KRNL: పెళ్లీడుకొచ్చిన కూతురు బలన్మరణం పొందడంతో ఆ కుటుంబం లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదోని మండలం చాగి గ్రామానికి చెందిన యువతి ప్రమీల ఉన్నత చదువులు చదివింది. తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుందని భావించిన ఆశలు ఆవిరి అయ్యాయి. ప్రమీల (23) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.