• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

బైకును ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి

NZB: బైకును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలై మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బోధన్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎడపల్లి నుంచి జానకంపేట వైపు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న పిట్ల గంగాధర్ గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

May 7, 2025 / 08:00 AM IST

వడదెబ్బతో మహిళ మృతి

MHBD: జిల్లా కేంద్రంలోని లెనిన్ నగరికి చెందిన అమరావతి (40) అనే మహిళ సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి కూతురు ఉండటంతో కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగారు. నిరుపేదలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె భర్త కోరాడు.

May 6, 2025 / 07:40 PM IST

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

SKLM: కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ ఎస్.కే షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతని వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

May 6, 2025 / 07:40 PM IST

ఆటోను ఢీకొట్టిన అడవిదున్నలు.. ఇద్దరికి గాయాలు

KMM: సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఆటోను అడవి దున్నలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైయ్యాయి. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన ఐదుగురు కూలీలు సత్తుపల్లిలో పని నిమిత్తం ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ, కూలి ఓదేలకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.

May 6, 2025 / 01:07 PM IST

నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్‌లో దారుణ హత్య

నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్‌లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. అయ్యప్ప గుడి సమీపంలోనీ రాయలసీమ రాగి సంగటి హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య (చిన్న)ను హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సింధుప్రియ, వేదయపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

May 6, 2025 / 11:09 AM IST

సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ELR: కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో సోమవారం జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. కుక్కునూరు మండలంలోని జిన్నేలగూడెం అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో 200 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

May 6, 2025 / 07:35 AM IST

నీట్‌లో ఫెయిల్ అవుతానని విద్యార్థి సూసైడ్

ADB: నీట్‌లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై మనోహర్ తెలిపారు. మొన్న జరిగిన నీట్‌లో విద్యార్థి HYDలో పరీక్ష రాసి సోమవారం ఉట్నూర్ వచ్చాడు. పరీక్ష బాగా రాయలేదని మనస్తాపం చెంది తన రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.

May 6, 2025 / 07:28 AM IST

ముక్కు అందంగా ఉందని కొరికేసిన భర్త

పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బేర్పారాకు చెందిన బాపన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు ఖాతూన్ ముక్కును కొరికేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన ముక్కు చాలా అందంగా ఉందని, అవకాశం దొరికితే దానిని కొరికి తినేస్తానని భర్త తరచూ అనేవాడని ఫిర్యాదులో పేర్కొంది. చివరకు అతను అన్నంత పని చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.

May 5, 2025 / 11:26 AM IST

రేపల్లెలో మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

బాపట్ల: రేపల్లెలో సోమవారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. 5వ వార్డులో నివసించే సింగోటి కోటేశ్వరమ్మ అనే మహిళా ఉద్యోగి తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానిక సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

May 5, 2025 / 10:18 AM IST

BREAKING: అగ్నిప్రమాదం

TG: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. 

May 4, 2025 / 08:23 PM IST

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య

HYD: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం శ్రీకాకుళం అని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

May 4, 2025 / 03:00 PM IST

పాము కాటుతో వివాహిత మృతి

NRML: పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రజిత ఇంటి సమీపంలో పాముకాటుకు గురయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రజిత మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

May 4, 2025 / 12:53 PM IST

చెట్టు విరిగిపడి బాలుడు మృతి

ELR: ముసునూరు గ్రామంలో ఈదురు గాలులు వర్షానికి విరిగిపడిన చెట్టు కారణంగా 10 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా బాల గోవిందం అనే బాలుడు నిద్రిస్తుండగా ఆరు బయట ఉన్న వెలగ చెట్టు ఈదురు గాలులకు విరిగిపడింది. ఈ సంఘటనలో బాల గోవిందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

May 4, 2025 / 11:19 AM IST

వాటర్ ట్యాంక్‌లో పడి వ్యక్తి మృతి

VSP: గాజువాక డిపో వద్ద మున్సిపల్ వాటర్ ట్యాంక్‌లో పడి ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నక్కవానిపాలెం ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా తిరుగుతుంటాడు. శనివారం మధ్యాహ్నం వాటర్ ట్యాంక్ లోపలికి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. పరిసరప్రాంత ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసుల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.

May 3, 2025 / 08:24 PM IST

బైక్ ఢీకొని మహిళ మృతి

MBNR: మరికల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ స్పాట్లో మృతి చెందింది. స్థానికులు తెలిపిన కథనం మేరకు మండల కేంద్రానికి చెందిన తిరుపతమ్మ హోటల్‌లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తూన్న క్రమంలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడే మృతి చెందింది.

May 3, 2025 / 08:17 PM IST