KDP: తమిళనాడులోని రాణిపేట వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కడప జిల్లా వేపరాల గ్రామానికి చెందిన బడి గింజల నాగేంద్ర, గంజికుంట శేషయ్యలు అరుణాచలం దర్శనానికి బైక్పై వెళ్తుండగా రాణిపేటలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు కిందపడగా మరో కారు వారిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
HYD: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిపై మధురానగర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాదగిరినగర్లో నివాసముంటున్న షేక్ ఫైజల్ మత్తు పదార్ధాలను విక్రయిస్తున్నాడని సమాచారంతో పోలీసులు అతని ఇంటిపై దాడిచేసి 155 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నుంచి కొనుగోలు చేసిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
SKLM: రాజమహేంద్రవరంలో జంట హత్యలకు పాల్పడిన జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందిగాం(M) కొత్త వీధికి చెందిన పిల్లా శివకుమార్ హైదరాబాద్లో ఉంటూ సినిమాల్లో లైట్ బాయ్గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్లో శివకు సనా(16) పరిచయమైంది. ఈ నేపథ్యంలో యువతి వేరొకరితో చాటింగ్ చేయడాన్ని సహించని శివ యువతితో పాటు తల్లిని హత్య చేశాడు.
TG: హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్, ఫుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, కుళ్లిపోయిన ముడిపదార్థాలతో యథేచ్చగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్నారు. తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. కల్తీ అల్లం పేస్ట్ను అధికారులు మూసీలో పారబోశారు.
KDP: చాపాడు సమీపంలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీపేటకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డి, సీతారామపురానికి చెందిన ఓబుల్ రెడ్డికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి సీతారామపురం రోడ్డు వైపు బైకుపై తిరుగుతుండగా, ఇదే క్రమంలో వెనక వైపు నుంచి వస్తున్న మహేశ్వర్ రెడ్డి బైకు ఢీకొంది. ఇరువురికి గాయాలయ్యాయి.
KKD: పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి శనివారం బాలికల బంధువులు నడిరోడ్డు పైనే దేహశుద్ధి చేశారు. 7, 13 ఏళ్ల బాలికలకు కొన్ని రోజులుగా 53 ఏళ్ల వయసున్న వ్యక్తి స్వీట్లు, రూ.10 ఇస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటికొచ్చింది.
సత్యసాయి: పరిగి మండలం జయమంగలి నదిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జగదీష్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి సమీపంలో కూల్ డ్రింక్ బాటిల్, పురుగుల మందు బాటిల్ లభించాయి. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పరిగి ఎస్సై రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TPT: రాయల చెరువు నుంచి ఇద్దరూ బైక్పై వస్తూ పీవీ పురం దగ్గర అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన కేశవ, దీపిక అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
KRNL: సి. బెళగల్లో భారీ పేలుడు సంభవించింది. ఖాజా అనే రైతు తనపొలంలో ఉన్న రాతిగుండ్లు పెకలించే క్రమంలో కంప్రెసర్తో పేల్చడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు వీరాంజనేయులు, శ్రీరాములు, మద్దిలేటిగా గుర్తించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది.
కోనసీమ: మాచవరం – రామచంద్రపురం రోడ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్పై వెళ్తుండగా సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
KDP: ముద్దనూరు మండలం ఉప్పలూరులో జరిగిన కారు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు.. ఉప్పలూరుకి చెందిన గోవిందు కీర్తన (6) ఉప్పలూరులోని సచివాలయం వద్ద వారి బంధువుల శుభాకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా కారు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రి తరలించారు.
SKLM: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో గురువారం పట్టపగలే దొంగతనం జరిగింది. కృష్ణారావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి తాళం తెరచి ఉంది. బీరువాలోని 65 గ్రాముల బంగారం దొంగతనానికి గురైనట్లు గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
CTR: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన కంపేల మానస అనే మహిళ అదృశ్యం అయినట్లు ఎస్ఐ ప్రసాద్ గురువారం ప్రకటనలో తెలిపారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బ్యాంకు పనిమీద బయటికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి రాలేదన్నారు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మానస తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.