AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోతుల దాడిలో దానబోయిన చిన్నబుల్లి(68) అనే వృద్ధురాలు మృతిచెందింది. పెద్దిపాలెం గ్రామ శివారులో ఉంటున్న ఆమె.. గేదెలకు నీరు పెట్టేందుకు వెళ్లగా, కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే వీలు లేకపోవడంతో ఆమె చనిపోయింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా.. ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని గ్రామస్థులు పేర్కొన్నారు.