• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఆన్‌లైన్‌లో రూ.1.55లక్షల స్వాహా

కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు  వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 15, 2025 / 08:11 AM IST

గాజువాకలో రోడ్డు ప్రమాదం.. మృతుని వివరాలు ఇవే

VSP: పాత గాజువాక రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన లక్ష్మణ్, మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రమణ కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కాంక్రీట్ వాహనం ఢీకొట్టింది. లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. కాంక్రీట్ వెహికల్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 14, 2025 / 04:03 PM IST

బెంగళూరుకు యాసిడ్ దాడి బాధితురాలు

AP: అన్నమయ్య జిల్లా యాసిడ్ దాడి ఘటన యువతిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిని కత్తితో పొడిచి ముఖంపై గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసిన విషయం తెలిసిందే. గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 29న యువతి పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

February 14, 2025 / 02:23 PM IST

HYD రోడ్డుప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన BMW కారు

HYD: పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నక్కవాగు సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా.. డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

February 14, 2025 / 01:26 PM IST

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

కృష్ణా: అత్యాచారం కేసులో నిందితుడికి మచిలీపట్నం న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరవల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. 2021లో మల్లవల్లి గ్రామంలో కాసులు అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 10 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

February 12, 2025 / 08:17 AM IST

మహిళపై అత్యాచారయత్నం

CTR: బైరెడ్డిపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరశురాముడు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అదే కాలనీకి చెందిన నాగరాజు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

February 12, 2025 / 07:25 AM IST

బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

VSP: లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 12, 2025 / 07:02 AM IST

MHBD: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

MHBD:  గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్-నర్సంపేట నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇండ్ల రమేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 12, 2025 / 05:03 AM IST

రైలు ఢీకొని ఉద్యోగి మృతి

TPT: తడ రైల్వే స్టేషన్ సమీపంలో డ్యూటీలో ఉన్న రైల్వే ఉద్యోగిని రైలు ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం గ్యాంగ్ మ్యాన్‌గా పనిచేస్తున్న ఇద్దరిని చెన్నె వెళ్తున్న రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రుడిని సూళ్లూరుపేట వైద్యశాలకు తరలించారు.

February 11, 2025 / 01:18 PM IST

భార్యాభర్తల ఆత్మహత్య

MLG: జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఆలెం స్వామి, భార్య అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 11, 2025 / 12:55 PM IST

ఇసుక టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

KRNL: జిల్లా సి. బెళగల్ మండలం పోలకల్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఇసుక టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పోలకల్‌కు చెందిన సోమప్పగా గుర్తించారు. సోమేశ్వరస్వామి ఆలయంలో పూజ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 11, 2025 / 12:20 PM IST

BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జబల్‌పుర్ జిల్లా సిహోర పట్టణం వద్ద ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

February 11, 2025 / 11:19 AM IST

స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-2లో లిడ్ ఓపెన్ నుంచి మంటలు వ్యాపించడంతో నాగ శ్రీనివాసరావు అనే కార్మికుడు గాయాల పాలయ్యాడు. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 11, 2025 / 06:59 AM IST

రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

WNP: బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ ఫొటోగ్రాఫర్ మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చందాపూర్‌కి చెందిన అనిల్ కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నారు. నిన్న రాత్రి వనపర్తి నుంచి చందాపూర్ వస్తుండగా మార్గమధ్యలో బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.

February 10, 2025 / 10:13 AM IST

కీచక ఉపాధ్యాయుడికి రిమాండ్

అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థిని పట్ల అసంభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏ. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. చోడవరం కోర్టులో ముద్దాయిని హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

February 10, 2025 / 09:08 AM IST