NLR: బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్ఐ శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేశ్ (40) బైక్పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
AP: అతివేగం కారణంగా అన్నమయ్య జిల్లాలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులైన సురేంద్ర, మాధవ, మహేష్ రాత్రి మదనపల్లె చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు వెళ్లివస్తుండగా.. కురబలకోట మండలం సర్కారుతోపు సమీపంలో బైక్ నియంత్రణ కోల్పోయి వేగంగా డివైడర్ను ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.
KKD: గండేపల్లి మండలం రామయ్య పాలెంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. సినిమా చూసి బైక్పై వస్తున్న చందు, మణికంఠ, కిషోర్లు ఆటోను తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చందు అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
KKD: సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఉగాది వేళ విషాదం నెలకొంది. పెద్దాపురం కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27) ఆలయ కోనేరులో మునిగి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ప్రశాంత్.. కాబోయే భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు
AP: తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
E.G: పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
AP: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు మరణించారు. తెలంగాణ వనపర్తి(D) మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు(27), APలోని బాపట్ల(D) రాచూరుకు చెందిన కౌలురైతు వనజ(35) ఉన్నారు. పల్నాడు(D) కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన కూలీ సుబ్బరత్తమ్మ(55), గుంటూరు(D) తుళ్లూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీనివాసరావు(40) మృతిచెందారు.
దేశంలో ఉగ్రవాదులకు డ్రోన్ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అంతర్జాతీయ టెర్రర్ నెట్వర్క్ను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) పట్టుకుంది. ఈ ఆపరేషన్లో మొత్తం ఏడుగురు విదేశీయులను అధికారులు అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు గుర్తించారు. వీరు భారత్లో డ్రోన్ల వినియోగంపై ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చినట్లు విచారణలో తేలింది.
ELR: నిలిపి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పి. గన్నవరానికి చెందిన మోతా అనంద సాత్రి పిప్పరలో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి పిప్పర నుంచి అత్తిలి వెళ్తుండగా, మార్గమధ్యంలోని జి.ఎస్.ఆర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆయన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆనంద సాత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐ ఆకుల మణికుమార్ తెలిపారు.
NDL: బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో తలారి వెంకటేశ్వర్లు (17) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదేళ్ల క్రితం తల్లి ఇంటి నుంచి వెళ్లి, నెల క్రితం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి తల్లితో తరచూ గొడవలు జరిగేవి. ‘నీ వల్ల గ్రామంలో మా పరువు పోయింది’ అంటూ బాధపడుతూ.. ఈ చర్యకు పాల్పడినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు.
KRNL: నందవరం మండలం నది కైరవాడి గ్రామానికి చెందిన యువ రైతు వడ్రంగి రామాచారి (35) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య మల్లేశ్వరి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
W.G: తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
NDL: డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్ఫాం చివర భాగంలో ఓ వ్యక్తి కాలు విరిగిన స్థితిలో పడివున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KDP: జిల్లా కాశీనాయన మండలం చిన్నాయపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(60) బుధవారం పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో వర్షంతో పాటు పిడుగు పడింది. ఈ క్రమంలో నారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ పెద్ద కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.