AP: గుంటూరు జిల్లా తెనాలిలో వృద్ధ మహిళల జంట హత్యల కేసును మూడో పట్టణ పోలీసులు ఛేదించారు. బంగారం, నగదు కోసం వృద్ధురాళ్లను నిందితులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కుసుమ, గోపితో పాటు మరో బాలుడిని అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా మరో హత్య గురించి వారు వివరించారు. గతంలో బంగారం కోసం మారిస్పేటకు చెందిన మహిళను హత్య చేసినట్లు కుసుమ ఒప్పుకుంది.
APT: రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి పడి మృతి చెందిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడా?, ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడా? అన్న కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
HYD: ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ PS పరిధిలో జరిగింది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బటన్జూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఓ వ్యక్తి వేప చెట్టుకు ఉరి వేసుకొని కనించాడని కాల్ వచ్చింది. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు టీ షర్టు బ్లాక్ నిక్కరు ఉన్నాయి. సుమారు 5.7 ఫీట్లు ఉన్నాడు. గుర్తుపట్టినవారు PSలో సంప్రదించాలన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో NIA కీలక పురోగతి సాధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తులు దాడికి పాల్పడిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల గుర్తింపులను వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)తో సంబంధం ఉన్న పాకిస్తాన్ పౌరులని కూడా NIA ధృవీకరించింది.
TG: HYDలోని పహాడీషరిఫ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టు పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
JGL: పట్టణ బైపాస్ రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు వేగంగా కారు నడుపుతూ డివైడర్ ఎక్కి చెట్టును ఢీ కొట్టాడు. కారు పూర్తిగా దెబ్బతింది. యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఎదురుగా ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ATP: ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని సూర్య గ్రానైట్ క్వారీలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన కార్మికుడు మృతిచెందాడు. గ్రానైట్ వేస్ట్ను రవాణా చేసే డంపర్ బోల్తా పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుడు యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రంగయ్య(51)గా గుర్తించారు.
VKB: జండూబామ్ డబ్బా గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దౌల్తాబాద్ (M) ఈర్లపల్లికి చెందిన ముసిరప బందెప్ప తొమ్మిది నెలల కుమార్తె జ్ఞానేశ్వరి గురువారం ఆడుకుంటూ జండూబామ్ డబ్బా మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు MBNRలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్లిన ఇండిగో విమానం(6E 2006)లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉ.6:30 గంటలకు బయల్దేరిన విమానం, లేహ్కు చేరుకునే సమయంలో సమస్య రావడంతో పైలట్లు ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దాదాపు 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇది అత్యవసర ల్యాండింగ్ కాదని, అన్ని భద్రతా ప్రోటోకాల్స్ పాటించబడ్డాయని ఇండిగో స్పష్టం చేసింది.
ATP: పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఎస్కే హుస్సేన్ బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడి పోలీసులు తెలిపిన మేరకు రోడ్డు వెంబడి ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నటువంటి హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు.
TPT: చంద్రగిరి మండలం మిట్టపాలెం ANM అన్నపూర్ణ ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానిక వెల్ఫేర్ అసిస్టెంట్ గుణశేఖర్, మరో ఇద్దరు మహిళా సిబ్బంది తనను వేధిస్తున్నారని ఆమె వాపోయారు. తన విధుల్లో జోక్యం చేసుకుంటూ మానసికంగా, లైంగికంగా గుణశేఖర్ వేధిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కంప్లైంట్ రిటర్న్ తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు.
AP: విజయనగరం జిల్లా రాజాంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందింది. బిడ్డకు జన్మనిచ్చి వైద్యం వికటించడంతో బాలింత ప్రాణాలు విడిచింది. అయితే, దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ హాస్పిటల్ ఎదట బాలింత బంధువులు ఆందోళన చేపట్టారు.
AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరణించిన వారిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు. అంతేకాకుండా ఈ కాల్పుల్లో మరో మావోయిస్టు కూడా మరణించినట్లు సమాచారం.
SKLM: పలాసపురంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. రైతు బెందాళం అశోక్ దంపతులు నిద్రిస్తున్నసమయంలో ఇంటి ముందు ఉంచిన నిచ్చెన, గునపం సాయంతో వెంటిలేటర్ తీసి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, నగదు, వాచీతో పాటు ఇతర వస్తువులు దొంగిలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు ఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
SRPT: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పోసానికుంట గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి తన ఇంట్లోని మోటర్ పంపును ఆన్ చేశాడు. నీరు రాకపోవడంతో పంపును పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.