AP: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం జానంపేట దగ్గర ఓ బైక్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ రమ్యతో పాటు ఆమె భర్తను కులం పేరుతో దూషించిన పాముల రాజేష్ అనే వ్యక్తిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెక్కొండ ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ATP: గుత్తి మండల పరిధిలోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి గ్రామంలో సోమవారం శ్రీనివాసులు అనే రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యుల గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను DGGI అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణలో జీఎస్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. రూ.13 కోట్ల ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ జరిగినట్లు తేలింది. ఫినో బ్యాంక్ రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం. విచారణ చేపట్టిన HYD ఎకనమిక్ అఫెన్స్ కోర్టు రిషి గుప్తాకు 14 రోజుల రిమాండ్ విధించింది.
AP: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్లోని ప్లాస్టిక్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలతో పాటు వేదాయపాలెం మొత్తం పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. గోదాముకు తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి నెలకొంది.
TG: లండన్లో తెలంగాణ యువకుడు శ్రీకర్ మృతి చెందాడు. లండన్లోని ఇంట్లో అగ్నిప్రమాదంలో శ్రీకర్ గాయపడ్డాడు. 3 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. మృతి చెందాడు. దాదాపు 80శాతం పైగా కాలిన గాయాలతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు పరిస్థితి విషమించడంతో మరణించాడు.
అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ రాష్ట్రంలోని ఓ బార్లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరగడంతో నిందితుడు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
TG: ఓ మహిళ తన భర్తను హత్యచేసిన దారుణ ఘటన హైదరాబాద్లోని ముషిరాబాద్లో జరిగింది. మద్యం తాగి హింసిస్తున్నాడని కట్టుకున్న భార్యే.. భర్తను హతమార్చింది. తాగి వచ్చిన భర్త గొడవకు దిగడం విచక్షణ కొల్పోయి దాడి చేసి దీంతో అతడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నాని దర్యాప్తు చేస్తున్నారు.
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం చోటుచేసుకుంది. మనీషా అనే వివాహితను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. మూడు నెలల క్రితం మనీషా-తవీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చారు. వీరు ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: నెల్లూరు జిల్లా జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
KMR: పల్వంచ మండలం వేల్పుగొండలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం ఐదేళ్ల బాలుడు ట్రాక్టర్పై ఆడుకుంటున్నాడు. తాళం చెవి ట్రాక్టర్కు ఉండటంతో దాన్ని స్టార్ట్ చేశాడు. వెనుక గేర్లో ఉండటంతో ఒక్కసారిగి వెనక్కి కదిలి ట్రాక్టర్ టైర్లు బాలరాజు ఛాతీపై నుంచి వెళ్లగా తీవ్రగాయాలయ్యాయి. అనంతరం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అమెరికాలోని సిన్సినాటిలో ఒక మ్యూజిక్ ఈవెంట్లో కాల్పులు జరిగాయి. రివర్ఫ్రంట్ లైవ్ వేదిక వద్ద దుండగులు జరిపిన ఈ దాడిలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
TG: మహబూబ్నగర్లో ఈ-సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోనే ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
TG: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్పల్లిలో ఎస్కే రాయల్ ఎంటర్ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.