ఇరాన్లో ఆందోళనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అల్లర్లను అణచివేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, సుమారు 1200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘హ్యూమన్రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ వెల్లడించింది. దేశంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.
AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని సోమశేఖర్ అనే వ్యక్తి.. ఓ మహిళను గొంతు కోసి హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక కోర్లగుంట మారుతీనగర్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని.. ఇటీవల మహిళ ఈ బంధాన్ని నిరాకరించడంతో సోమశేఖర్ ఈ హత్య చేశాడని గుర్తించారు.
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. గత నెల రోజుల్లో రాడికల్స్ చేతిలో 12 మంది హిందువులు బలయ్యారు. మృతుల జాబితాలో ప్రాంతోస్ కర్మాకర్, ఉత్పల్ సర్కార్, జోగేష్ రాయ్, సుబోర్నో రాయ్, శాంతో దాస్, దీపు చంద్ర దాస్, పింటు ఆకండ, అమృత్ మోండల్, బజేంద్ర బిస్వాస్, ఖోకాన్ చంద్ర దాస్, రాణా ప్రతాప్, చక్రవర్తి ఉన్నారు. ఈ వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పంజాబ్లోని పఠాన్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. కీలక సమాచారాన్ని పాక్కు చేరవేస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దంతేరపల్లి గ్రామంలో సారమేకల హరి(53) అనే వ్యక్తి మంగళవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరో కొట్టి చంపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. వ్యక్తి మృతికి గల కారణాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
జపాన్లో తాజాగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు.
TPT: వడమాలపేట టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 450 బస్తాలు (25 టన్నులు) రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై హరీష్ తెలిపారు. పుత్తూరు నుంచి రేణిగుంట వైపు వెళుతుండగా వడమాలపేట టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
TG: ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన నారాయణపేటలో జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఇద్దరు పిల్లలను తండ్రి శివరాములు ఉరేసి చంపాడు. మృతదేహాలను యాపల్ చెరువులో పడేశాడు. ఆ తర్వాత కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించి విఫలమయ్యాడు. మళ్లీ పురుగులమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప 1టౌన్ పరిధిలోని పాత బస్టాండ్ బ్రిడ్జి వద్ద ముగ్గురు మట్కా బీటర్లను అరెస్టు చేసి రూ. 4,100 నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నట్లు కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. అరెస్టైన వారిలో రవీంద్రనగర్కు చెందిన షేక్ సాదిక్ (40), షేక్ ఫయాజ్ (45), మోచంపేటకు చెందిన షేక్ గౌస్ పీర్ (43)లు ఉన్నట్లు సీఐ వెల్లడించారు.
అమెరికాలో తెలుగు యువతి గొడిశాల నికితా రావు హత్య కేసులో ప్రధాన నిందితుడు చిక్కాడు. ఈనెల 2న భారత్ వచ్చిన అనుమానితుడు అర్జున్ శర్మను తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన తర్వాత పరారైన అర్జున్ ఇండియాకు వచ్చినట్లు గుర్తించి, పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్లకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. UAPA కేసులో వీరి బెయిల్ పిటిషన్లను వేర్వేరుగా విచారించాలని కోర్టు నిర్ణయించింది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖలీద్, ఇమామ్ల పరిస్థితి భిన్నంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో వారి బెయిల్ వ్యవహారంపై తదుపరి విచారణల్లోనే స్పష్టత రానుంది.
TG: సిద్దిపేటలో లావణ్య అనే జూనియర్ డాక్టర్ ఆత్యహత్యకు పాల్పడింది. ప్రభుత్వ కళాశాలలో జూ. డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినట్లు గుర్తించారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిస్తోంది. దీంతో హాస్టల్ రూమ్లో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డిమందు ఎక్కించుకుంచుకోవడంతో మృతి చెందిది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కృష్ణ కిషోర్, ఆశ దంపతులు ఈ ప్రమాదంలో కన్నుమూశారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు. పది రోజుల క్రితమే వీరు పాలకొల్లు నుంచి తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
AP: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు పీఎస్ వద్ద పోలీసులు చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈశ్వరప్ప అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ వివాహితను గూడూరు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఆమె భర్త హరి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గూడూరు నుంచి వాళ్లిద్దరిని పోలీసులు తనకల్లు తీసుకొచ్చారు. పోలీసు జీపు దిగిన వెంటనే ఈశ్వరప్పను హరి, అతని బంధువులు కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు.
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నికిత రావు.. మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ఫ్రెండ్ అర్జున్శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నికిత కనిపించడం లేదని జనవరి 2న అర్జున్ పోలీసులను ఆశ్రయించాడు. అర్జున్ అదేరోజు భారత్కు వచ్చాడు. పోలీసులు నికిత డెడ్ బాడీని గుర్తించి, అర్జున్పై కేసు నమోదు చేశారు.