శ్రీలంకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో 35 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ఘోరం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ELR: వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని శనివారం చింతలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాతిమాపురం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఒక వ్యక్తి తన బైక్ ను వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని పట్టుకుని విచారించగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 35 కేసులు వరకు నమోదైనట్లు సీఐ తెలిపారు.
KMM: పాల్వంచ మండలానికి చెందిన ఓ యువతి (19) వరంగల్లో డిగ్రీ చదువుతోంది. సెలవులు కావటంతో ఇంటికి వచ్చింది. ఇంట్లో ఏ పనులు చేయడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆమె మన స్తాపానికి గురైంది. శనివారం ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే కుటుంబీకులు పాల్వంచ సీహెచ్సీకి తరలించగా వైద్యులు చికిత్స చేశారు.
PLD: రొంపిచర్ల మండలంలోని నల్లగార్లపాడులో వరిగడ్డి వామి దగ్దమైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, ఆంజనేయులకు చెందిన ఐదు ఎకరాల వరిగడ్డి విద్యుత్ తీగలు తాకి దగ్ధమైంది. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్టు బాధితులు తెలిపారు. నరసరావుపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అతని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
NLR: కావలి మండలం రాజువారి చింతలపాలెం శివారులో ఫోన్ దొంగతనం అనుమానంతో టిఫిన్ సెంటర్ యజమాని రమేష్పై సూర్య అనే యువకుడు శుక్రవారం కత్తితో దాడి చేసినట్లు కావలి రూరల్ ఎస్సై బాజీబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమిస్తున్నానని పశ్చిమ బెంగాల్కు చెందిన మైనర్ బాలికపై(16) అత్యాచారానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఆ యువకుడు ఓంరాజ్ సైని(20)పై ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తిరుపతి రాజు, ఎస్సై నాగేంద్రబాబులు తెలిపారు.
MHBD: జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన పసుపులేటి నరేష్ (26) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. మద్యపానం ఎక్కువైందని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నరేష్ పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రామయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కో రియాజ్ పాషా తెలిపారు.
KMR: లింగంపేట మండలం బాలాపూర్లో ధరావత్ ఈశ్వర్(56) తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం బాన్సువాడ మండలంలోని అంకోల్ తాండాలోని అత్తగారింటికి వెళ్లినట్టు, బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో బాన్సువాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారని భార్య సంగుబాయి తెలిపారు.
కృష్ణా: ఇసుక లోడ్తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడిన ఘటన బందరు మండలం చిట్టిపాలెం వద్ద బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరిమితికి మించిన బరువుతో ఇసుక రవాణా చేపట్టడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
NZB: బైకును బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలై మృతిచెందిన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులోని అలీసాగర్ లిఫ్ట్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బోధన్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎడపల్లి నుంచి జానకంపేట వైపు వెళ్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న పిట్ల గంగాధర్ గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
MHBD: జిల్లా కేంద్రంలోని లెనిన్ నగరికి చెందిన అమరావతి (40) అనే మహిళ సోమవారం రాత్రి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలికి కూతురు ఉండటంతో కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగారు. నిరుపేదలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె భర్త కోరాడు.
SKLM: కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ ఎస్.కే షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతని వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
KMM: సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఆటోను అడవి దున్నలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైయ్యాయి. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన ఐదుగురు కూలీలు సత్తుపల్లిలో పని నిమిత్తం ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ, కూలి ఓదేలకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.
నెల్లూరులోని అయ్యప్ప గుడి సెంటర్లో మంగళవారం దారుణ హత్య చోటుచేసుకుంది. అయ్యప్ప గుడి సమీపంలోనీ రాయలసీమ రాగి సంగటి హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఉదయగిరి మండలం సర్వరాబాద్ గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య (చిన్న)ను హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సింధుప్రియ, వేదయపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.