KKD: తుని మండలం చేపూరు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం NH-16 రోడ్డుపై డివైడర్ మధ్యలో గుర్తుతెలియని (55) వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై చేపూరు వీఆర్ రుత్తల అనిత ఫిర్యాదు చేయగా, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.