సత్యసాయి: జిల్లా మహమ్మదాబాద్ సమీపంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో చౌడమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె సోదరుడు శ్రీనివాస్కు గాయాలయ్యాయి. అమడగూరు మండలం తనకంటివారిపల్లికి చెందిన చౌడమ్మ కూరగాయల వ్యాపారం కోసం గోరంట్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.