AP: కడప జిల్లాలో గంజాయి విక్రయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంగడివీధికి చెందిన ప్రధాన విక్రయదారులు మాధవ, సాకే శంకర్లతో పాటు మనోజ్ కుమార్ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు, విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.