రాజస్థాన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. అక్కాచెల్లెళ్లు ఆడుకుంటూ వెళ్లి సర్వీస్ సెంటర్లో నిలిపిన కారులో చిక్కుకుపోయారు. కారు డోర్లు లాక్ కావడంతో బయటకు రాలేకపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఈ క్రమంలో కారులో అపస్మారక స్థితిలో బాలికలను గుర్తించారు. అప్పటికే ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.