TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.