ATP: తాడిపత్రి మండలంలోని వీరాపురంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు గుర్తించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.70,150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.