• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్

HNK: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని హౌజుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37)పరకాల డివిజన్లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా,ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.

January 10, 2025 / 08:07 AM IST

ఎలక్ట్రానిక్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

NRML: జిల్లాలో గత రాత్రి కుబీర్ మండల కేంద్రంలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని అన్నపూర్ణ డిజిటల్స్ & ఎలక్ట్రానిక్స్ దుకాణంలో గతరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

January 10, 2025 / 06:54 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

NTR: గీత కార్మికుడు మృతి చెందిన జగ్గయ్యపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని షేక్ మొహమ్మద్ పేటలో తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి గీత కార్మికుడు చలమయ్య మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

January 6, 2025 / 12:42 PM IST

కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

NRML: నర్సాపూర్(జి)మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం రోడ్డుపై కారు ఢీకొన్న ఘటనలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు నర్సాపూర్ (జి)కి చెందిన ఇద్దరు వ్యక్తులు గంగారెడ్డి, గణపతి రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనక నుంచి కారు ఢీకొనగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

January 6, 2025 / 09:02 AM IST

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం

NRML: ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘనట నిర్మల్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మంజులాపూర్‌కు చెందిన అశ్విని(30)భర్త, అత్తింటి వేధింపులు భరించలేక తమ ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

January 6, 2025 / 08:55 AM IST

అన్నం పెట్టే ఇంట్లోని చిన్నారిపై అఘాయిత్యం

కృష్ణా: ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుడివాడలో ఓ దంపతులకు ఐదుగురు అమ్మాయిలు. వారి ఇంటి ముందు ఉండే జోజిబాబు(42) ఓ రైసు మిల్లులో కార్మికుడిగా పనిచేస్తుంటాడు. ఇతడికి చిన్నారి తల్లిదండ్రులే రోజూ అన్నం పెట్టేవారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రపోతున్న చిన్నారిపై బోజిబాబు అత్యాచారం చేశాడు.

January 6, 2025 / 07:42 AM IST

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

CTR: చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

January 5, 2025 / 07:02 AM IST

కారు- బైకు ఢీ.. ఒకరి మృతి

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బిల్లాపుట్టు జాతీయ రహదారి వద్ద టూరిస్ట్ కారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కడప నాగభూషణం మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల వద్ద లొంగిపోయాడు. అరకులోయ ఏపీఆర్లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ ఆర్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నాడు. భార్య చింతపల్లిలో ఉపాధ్యాయురాలు.

January 5, 2025 / 06:37 AM IST

షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం

NRML: షార్ట్ సర్క్యూట్‌తో రెండు దుకాణాలలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం బాసర మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో స్థానిక బస్టాండ్ వద్దగల శారద ప్రియా మిల్క్‌లో సార్ట్ సర్క్యూట్ జరిగి భారీ ప్రమాదం సంభవించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్సై గణేష్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

January 3, 2025 / 10:59 AM IST

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ సస్పెండ్

TPT: తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఆఫ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఓ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్ర రావు ఉత్తర్వులు జారి చేశారు.

December 31, 2024 / 06:25 AM IST

తుంకిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 31, 2024 / 05:11 AM IST

తుంకిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 31, 2024 / 05:11 AM IST

తుంకిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

December 31, 2024 / 05:11 AM IST

179 మంది ప్రాణాలు పోవడానికి గోడే కారణమా..?

దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో మరో అంశం బయటకు వచ్చింది. రన్ వే చివర కాంక్రీట్ గోడ ఉండటం వల్లే అందరూ చనిపోయారని నిపుణులు అంటున్నారు. ఆ గోడ లేకపోతే.. కంచెను దాటుకొని విమానం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగేదన్నారు. దీంతో అసలు ప్రాణ నష్టం ఉండేది కాదన్నారు. కాగా, రన్ వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందనే వార్తలను అధికారులు ఖండిస్తున్నారు.

December 30, 2024 / 04:10 PM IST

లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

SRCL: పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన గుడ్ల కౌసల్య-రాజు దంపతులు సైకిల్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తు చేసుకోవడానికి దంపతులు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 30, 2024 / 02:19 PM IST