సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శంభులింగేశ్వర ఆలయ వెనుక మహిళ మృతదేహాం లభ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి తలకు గాయం ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
NZB: కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం (60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు
ATP: గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద బుధవారం ముందుగా వెళుతున్న లారీని మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మెయిన్ సర్కిల్లో లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.
NLG: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతిచెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్ పేటకు చెందిన గూడూరు చంద్రశేఖర్, మత్స్యగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRPT: చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో లారీలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కంచనపల్లి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: హొళగుంది (మం) ఎల్లార్తి గ్రామంలో బోయ కామాక్షమ్మ అనే మహిళకు చెందిన బీడీ బంకు విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్తో కాలిపోయింది. ప్రమాదంలో దాదాపు రూ.50 వేలు విలువజేసే సరకులు కాలిపోయినట్లు బాధితులు వాపోయారు. బంకులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో స్థానికులు మంటలు ఆర్పే లోపు అప్పటికే చాలా వరకు సరకులు కాలిపోయాయని తెలిపారు.
TPT: నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ (42) పుదూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బాబి వివరాలు మేరకు.. భాస్కర్ విధులు నిర్వహించుకొని తన సొంతూరు ఈశ్వరవాక వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
ప్రకాశం: మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, సొంత అన్న గతేడాది క్రిస్మస్కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది.
GNTR: ఫిరంగిపురంలో శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాల ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం గ్రామానికి చెందిన సాయి, కుమార్ యువకుల ద్విచక్ర వాహనాలు మార్నింగ్ స్టార్ కళాశాల సమీపంలో ఢీకొట్టుకోవడంతో ఇద్దరి యువకులకు గాయాలయ్యాయి. గాయాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు.
CTR: బంగారుపాలెం మండలం తిమ్మాజీపల్లి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై బంగారుపాలెం నుంచి బెంగళూరు వెళ్తున్న కారు, ఓ బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు మీద ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మేడ్చల్: ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లోని డాక్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధిని బట్టు సంజన(15) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థిని తల్లీ నీలా పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TG: శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించిన టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా.. మరికొందరు టన్నెల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప: పోరుమామిళ్లకు చెందిన వారికి శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్లలో శనివారం కర్నూలు – ఒంగోలు హైవేపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బేస్తవారిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
KDP: పోస్టల్ ఖాతాదారుల దగ్గర ఆర్డీ డబ్బులు తీసుకొని మోసం చేసిన నరసాపురం పోస్టుమాస్టర్ తిరుపాల్ నాయక్ను శుక్రవారం అరెస్టు చేశామని ఎస్సై హనుమంతు తెలిపారు. తిరుపాల్ నాయక్ నర్సాపురం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ 55 మంది పోస్టల్ ఖాతాదారుల వద్ద రూ. 22,67,469 నమ్మించి మోసం చేశాడని అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.