AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రేపు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.