AP: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక నలుగురు మృతిచెందారు. మృతుల్లో వృద్ధుడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బైక్ సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్లో ఉంచడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇంట్లో బైక్ ఉంచిన గదిలోనే అందరూ నిద్రించడంతో విషాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.