TPT: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన సూత్రధారి మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ ఫామ్ హౌస్లో దాక్కున్న ఆయనను తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ పూర్తి చేసిన అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం రుయాకు తరలించారు. అనంతరం చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నారు.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో రాడపాక కొమురమ్మకు అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి, 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
JGL: జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పోచమ్మ వాడకు చెందిన ప్రసన్న లక్ష్మి అనే వివాహిత అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రసన్న లక్ష్మికి 2023లో గాంధారి తిరుపతి అనే వ్యక్తితో పెళ్లైంది. ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా భర్త, అత్త మామల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
VZM: బొబ్బిలి సమీపంలో గురువారం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో టాటా మ్యాజిక్, బైక్ను ఢీకొని ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దంపతులు ఇద్దరు బొబ్బిలి నుండి సీతానగరం కోవెలకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద బాధితులు బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తన్న ఆర్ఐ సురేష్ సోదరుడని గుర్తించారు.
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రుల నుండి ఎదురైన మందలింపులకు మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఈ ఘటన స్థానికంగా కన్నీరు మున్నేరు అయింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BHPL: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున ఘటన పలిమెల మండలంలో చోటు చేసుకుంది. అప్పాజిపేటకు చెందిన సంజన (16) గంగారాంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో పెయిల్ కావడంతో మనస్తాపం చెందిన సంజన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మేడ్చల్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి గాయాలపాలైన ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న మంజూల (28) అనే అనాథ మహిళ ఓ భవనం మెట్లపై నుంచి తల తిరిగి కింద పడిపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6న మృతి చెందింది.
HNK: ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట కారు అదుపు తప్పి బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కారు అతివేగంగా జాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడి యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హసన్ పర్తి మండలం కోమటపల్లి చెందిన నమిడ్ల అభిషేక్ గా గుర్తింపు
MDK: పొలం వివాదంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన జయరాములు అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కానికే రవి పాత గొడవలు మనసులో పెట్టుకుని పొలం వివాదంలో రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో గాయాలైన జయరాములును బంధువులు ఆసుపత్రికి తరలించారు.
W.G: ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.60,000 వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం వెలిగించిన సిగరెట్ను అజాగ్రత్తగా పాడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు.
NRML: మద్యం మత్తులో తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు పట్టణానికి చెందిన సతీష్ తన తల్లిదండ్రులను కొడుతున్నాడని అన్న యోగేష్ నిన్న అర్ధరాత్రి కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASR: చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఆదివారం గల్లంతయిన యువకుల మృతదేహాలు మంగళవారం లభ్యమైనట్లు చింతూరు ఎస్సై రమేష్ తెలిపారు. మృతులు చింతూరుకి చెందిన ఎస్.శ్రీను, ఎన్.దిలీప్ కుమార్గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. స్నానం చేయడానికి దిగి ఒకరు గల్లంతు కాగా మరొకరు అతనిని రక్షించబోయి నది ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు.
BDK: పట్టణ శివారులో ఖమ్మం ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 11.15 కిలోల గంజాయి, 22 లీటర్ల నాటు సారాను వేర్వేరు ఘటనల్లో పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన దాముహంటల్, బీమాగుట్ట అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లబెల్లి పరిసర ప్రాంతాల నుంచి ఐదు వ్యక్తులు తరలిస్తున్న నాటు సారాను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేశారు.
యాదాద్రి: సంస్థాన్ నారాయణపురం మండలం సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పుట్టపాక గ్రామంలో ఓ వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు – దూబచర్ల R&B రహదారి గొల్లగూడెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోపీనాథపట్నం నుండి కొయ్యలగూడెం కర్రల లోడ్తో వెళ్తున్న వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం ధ్వంసం కాగా ఢీకొన్న లారీ వెనుక భాగం నాలుగు చక్రాలు ఊడిపోవడంతో లారీ రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.