ELR: ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున గొర్రెల మందను డీసీఎం వాహనం ఢీకొంది. గొర్రెల కాపరి గొర్రెలను ఏలూరు నుండి గుడివాడ వైపు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఐదు గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గొర్రెలు గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ ఎస్ఐ రాంబాబు వివరాలు సేకరిస్తున్నారు.