ASR: డుంబ్రిగుడ మండల కురిడి సమీపంలోని చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై పాపినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోగిలికి చెందిన కే.నాగేశ్వరరావు అనే గిరిజనుడు కనిపించడం లేదని ఈనెల 2న స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బంధువులు ఫిర్యాదు చేశారని తెలిపారు. శనివారం కురిడి సమీపంలోని ఆయన మృతదేహం లభ్యం అయిందన్నారు.
CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్రబాబు (35)తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతివేగంగా వచ్చిన జేసీబీ ఢీ కొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PLD: నరసరావుపేటలోని ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పాత మాగులూరుకి చెందిన గోపి బుక్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద వేగంగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గోపి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోను వదిలి డ్రైవర్ పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఓ జేసీబీ ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు SI రామ్మోహన్ తెలిపారు. నగరికి చెందిన రుశేంద్ర బాబు తన భార్య, కుమారుడు (5)తో కలిసి ఆటోలో వస్తుండగా అతి వేగంగా వచ్చిన జేసీబీ ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్: కూకట్పల్లి PS పరిధిలోని దారువాల వైన్షాప్ పర్మిట్ రూమ్లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రకారం.. గత నెల 5న కేశవ్, ధనుష్ ఇద్దరు దారువాల వైన్స్ పరిమిట్ రూంలో మద్యం తాగుతుండగా గొడవ జరిగింది. ధనుశ్పైన కేశవ్ అతడి స్నేహితులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. గాయాలపాలైన అతడు ఇవాళ మృతి చెందాడు.
HYD: పాతబస్తీ ఫలక్నూమా పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలకుంటా చస్మా ప్రాంతంలో మజీద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సిగరెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి మజీద్పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో అబ్బిరెడ్డి వర్షిత(21) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. తమ బిడ్డను భర్త బాబ్జి, కుటుంబసభ్యులు కలిసి హింసించి చంపేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని మృతురాలు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెద్దాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
BPT: మార్టూరు జాతీయ రహదారిపై రెస్ట్ ఏరియా వద్ద శుక్రవారం వేకువ జామున ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది ప్రయాణికుల్లో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108, హైవే అంబులెన్స్ల ద్వారా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NGKL: తాడూరు మండలం తుమ్మలసూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. పిండిగిర్ని దుకాణంలో విద్యుత్ షాక్తో తల్లి జయమ్మ(40), కొడుకు శ్రీకాంత్(15) మృతి చెందారు. పిండిగిర్ని నడుపుతుండగా శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురైన నేపథ్యంలో కొడుకును రక్షించుకునే ప్రయత్నంలో తల్లి జయమ్మ కూడా షాక్కు గురికావడంతో కొడుకుతోపాటు తల్లి మృతి చెందారు.
విజయవాడ పటమటలో ద్విచక్ర వాహనల దొంగలను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10లక్షల విలువ చేసే 16 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా ప్రవర్తించిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ చెప్పారు. దుండగులు మోపిదేవికి చెందిన ప్రసాద్, కానూరుకు చెందిన రబ్బానీగా గుర్తించామన్నారు.
SRD: అర్సీపురం పోలీసు స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్కన ఆటో స్టాండ్లో తన బ్యాగ్ పెట్టి ఫ్లైఓవర్ పైకి వెళ్లి కిందకు దూకగా వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి బ్యాగులో తాపీ తదితర సామాగ్రి ఉన్నాయి. పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది
WGL: గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గురువారం రాయపర్తి మండలం ఆర్ఆర్ కాలనీ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
NDL: కోయిలకుంట్ల మండలం రేవనూరు గ్రామ సమీపంలో ఉన్న కుందూ నదిలో గొర్రెల కాపరి జయవర్ధన్ అనే యువకుడు గురువారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు జయవర్ధన్ అనే యువకుడు గొర్రెలు కాయడానికి వెళ్ళాడు. కుందూ నది దాటే క్రమంలో నదిలో పడి మృత్యువాత పడ్డాడు. రేవనూరు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, కేసు నమోదు చేసుకున్నారు.
SRPT: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నడిగుడెం గ్రామానికి చెందిన వట్టె సతిష్ గొర్రె పిల్లలు మేతకు గ్రామ వెలుపలకు వెళ్లగా కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు చనిపోయాయని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు.
నెల్లూరు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లో ఈ నెల 9న పామూరు ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ వాసు అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసి డంపింగ్ యార్డ్లో పడేశారు. ఈ కేసు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ వాసు హత్య కేసులో 9మంది నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్కు తరలించారు.