TG: ఆర్మూరులోని మామిడిపల్లి శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని రిటైర్డ్ టీచర్ నాగులపల్లి గంగారం (68) చనిపోయాడు. ఎలక్ట్రిక్ స్కూటీపై ఆయన వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను అక్కడ ఉన్న వ్యక్తులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గంగారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.