TG: సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జంట హత్యల కలకలం రేగింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సిటీజెన్ కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్య, భర్తలను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. భర్త సోమ్లా నాయక్, భార్య మాన్యమ్మ చనిపోయారు. నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్ మెన్గా సోమ్లానాయక్ పనిచేస్తున్నారు. మృతులను మహబూబాబాద్ జిల్లా గురుడు మండలం దొంగచింతతాండకు చెందిన వారిగా గుర్తించారు.