SKLM: చిల్లంగి అనుమానంతో భార్యాభర్తల హత్య కలకలం రేపింది. చినరాజపురంలో సవర ఇల్లంగో (55), జ్యోతి (50)లను తోటయ్య కత్తితో హత్య చేశాడు. తన కుటుంబ సభ్యుల అనారోగ్యానికి చేతబడి కారణమని భావించినట్టు సమాచారం. ఘటనను గోప్యంగా ఉంచి దహనానికి యత్నించినా, కుమారుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.