కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.