సత్యసాయి: చిలమత్తూరు మండలం దేముకేతపల్లి వద్ద కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటన నెలకొంది. ఈ ఘటనలో వాహనాలు ద్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచించారు.
ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం ఒక వింత ఘటన జరిగింది. భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న కోపంతో మహాలక్ష్మి అనే మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
సత్యసాయి: నల్లచెరువు మండలం బందార్లపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువలో ప్రమాదవశాత్తు తండ్రికొడుకులు గల్లంతయ్యారు. తండ్రి రాము(40) మృతదేహం లభించగా, ఎనిమిదేళ్ల కుమారుడు చిన్నోడు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
AP: విశాఖ టౌన్ కొత్తరోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. పాత సామగ్రి గోదాములో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. రెండు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఘటనాస్థలికి సమీపంలోనే పెట్రోల్ బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. టౌన్ కొత్తరోడ్డు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం నెలకొంది. మూడేళ్ల కూతురు సహా దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో తల్లి శంకరకుమారి, చిన్నారి మౌనిక మృతి చెందారు. తండ్రి గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్లో కల్తీ దందా రోజురోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పాడైన మటన్ అమ్ముతున్న ఓ షాప్పై గోల్కొండ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూపీ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసం నిల్వచేసినట్లు గుర్తించారు. FSSAI అనుమతులు లేకుండా అక్రమంగా మాంసం విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. వేలాది కిలోల మాంసం, తలలు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు.
NTR: తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్ వద్ద జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు శనివారం దాడి చేశారు. SI-II రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో “కోతముక్క” జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,400 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూదానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య మృతి చెందాడు. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రమణయ్య క్రింద పడగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా కానిస్టేబుల్ మృతి చెందాడు. ప్రమాదంపై పలువురు అధికారులు విచారం వ్యక్తం చేశారు.
NRML: దిలావర్పూర్ గ్రామంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో నిర్మిస్తున్న రైస్ మిల్కు అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు MPO, సర్పంచ్, EO, ఉప సర్పంచ్లను శనివారం కోరారు. పరిసరాల్లో విద్యాసంస్థలు, నివాస గృహాలు, దేవాలయాలు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నయాగఢ్ జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లడఖ్లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.
AP: చిత్తూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మం. శేషాపురం వద్ద నేషనల్ హైవేపై ఆగి ఉన్న RTC బస్సును కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్ణాటక విజయపుర జిల్లాలో ముగ్గురు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరగి గ్రామానికి చెందిన శంకరప్ప ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య రాజశ్రీ(28), పిల్లలు అనుశ్రీ(6), తను(3), కుమారుడు సంతోష్(1) కనిపించలేదు. గ్రామస్తులతో కలిసి వెతికారు. నలుగురూ ఓ బావిలో శవాలై కనిపించారు.
జమ్మూకాశ్మీర్లో మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. మార్కాపురం రెవెన్యూ అధికారులకు మృతుల డీఎన్ఏ నివేదిక చేరింది. గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్లో మృతదేహాలకు డీఎస్ఏ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు ఉదయం బంధువులకు మృతదేహాలు మృతదేహాలు అప్పగించనున్నారు. నిన్న 14 మంది మృతదేహాలకు శవపరీక్షలు ముగిశాయి. మరోవైపు 13 మంది బాధితులు కోలుకుంటున్నారు.