AP: CM చంద్రబాబు ఎల్లుండి తిరుమల పర్యటనకు రానున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం తిరుమలలో సమీక్ష నిర్వహించనుంది. పద్మావతి అతిథిగృహ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ భద్రతాధికారి భేటీ అయ్యారు. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను జిల్లా యంత్రాంగం పరిశీలించారు.