• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

AP: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. నవీన్‌కుమార్‌(11), సాయి(16), వెంకటజోసఫ్‌(16)గా గుర్తించారు. హోలీ ఆడి, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌, వెంకటజోసఫ్‌ మృతదేహాలు లభ్యం కాగా.. సాయి మృతదేహం కోసం గాలింపు కొనసాగుత...

March 3, 2026 / 10:14 PM IST

VIDEO: భారీ అగ్నిప్రమాదం

AP: గుంటూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని సైకిల్ స్టాండ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 09:20 PM IST

బెట్టింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

AP: నెల్లూరులో ఆర్777 బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహేష్ బాబు, హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని రూ.53 లక్షలు మోసం చేయడంతో దర్యాప్తు చేపట్టి, వారి ఖాతాల్లోని రూ.1.64 కోట్లను సీజ్ చేశారు. దుబాయ్, శ్రీలంకలో శిక్షణ పొందిన మహేష్.. అక్కడి నుంచే యాప్ లింకులు పొంది ఈ దందా నడుపుతున్నాడు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

March 3, 2026 / 09:06 PM IST

ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య

AP: నెల్లూరు జిల్లా రావూరుఘాట్ అడవుల్లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) సోషల్ మీడియా ద్వారా చిట్టమూరుకు చెందిన ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే, ఏమైందో తెలియదు కానీ, ఇద్దరూ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదే ప్రదేశంలో పురుగుల డబ్బా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళకు ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

March 3, 2026 / 08:42 PM IST

కాల్పులు.. మృతుల్లో భారత సంతతి వ్యక్తి

ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్‌ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనికి బాధితులతో ముందే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

March 3, 2026 / 08:26 PM IST

కూలర్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

AP: రాష్ట్రంలో వరుస పేలుళ్లు, అగ్నిప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి. కర్నూలు బాలాజీ నగర్‌లో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

March 3, 2026 / 06:15 PM IST

యుద్ధం.. 787కు చేరిన మృతుల సంఖ్య

యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక్క రోజులోనే మరణాల సంఖ్య 555 నుంచి 787కి పెరిగింది. ఇందులో సాధారణ పౌరులు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది బాలికలు మరణించినట్లు సమాచారం.

March 3, 2026 / 03:49 PM IST

కాలేజీలో అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

March 3, 2026 / 01:36 PM IST

డ్రగ్స్ పార్టీ భగ్నం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. లిఖిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 6 గ్రాముల MDMAను సీజ్ చేశారు. నిందితుడు డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:24 PM IST

ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

TG: హైదరాబాద్‌లోని నాగోల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి స్పోర్ట్స్ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఫొటో సెషన్ కోసం నాగోల్‌లో విద్యార్థులు బైక్ రైడ్ నిర్వహించారు. ఇందుకోసం స్పోర్ట్స్ బైక్‌ను విద్యార్థులు అద్దెకు తీసుకున్నారు.

March 3, 2026 / 01:00 PM IST

దారుణం.. భార్య, అత్తను కత్తితో నరికి చంపిన వ్యక్తి

AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంకలో ఓ వ్యక్తి తన భర్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతారామరాజు, లత దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.

March 3, 2026 / 10:37 AM IST

కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దుండు మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో క్షతగాత్రులను ప్రభుత్వం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

March 3, 2026 / 10:15 AM IST

దారుణ హత్య.. వ్యక్తిని గొంతుకోసి చంపిన దుండగులు

AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంచంగిపుట్టులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, కొన్నాళ్లుగా మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

March 3, 2026 / 10:07 AM IST

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

TG: యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లెగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఐశ్వర్య ఉరేసుకుంది. కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

March 3, 2026 / 09:07 AM IST

దక్షిణ సూడాన్‌లో 169 మంది మృతి

దక్షిణ సూడాన్‌లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది మరణించారు. ప్రతిపక్ష నేత రీక్ మచర్‌ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు US మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.

March 3, 2026 / 05:22 AM IST