CTR: నాగలాపురానికి చెందిన విలేకరి రాహుల్ గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగలాపురం నుంచి స్వగ్రామం సురుటుపల్లికి బైక్పై వెళుతుండగా బయటకొడియంబేడు వే బ్రిడ్జ్ వద్ద బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాహుల్కు తలపై, కుడి భుజం ఎముకకు తీవ్ర గాయాలు, ముఖం చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కొడుకు కొట్టి చంపాడు. వెల్లటూరుకు చెందిన సోమమ్మ మంచం మీద పడుకుని ఉండగా కుమారుడు బాదరయ్య కొట్టి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చి చూస్తే వాహనం కనబడలేదు. దీంతో ద్విచక్ర వాహనం చోరికి గురైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం: జిల్లాలో నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. పొన్నలూరులోని ముత్తరాజుపాలెం వద్ద ట్రాక్టర్ బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మార్కాపురంలో ఓ వ్యక్తి మద్యం సేవించి మృతి చెందాడు. ముండ్లమూరు మండలంలోని చంద్రగిరిలో ప్రమాదవశాత్తు కాలుజారటంతో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మద్దిపాడులో సీతారాంపురం గ్రామనికి చెందిన వృద్ధుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
KKD: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఏలేరు కాలువలోకి స్థాన్నానికి దిగి గల్లంతు అయ్యారు. స్థానికులు వివరాలు.. కాకినాడ, జగన్నాధపురం బిర్యానీ పేటకు చెందిన పిరమాడి విశాల్ (7), కొప్పాడి బాలు (22) ఇద్దరిలో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.
SDPT: జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కారు, 3 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోకి కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్ళింది. కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్: వెంగ్వాపేట్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గ్రామస్తుల వివరాల ప్రకారం మంగళవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులకు దుర్గంధమైన వాసన రావడంతో వ్యవసాయ బావి వైపు వెళ్లారు. అందులో వ్యక్తి మృతదేహం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది విచారణ చేపట్టారు.
PLD: నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడుకు చెందిన రైతు మీసాల నాగేశ్వరరావు తన మిర్చి పంటను కల్లంలో అరబెట్టాడు. గుర్తుతెలియని దుండగులు సుమారు 15 క్వింటాళ్ల మిర్చి చోరీకి పాల్పడ్డారని మంగళవారం తెలిపాడు. ఆరుగాలం కష్ట పడి పంట పండించి కల్లాలలో ఆరబెడితే దొంగలు అపహరించుకు పోతున్నారని వాపోయాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలంలోని ఐతురాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పంగ నిఖిల్ అనే యువకుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నిఖిల్ తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి అకాల మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
AP: కృష్ణా జిల్లా అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పసికందుతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
SS: లేపాక్షి మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై నరేంద్ర వివరాల మేరకు.. వీఆర్ఏ రామాంజనేయులును అతని తమ్ముడు అశ్వర్థ మద్యం తాగి మెట్ల మీద నుంచి తోసేశాడు. దీంతో వీఆర్ఏ ఇంటిపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయై అక్కడికక్కడే మృతి చెందారు.
ATP: గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత విచిత్రమైన దొంగతనం జరిగింది. తాడిపత్రి రోడ్డులోని మురళీకృష్ణ జనరల్ స్టోర్లో ఉప్పు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. ఓ మహిళ ముఖానికి మాస్కు ధరించి అంగడి బయట ఉన్న 15 ఉప్పు ప్యాకెట్ల డబ్బాను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపు యజమాని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు.