W.G: మొగల్తూరు మండలంలోని కొత్తోట వద్ద బుధవారం ఆవు అడ్డు రావడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్ దానిని ఢీకొట్టింది. తిరుపతి నుంచి కాకినాడ ఆసుపత్రికి 2 నెలల బాబును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నిలిచి పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రాజేష్, రత్నసాగర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాబును వేరొక వాహనంలో తరలించారు.