• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కాలువలో శవమై తేలిన బీజేపీ నేత

TG: జగిత్యాల జిల్లా సుద్ధపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత రమణ అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలారు. గతంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయనపై మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 01:41 PM IST

బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వచ్చి పక్క రోడ్లోకి దూసుకెళ్లి కార్లు, బైకులను ఢీకొట్టింది. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 11:50 AM IST

నగల కోసం భార్య గొంతు కోసిన భర్త

TG: మెదక్ జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. త్రిమూర్తి అనే వ్యక్తి తన భార్య వరలక్ష్మి(36) గొంతుకోసి చంపాడు. నగల కోసమే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న త్రిమూర్తి కోసం పోలీసు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

February 22, 2026 / 10:38 AM IST

BREAKING: ఐదుగురు పోలీసులు దుర్మరణం

ఒడిశా ఝార్సుగూడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే-44పై పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందించినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.

February 22, 2026 / 09:30 AM IST

నీటి సంపులో పడి తొమ్మిదేళ్ల బాలిక మృతి

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:22 AM IST

దారుణం.. యువకుడిని సజీవదహనం చేశారు!

TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి, సజీవ దహనం చేశారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

February 22, 2026 / 08:45 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భింద్ జిల్లాలోని హైవేపై ఓ వ్యాన్‌ను వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 22, 2026 / 07:42 AM IST

కదిలే బస్సులో భారీ చోరీ

AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. ​దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును కమలాపురం పీఎస్‌కు తరలించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.

February 22, 2026 / 02:58 AM IST

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

AP: తూ.గో.జిల్లా దేవరపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 09:08 PM IST

విషాదం.. దంపతుల ఆత్మహత్య

AP: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుప్పంలోని వేపూరులో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భార్య మల్లమ్మ(55) ఉరి వేసుకోవడంతో మనస్తాపం చెందిన భర్త రామప్ప(62) కూడా ఉరి వేసుకున్నాడు. భార్యాభర్తల మృతిత కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 07:07 PM IST

ఉగ్రకుట్ర.. భాగ్యనగరంలో హై అలర్ట్

TG: చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో నగర విధ్వంసానికి ఉగ్రకుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాది జైలు నుంచే ఈ ప్లాన్ రచించినట్లు సమాచారం. దీంతో మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ములాఖత్ సమయంలోనే దాడులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.

February 21, 2026 / 11:58 AM IST

ACB దాడులు.. ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

AO: లంచం తీసుకుంటూ మరో అధికారి ACBకి చిక్కాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్ రూ.20 లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో.. శుక్రవారం సురేష్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేష్, అలాగే అతనికి సహాయం చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు.

February 21, 2026 / 07:29 AM IST

బుల్లెట్ల కలకలం.. నిందితుడు అరెస్ట్

AP: తూ.గో జిల్లా దేచర్లలో బుల్లెట్ల కలకలం రేగింది. UP నుంచి వచ్చి ఉంటున్న సమీర్ హుస్సేన్ నుంచి పోలీసులు 9mm పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్ కోసం ఉపయోగించే 8mm బుల్లెట్లు ఆరింటిని స్వాధీనం చేసుకున్నారు. UP వెళ్లివస్తుండగా పరిచయమైన ఆదిత్యరాజ్ ఇవి ఇచ్చాడని, అతని వద్ద గన్, బుల్లెట్లు ఉన్నాయని సమీర్ పేర్కొన్నాడు. ఆదిత్యపై ఇప్పటికే రాజమండ్రి PSలో పలు కేసులు ఉన్నాయి.

February 21, 2026 / 07:22 AM IST

బుల్లెట్లు స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

AP: తూ.గో. జిల్లాలో తుపాకీ బుల్లెట్లు కలిగి ఉన్న వ్యక్తిని కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన సమీర్ హుస్సేన్ ఏడేళ్ల నుంచి దేచర్లలో నివాసం ఉంటున్నాడు. అయితే, అధికారుల సమాచారం మేరకు సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. అతని నుంచి 9MM పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్‌లో ఉపయోగించే పాయింట్ 8MM 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

February 21, 2026 / 03:58 AM IST

రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్‌లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 12:30 AM IST