AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో భారీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే, ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల చట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.