AP: కాకినాడ జిల్లా పేలుడు ఘటనలో ఇప్పటివరకు 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నానిగా గుర్తించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిమితికి మించి బాణాసంచా తయారుచేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
AP: కాాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో భారీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే, ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల చట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల్లో 20 కార్మికులు చిక్కుకున్నట్లు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యసాయి: పరిగి మండలం స్థానిక చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇతర కారణాలున్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గానికి చెందిన కొందరు గుడివాడ మినప చేలు తీత కోసం వెళుతుండగా లారీ పైనుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిందపడే సమయంలో సదరు వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం.
TG: ఆర్మూరులోని మామిడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం (68) చనిపోయాడు. ఎలక్ట్రిక్ స్కూటీపై ఆయన వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను అక్కడ ఉన్న వ్యక్తులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గంగారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KKD: తుని మండలం చేపూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం NH-16 రోడ్డుపై డివైడర్ మధ్యలో గుర్తుతెలియని (55) వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై చేపూరు వీఆర్ రుత్తల అనిత ఫిర్యాదు చేయగా, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ ట్రాఫిక్ 1,2 పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి 41 మంది మద్యం తాగినట్లు గుర్తించామని ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేష్ తెలిపారు. వీరిని శుక్రవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీరిలో 13 మందికి రెండు నుంచి ఐదు రోజుల జైలుశిక్ష, 28 మందికి రూ.10వేల వంతున జరిమానా విధించారని సీఐ తెలిపారు.
AP: యువతిగా ఫేక్ IDతో పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిని HYD పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన నిందితుడు పెదపూడి ప్రసన్నకుమార్ ఓ మ్యాట్రిమోనియల్ సైట్లో అమ్మాయిలా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని మోసాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. క్రిప్టో ఇన్వెస్ట్ మోసాలకూ పాల్పడ్డాడని, 400+ సిమ్ కార్డులతో ఫేక్ అకౌంట్లు తెరిచాడని గుర్తించారు.
AP: నంద్యాల జిల్లా జగదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు క్రేన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: సూర్యాపేట కోదాడలో లాకప్ డెత్ కేసు వెలుగు చూసింది. ఈ క్రమంలో కర్ల రాజేష్ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జాతీయ కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్పై ఆరోపణలు ఉన్నాయి.
TG: హైదరాబాద్లోని బొమ్మలరామారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే యువకుడిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేశారు. మూడు రోజుల ముందు అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మాట్లాడాలని పిలిచి అజయ్పై యువతి సోదరుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి 14 సార్లు పొడిచాడు. దీంతో అతని పరిస్థితి విషయంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీలో నివసిస్తున్న వడ్డే మారుతి (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణలో ఎదురైన సమస్యలు, అప్పుల భారం కారణంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.