TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కౌన్సిలర్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఛైర్మన్ ఎన్నికకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోసవ్వ కనిపించకుండా పోయారు. దీంతో కాంగ్రెస్పై బీఆర్ఎస్ కిడ్నాప్ ఆరోపణలు చేసింది. ఈనెల 4న అధికారులు ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
TG: HYDలోని నాగోల్లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. MDMA డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని ఎల్బీనగర్ SOT బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25.65 గ్రాముల MDMA డ్రగ్స్, రూ.3,61,990 విలువైన నగదు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి ఆచూకీ తెలపాలని క్రైమ్ పార్టీ ఎస్సై అయితా బత్తుల బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంగకు సంబంధించిన ఫోటోలను గురువారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వద్ద ఈ వ్యక్తి బైక్ దొంగతనం చేసిన ఆధారాలు లభించాయన్నారు.
NLR: కందుకూరు, పొన్నలూరు రహదారిలో ముత్తరాసిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు వైపు వస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో, దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
ATP: గుత్తి శివారులోని పంట పొలాలకు బుధవారం గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయాయి. బాదిత రైతులు నాగన్న,షేక్షావలి మాట్లాడుతూ.. పంట పొలాల గేట్లకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టడంతో పొలంలో ఉన్న మోటర్ తీగలు, డ్రిప్పు పైపులు మంటల్లో కాలిపోయి రూ.2 లక్షల నష్టం వాటిలిందన్నారు.
AP: బాపట్ల జిల్లా చీరాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం కాలనీ సమీపంలో వాడరేవు-పిడుగురాళ్ల హైవేపై ఆటో ఢీకొని ఇద్దరు మృతిచెందారు. రోడ్డుపై వెళ్తుండగా వారిపైకి ఆటో దూసుకొచ్చిందని స్థానికులు తెలిపారు. మృతులను పెద్దలక్ష్మయ్య(68), సుబ్బారావు(60)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ఫూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతిచెందారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. ఫర్హత్(30), ఉమేరా(7), ఆయేషా(5) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని రకాల మెడిసిన్స్ విక్రయించడం నేరం. అయినప్పటికీ మెడికల్ షాప్ నిర్వాహకులు మందుల అక్రమ విక్రయాలను ఆపట్లేదు. తాజాగా ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో అబార్షన్ మందులు వాడి ఓ యువతి మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై DMHO శోభ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై డ్రగ్ కంట్రోల్ అధికారుల నుంచి నివేదిక కోరారు.
KKD: గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారాముల వారి జాతరలో బుధవారం రాత్రి జరిగిన అపశృతి చోటు చేసుకుంది. రథయాత్రలో రథం కింద పడిన యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడిని శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దుక్క వెంకటేశ్(21)గా గుర్తించారు.
TG: హైదరాబాద్ మియాపూర్లో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే కట్నం విషయంలో గొడవ జరిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో బీహార్ వాసి ఇషిక యాదవ్కు మధ్యప్రదేశ్ వాసి నీరజ్ భన్సల్ పరిచమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరు ఐటీ జాబ్ చేస్తూ HYDలో ఉంటున్నారు.
ATP: అనంతపురం మొదటిరోడ్డు శివాలయం సమీపంలో జరిగిన విద్యుత్తు ప్రమాదంలో జేఎల్ఎం వెంగముని మృతి చెందిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా లైన్ మెన్ రామాంజులరెడ్డి, జేఎల్ఎం విశ్వనాథను సస్పెండ్ చేస్తూ ఈఈ రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఈ, మరో సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
సత్యసాయి: కదిరిలో దారుణం జరిగింది. నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులతో గొడవ పడుతున్న గణేశ్ (26) అనే యువకుడిని తండ్రి నారాయణ స్వామి హత్య చేశాడు. బుధవారం అర్ధరాత్రి కూడా గణేశ్ గొడవ చేయడంతో విసిగిపోయిన తండ్రి రోకలి బండతో కొట్టాడు. దీంతో గణేశ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
NLR: నెల్లూరు నగరంలోని సౌత్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వయసు 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి తెలుపు రంగు షర్ట్, బంగారం అంచుతో కూడిన తెలుపు పంచ ధరించినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెళ్లడించారు.
TG: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి తల్లి, ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ దగ్గర ఈ ఘటన జరగ్గా.. మృతులను ఫర్హత్(30), ఉమెరా(7), ఆయేషా(5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పంజాబ్ చండిగఢ్లోని బీజేపీ కార్యాలయం ఎదుట భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసి ఉంచిన ఓ స్కూటీలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.