా అనేది ఇవాళ తేలే అవకాశం ఉంది. దీంతో అందరి చూపు ఇప్పుడు సుప్రీం తీర్పుపైనే ఉంది.

December 15, 2025 / 07:16 AM IST

కత్తి పట్టుకుని నడిరోడ్డుపై యువకుడి హల్‌చల్

AP: అనంతపురం జిల్లా పామిడిలో రవి అనే యువకుడు హల్‌చల్ చేశాడు. కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. పోలీసు వాహనం, షాపులు, ఆటోల అద్దాలు ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో పోలీసులపైనా దాడికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. 

December 14, 2025 / 06:59 PM IST

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు గాయాలు

ASF: ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఓ మహిళకు గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. వాంకిడికి చెందిన తారాబాయి (42) ఆదివారం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా స్కూటిపై వస్తున్న వ్యక్తి ఆమెను ఢీ కొట్టాడు. దాంతో ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు అంబులెన్స్ ద్వారా హుటాహుటిన వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

December 14, 2025 / 04:19 PM IST

భార్యను హతమార్చిన భర్త

AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలంలోని మాచవరంలో భార్యను భర్త హత్య చేశాడు. అనంతరం నిందితుడు బైక్‌పై మృతదేహంతో సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చినట్లు సమాచారం.

December 14, 2025 / 03:52 PM IST

పోలింగ్ కేంద్రం వద్ద విషాదం

TG: రంగారెడ్డి జిల్లా ఆలూరు పోలింగ్ కేంద్రం వద్ద విషాదం నెలకొంది. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే బుచ్చయ్య(70) కుప్పకూలాడు. అనంతరం అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆస్పత్రికి తరలించేలోపే మరణించినట్లు ధృవీకరించారు. కాగా బుచ్చయ్య కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలిగా పోటీ చేసింది.

December 14, 2025 / 03:45 PM IST

రోడ్డు పక్కన మృతదేహం కలకలం

TG: మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు పక్కన మృతదేహం కలకలం రేపింది. మృతుడిని శామీర్‌పేట మండలం ఆలియాబాద్‌కు చెందిన శ్యామ్‌గా గుర్తించారు. శ్యామ్ వృత్తి రిత్యా ఫంక్షన్లలో వంటలు చేస్తూ జీవనం సాగించేవాడని సమాచారం. అయితే, ఎక్కడైనా చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.. ఎవరు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2025 / 12:38 PM IST

దారుణం.. డెడ్ బాడీతో పోలీసుల ముందుకు

AP: ఉ.గుంటూరు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్య మహాలక్ష్మిని గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సంతమాగలూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల తరచూ గొడవలు అవుతుండగా విడిపోయారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె దగ్గరకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఉదయం హత్య చేశాడు.

December 14, 2025 / 12:17 PM IST

కుప్పకూలిన ఆలయం..భారత సంతతి వ్యక్తి మృతి

దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో  నిర్మిస్తున్న నాలుగంతస్తుల అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 52ఏళ్ల భారత సంతతి వ్యక్తి, ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు విక్కీ జైరాజ్ పాండేతో సహా నలుగురు చనిపోయారు. ప్రమాద సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు.   

December 14, 2025 / 11:42 AM IST

భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

AP: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నెహ్రూచౌక్ సెంటర్‌లోని వస్త్రదుకాణాల్లో మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు పక్కనే ఉన్న దుకాణాలకూ వ్యాపిస్తుండటంతో భారీ ఆస్తినష్టం జరిగే అవకాశముంది. ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 14, 2025 / 07:55 AM IST