NGKL: లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. ఎల్లమ్మ కన్న కూతురు నందినిని గొంతు పిసికి చంపి నీటి గుంతలో పడేసింది. ఐదు నెలల క్రితం భర్తను రోకలిబండతో చంపి జైలుకు వెళ్లొచ్చింది. నందిని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
WNP: ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ముగ్గురికి గాయాలైన ఘటన ఇవాళ ఉదయం కొత్తకోట మండలంలో జరిగింది. బస్సు కడప నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా పాలెం వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బస్సులో 37 మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
GDWL: జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారి 44పై ఆదివారం సాయంత్రం ఓ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనంలో ఉన్న కంటైనర్ బెల్ట్ తెగి కారు మీద పడిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తెరిచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: మీర్చౌక్ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫైర్ ఇంజిన్లు సమయానికి రాకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ ఇంజిన్లలో ఆక్సిజన్ అందుబాటులో లేదన్నారు. అదేవిధంగా ప్రమాద తీవ్రతను అధికారులు అంచనా వేయలేదని విమర్శించారు. కాగా, ఈ ఘటనలో నాలుగు కుటుంబాలకు చెందిన వారు చనిపోయారు. వారంతా ఉమ్మడి కుటుంబసభ్యులుగా తెలుస్తోంది.
TG: మీర్చౌక్ అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. స్పాట్లో ముగ్గురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున ఓ భవనంలో మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ పొగతో ఊపిరాడక పలువురు చనిపోయారు.
అన్నమయ్య: పీలేరు సదుం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడడంతో కర్ణాటకకు చెందిన వ్యక్తులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
MNCL: కాసిపేట మండలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. అంగడి బజార్కు చెందిన ప్రశాంత్ (45) శనివారం నీటి కోసం మోటర్ ఆన్ చేశాడు. నీళ్లు రాకపోవడంతో వైరును పట్టుకొని మోటార్ కదిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ప్రియదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
KDP: చాపాడు మండలం పల్లవోలు దళితవాడకు చెందిన సుబ్రహ్మణ్యం గేదెలు మెపేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భారీ వర్షం కురిసి పిడుగు పాటుకు గురై సృహ తప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
TG: మెదక్ జిల్లా తూప్రాన్లో విషాదం నెలకొంది. పిడుగుపాటుతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు ప్రసాద్, యశ్వంత్గా గుర్తించారు. మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.
VZM: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్సై మహేష్ శనివారం సాయంత్రం చెప్పారు. బొండపల్లి మండలం బోడసింగిపేట ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు.
VZM: పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్సై మహేష్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామ సమీపంలో గొర్రెలను మేపుతుండగా గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన దేవర గంగులు(45)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.
WGL: గీసుకొండ మండల కేంద్రంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన గొడుగు హనుమంతు అనే యువకుడు టీబీ వ్యాధితో బాధపడుతూ శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందినా ఫలితం లేక, వైద్య ఖర్చులకు డబ్బులు లేని లేకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: మైదుకూరు మండలం లెక్కలవారిపల్లె వద్ద శనివారం ఓ ఆటోను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నానుబాలపల్లికి చెందిన సుబ్బమ్మ మృతి చెందగా పలువురికు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొందరు మహిళలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
SRD: కంది మండలం ఎర్దనూర్ తండా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే కిషన్ గౌడ్(42) నిద్రలో మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గురువారం రాత్రి కల్వకుంటలోని ఇంట్లో భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు చూసేసరికి మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరయ్యారు. కుటుంబ సభ్యులను డీపీవో సాయిబాబా పరామర్శించారు.
మెక్సికోకు చెందిన 23 ఏళ్ల వలేరియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఆమె గ్వాడలజారాలో బ్యూటీ సెలూన్లో టిక్ టాక్లో తన ఫాలోవర్స్తో మాట్లాడేందుకు లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించింది. అందరికీ హాయ్ చెప్పింది. ఇంతలో ఆమె శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. లైవ్స్ట్రీమింగ్ జరుగుతుండగానే మరణించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.