KNR: జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన గుడిసెల్లో ఉంటున్న ఓ చిన్నారిని లారీ ఢీకొంది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక రోడ్డు పక్కన ఆడుకుంటుండగా లారీ వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.