ATP: గుత్తి శివారులోని పంట పొలాలకు బుధవారం గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయాయి. బాదిత రైతులు నాగన్న,షేక్షావలి మాట్లాడుతూ.. పంట పొలాల గేట్లకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టడంతో పొలంలో ఉన్న మోటర్ తీగలు, డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయి రూ.2 లక్షల నష్టం వాటిలిందన్నారు.
AP: బాపట్ల జిల్లా చీరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం కాలనీ సమీపంలో వాడరేవు-పిడుగురాళ్ల హైవేపై ఆటో ఢీకొని ఇద్దరు మృతిచెందారు. రోడ్డుపై వెళ్తుండగా వారిపైకి ఆటో దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. మృతులను పెద్దలక్ష్మయ్య(68), సుబ్బారావు(60)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ఫూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. ఫర్హత్(30), ఉమేరా(7), ఆయేషా(5) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మెడిసిన్స్ విక్రయించడం నేరం. అయినప్పటికీ మెడికల్ షాప్ నిర్వాహకులు మందుల అక్రమ విక్రయాలను ఆపట్లేదు. తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అబార్షన్ మందులు వాడి ఓ యువతి మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై DMHO శోభ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి నివేదిక కోరారు.
KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారాముల వారి జాతరలో బుధవారం రాత్రి జరిగిన అపశృతి చోటు చేసుకుంది. రథయాత్రలో రథం కింద పడిన యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడిని శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్క వెంకటేశ్(21)గా గుర్తించారు.
TG: హైదరాబాద్ మియాపూర్లో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే కట్నం విషయంలో గొడవ జరిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో బీహార్ వాసి ఇషిక యాదవ్కు మధ్యప్రదేశ్ వాసి నీరజ్ భన్సల్ పరిచమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరు ఐటీ జాబ్ చేస్తూ HYDలో ఉంటున్నారు.
ATP: అనంతపురం మొదటిరోడ్డు శివాలయం సమీపంలో జరిగిన విద్యుత్తు ప్రమాదంలో జేఎల్ఎం వెంగముని మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా లైన్ మెన్ రామాంజులరెడ్డి, జేఎల్ఎం విశ్వనాథను సస్పెండ్ చేస్తూ ఈఈ రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఈ, మరో సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
సత్యసాయి: కదిరిలో దారుణం జరిగింది. నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులతో గొడవ పడుతున్న గణేశ్ (26) అనే యువకుడిని తండ్రి నారాయణ స్వామి హత్య చేశాడు. బుధవారం అర్ధరాత్రి కూడా గణేశ్ గొడవ చేయడంతో విసిగిపోయిన తండ్రి రోకలి బండతో కొట్టాడు. దీంతో గణేశ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
NLR: నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెళ్లడించారు.
TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఈ ఘటన జరగ్గా.. మృతులను ఫర్హత్(30), ఉమెరా(7), ఆయేషా(5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ చండిగఢ్లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన ఓ స్కూటీలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు జ్యోతుల రామకృష్ణ (54) మృతి చెందిన ఘటన నెలకొంది. సీఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సూర్యాపేట నుంచి బొప్పారం వెళ్తుండగా అచ్యుత తండా సమీపంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రామకృష్ణ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
KMR: నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీసరి శ్రీనివాస్ (25) ఉదయం కాలకృత్యాల కోసం స్థానిక ఊర చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి సోదరుడు రాజారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
WNP: నాగవరం శివారులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో సభావత్ మన్యం (55) మృతి చెందాడు. సైకిల్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని వనపర్తి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ భాస్కర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేష్ తెలిపారు.
TG: HYD మధురనగర్లోని ఓ బ్యాంక్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.