• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఢిల్లీ పేలుడు కేసు.. NIA కస్టడీకి సోయాబ్

ఢిల్లీ పేలుడు బ్లాస్ట్ కేసులో NIA కీలక ముందడుగు వేసింది. ఫరీదాబాద్‌లో 7వ నిందితుడు సోయాబ్‌ను అరెస్టు చేయగా.. పాటియాలా హౌస్ కోర్టు అతన్ని 10 రోజుల NIA కస్టడీకి పంపింది. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు అమీర్ రషీద్ అలీ కస్టడీని కూడా కోర్టు 7 రోజులు పొడిగించింది. పేలుడు వెనుక ఉన్న కుట్ర కోణాలపై NIA అధికారులు వీరిని విచారించనున్నారు.

November 26, 2025 / 09:25 PM IST

13కు చేరిన మృతుల సంఖ్య

హాంకాంగ్‌లోని భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 13కు చేరగా, 15 మంది గాయపడ్డారు. 31 అంతస్తుల ఎత్తున్న 8 టవర్లలో మంటలు వ్యాపించడంతో.. లోపల వందలాది మంది చిక్కుకున్నారు. దాదాపు 4,600 మంది నివసిస్తున్న ఈ సముదాయంలో మంటలను అదుపు చేసేందుకు 700 మంది ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

November 26, 2025 / 09:03 PM IST

ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సీటీఎం సమీపంలోని నాగలరాళ్ల వద్ద ఆటో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

November 26, 2025 / 07:40 PM IST

ఆటో బోల్తా .. ముగ్గురికి గాయాలు

అన్నమయ్య: కె. వి. పల్లి మండలం కుప్పం వారి పల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మారేళ్ల నుంచి పీలేరు వైపు వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

November 26, 2025 / 07:19 PM IST

భారీ అగ్నిప్రమాదం.. బిక్కుబిక్కుమంటూ వందల మంది..!

హాంగ్‌కాంగ్‌లోని తైపో జిల్లాలో ఓ హైరైజ్ నివాస సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్‌లో సుమారు 2000 మంది నివసిస్తుండగా.. వందల మంది మంటల్లో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మంటల ధాటికి లోపల ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది.

November 26, 2025 / 04:46 PM IST

రూ.20 లక్షల సిగరెట్లు సీజ్

AP: నెల్లూరు వెంకటరమణాపురంలో పోలీసులు భారీగా సిగరెట్లను పట్టుకున్నారు. గోదాములో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువ చేసే బిల్లులు లేని సిగరెట్లను సీజ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

November 26, 2025 / 04:38 PM IST

పరిశ్రమలో సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

AP: చిత్తూరు జిల్లాలోని టైల్స్ పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో జరిగింది. ఇందులో పోతురాజు, పాండు అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

November 26, 2025 / 04:07 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. సీనియర్ IAS మృతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సీనియర్ IAS మృతిచెందాడు. గౌనహల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో KSMCL MD, సీనియర్ IAS అధికారి మహంతేశ్ బిళగి మరణించారు. ఓ వేడుకకు కారులో వెళ్తుండగా.. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. ఈ దుర్ఘటనపై CM సిద్ధరామయ్య, Dy. CM డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

November 25, 2025 / 11:25 PM IST

డ్రైనేజీలో మృతదేహం లభ్యం

KMM: ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

November 25, 2025 / 04:41 PM IST

అక్రమంగా గంజాయి రవాణా.. ఏడుగురు అరెస్ట్

ATP: గంజాయి ముఠా గుట్టును అనంతపురం త్రీటౌన్ పోలీసులు రట్టు చేశారు. విశాఖ జిల్లా తునిలో గంజాయి కొనుగోలు చేసి రైలులో అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 1/2 కేజీల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, రూ. 2,700 నగదు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అనంతపురం, బాగేపల్లిలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

November 25, 2025 / 02:54 PM IST

స్కూటీ బోల్తా పడి దివ్యంగుడి మృతి

SKLM: రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన మందస మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. VGపురం గ్రామానికి చెందిన ఎర్ర సింహాచలం (43) అనే దివ్యాంగుడు జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు స్కూటీ బోల్తా పడి తీవ్రగాయాల పాలయ్యాడు. తలకు బలమైన గాయం అవ్వడంతో పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

November 25, 2025 / 02:28 PM IST

బెంగళూరులో తెలుగు విద్యార్థిని దారుణ హత్య

AP: అన్నమయ్య జిల్లాకు చెందిన విద్యార్థిని బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. బెంగళూరులోని ఆచార్య కళాశాలలో దేవశ్రీ డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు చిత్తూరు జిల్లా పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, దేవశ్రీని అతడే హత్య చేసినట్లు మాదనాయనకహళ్లి పోలీసులు గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు.

November 25, 2025 / 12:01 PM IST

శాలిబండ అగ్నిప్రమాదం వీడిన సస్పెన్స్

TG: HYD శాలిబండ అగ్నిప్రమాదంపై సస్పెన్స్ వీడింది. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్‌లోని రిఫ్రిజిరేటర్లు, AC కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించినట్లు గుర్తించారు. పేలుళ్ల దాటికి గోమతి ఎలక్ట్రానిక్స్ ముందు పార్క్ చేసిన కారు పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ కారు అద్దాలు పగలగొట్టి బయట పడ్డ కాసేపటికే మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైంది. కారులో CNG పేలలేదని డ్రైవర్ స్పష్టం చేశాడు.

November 25, 2025 / 10:26 AM IST

శాలిబండ ప్రమాదంపై కేసు నమోదు

TG: శాలిబండలో ఎలక్ట్రానిక్ షాపు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ మణికంఠను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలి వద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 25, 2025 / 09:27 AM IST

BREAKING: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 24, 2025 / 11:12 PM IST