• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కల్తీ దందా.. వేలాది కిలోల మాంసం స్వాధీనం

TG: హైదరాబాద్‌లో కల్తీ దందా రోజురోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతోంది. పాడైన మటన్ అమ్ముతున్న ఓ షాప్‌పై గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. యూపీ నుంచి తీసుకొచ్చి మేక, గొర్రె మాంసం నిల్వచేసినట్లు గుర్తించారు. FSSAI అనుమతులు లేకుండా అక్రమంగా మాంసం విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. వేలాది కిలోల మాంసం, తలలు, కాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

March 29, 2026 / 10:24 AM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్.

NTR: తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్ వద్ద జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు శనివారం దాడి చేశారు. SI-II రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో “కోతముక్క” జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,400 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూదానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

March 28, 2026 / 08:25 PM IST

ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

ప్రకాశం: ఒంగోలు భాగ్యనగర్‌లో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య మృతి చెందాడు. కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రమణయ్య క్రింద పడగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా కానిస్టేబుల్ మృతి చెందాడు. ప్రమాదంపై పలువురు అధికారులు విచారం వ్యక్తం చేశారు.

March 28, 2026 / 08:00 PM IST

‘అక్రమ రైస్ మిల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దు’

NRML: దిలావర్‌పూర్ గ్రామంలోని జూనియర్ కళాశాల ప్రాంతంలో నిర్మిస్తున్న రైస్ మిల్‌కు అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు MPO, సర్పంచ్, EO, ఉప సర్పంచ్‌లను శనివారం కోరారు. పరిసరాల్లో విద్యాసంస్థలు, నివాస గృహాలు, దేవాలయాలు ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీరేష్ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

March 28, 2026 / 06:06 PM IST

లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నయాగఢ్ జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 28, 2026 / 09:19 AM IST

మంచు దిబ్బల్లో ఘోరం.. ఏడుగురు మృతి

లడఖ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు వెళ్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి మృతిచెందినట్లు ద్రాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)విశాల్ అత్రి తెలిపారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ‘X’ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరిందని, మరో ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు.

March 28, 2026 / 08:45 AM IST

BREAKING: ముగ్గురు స్పాట్ డెడ్

AP: చిత్తూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మం. శేషాపురం వద్ద నేషనల్ హైవేపై ఆగి ఉన్న RTC బస్సును కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వేగంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 28, 2026 / 07:54 AM IST

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

కర్ణాటక విజయపుర జిల్లాలో ముగ్గురు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరగి గ్రామానికి చెందిన శంకరప్ప ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం రాత్రి ఇంటికి వచ్చేసరికి భార్య రాజశ్రీ(28), పిల్లలు అనుశ్రీ(6), తను(3), కుమారుడు సంతోష్(1) కనిపించలేదు. గ్రామస్తులతో కలిసి వెతికారు. నలుగురూ ఓ బావిలో శవాలై కనిపించారు.

March 28, 2026 / 07:50 AM IST

ఏడుగురు మృతి.. గవర్నర్ దిగ్భ్రాంతి

జమ్మూకాశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

March 27, 2026 / 09:20 PM IST

బస్సు ప్రమాదం.. రెవెన్యూశాఖకు మృతుల DNA నివేదిక

AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతుంది. మార్కాపురం రెవెన్యూ అధికారులకు  మృతుల డీఎన్ఏ నివేదిక చేరింది. గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మృతదేహాలకు డీఎస్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. రేపు ఉదయం బంధువులకు మృతదేహాలు మృతదేహాలు అప్పగించనున్నారు. నిన్న 14 మంది మృతదేహాలకు శవపరీక్షలు ముగిశాయి. మరోవైపు 13 మంది బాధితులు కోలుకుంటున్నారు.

March 27, 2026 / 09:04 PM IST

BREAKING: ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి

జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌లను కలిపే జోజిలా కనుమ వద్ద భారీగా హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. హిమపాతం కారణంగా శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పలువురు వాహనదారులు ఇక్కడ చిక్కుకుపోయారు. అధికారులు ఈ మార్గాన్ని క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 27, 2026 / 08:44 PM IST

ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

MNCL: బెల్లంపల్లి పట్టణ పోచమ్మ చెరువులో శుక్రవారం వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. తాళ్ళగురిజాల SI రామకృష్ణ వివరాలు.. బూడిదగడ్డ బస్తీలో నివసించే శీలం రాజం గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేదు. ఈనెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, చెరువు వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగి చనిపోయాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

March 27, 2026 / 07:40 PM IST

మార్కాపురం బస్సు ప్రమాదం.. నిందితుడు అరెస్ట్

AP: మార్కాపురం శివారులో బస్సు దగ్ధం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో యజమాని హరికృష్ణా రెడ్డి బస్సు నడిపాడు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 14 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడైన హరికృష్ణపై కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదం జరగగానే నిందితుడు బస్సు నుంచి దూకి పారిపోయాడు. తాజాగా కనిగిరి వద్ద పోలీసులు అతడిని అదుపుతోకి తీసుకున్నారు.

March 27, 2026 / 06:11 PM IST

BREAKING: రూ.100 కోట్ల భారీ స్కామ్

TG: కరీంనగర్‌లోని RBL బ్యాంక్‌లో జరిగిన భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మ్యూల్ ఖాతాల ద్వారా 100 కోట్ల మోసం జరిగినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలు తెరిచి డబ్బు మళ్లించారు. సైబర్ క్రైమ్, హవాలా చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

March 27, 2026 / 05:25 PM IST

ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కౌశాంబిలో కంటైనర్‌ను పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

March 27, 2026 / 05:21 PM IST