AP: నెల్లూరు జిల్లా జీజీహెచ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లల వార్డులో మంటలు చెలరేగాయి. గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరయ్యారు. దీంతో అధికారులు జీజీహెచ్కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.