• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందగా 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 05:43 AM IST

భారీ అగ్నిప్రమాదం.. పలు ఇళ్లు దగ్ధం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వికాస్‌నగర్ స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 16, 2026 / 12:46 AM IST

పంట పొలంలోకి లారీ.. తప్పిన ప్రమాదం

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం పెను ప్రమాదం తప్పింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

April 15, 2026 / 08:10 PM IST

180 మంది పిల్లలపై లైంగిక వేధింపులు

మహారాష్ట్రలో తన్వీర్ అనే ఓ యువకుడి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సుమారు 180 మంది పిల్లలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, స్థానిక మున్సిపల్ అధికారులు అతడి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాలను గుర్తించి బుల్డోజర్‌తో కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

April 15, 2026 / 03:10 PM IST

బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు ఆత్మహత్య!

TG: HYD బడంగ్‌పేట్ BJP అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా పేరు సంపాదించారు. బడంగ్‌పేట్ సర్కిల్‌లో అవినీతిపై పోరాడి రూ.150 కోట్ల స్కామ్‌ను వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 15, 2026 / 01:37 PM IST

గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు మృతి

AP: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని నివాస గృహంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిలెటిన్‌ స్టిక్స్‌ పేలడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.

April 15, 2026 / 01:00 PM IST

పార్క్ చేసిన కారులో చిన్నారి మృతి

TG: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో విషాదం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ పాప ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయింది. చరణ్య కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వెతికారు. పక్కింటివారు కారులో ఉన్న పాపను అపస్మారక స్థితిలో గుర్తించారు. హుటాహుటిన పేరెంట్స్ పాపను కామినేని ఆస్పత్రికి తరలించగా.. చరణ్య అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 10:51 AM IST

పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్‌ జాతీయులతో వెళ్తున్న పడవ అండమాన్‌ వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్‌ నుంచి బయలుదేరిన పడవ మలేషియాకు వెళ్తుండగా ఘటన జరిగింది. బలమైన గాలులు, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అధికారులు రెస్య్కూ ఆపరేషన్‌ చేపట్టారు.

April 15, 2026 / 09:02 AM IST

గంజాయి దందా.. 18 మంది అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 కిలోల గంజాయి, 110 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన వారిలో వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ విచారణ ఎదుర్కొన్న భరత్‌కుమార్ కూడా ఉన్నాడు. గతంలో తుపాకీ లైసెన్స్ కలిగి, ఒకరిని కాల్చి చంపిన కేసులో భరత్ నిందితుడు.

April 14, 2026 / 08:55 PM IST

ORRపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: HYD అబ్ధుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై చెట్లకు నీరు పడుతున్న ట్యాంకర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 07:45 PM IST

అగ్నిప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్ ప్లాంటులో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణకు ఆదేశించింది.

April 14, 2026 / 06:36 PM IST

BREAKING: భారీ పేలుడు.. నలుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సక్తీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ పవర్‌ప్లాంట్‌లో పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

April 14, 2026 / 05:39 PM IST

విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

AP: మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో పొలంలో ఏర్పాటు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు శశి(12), దీపక్(10)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 14, 2026 / 12:37 PM IST

ఘోరం.. తల్లి ఇంట్లో ఉండగానే నిప్పు పెట్టాడు!

AP: ఒంగోలులోని గద్దలగుంటలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన కన్నతల్లి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 14, 2026 / 07:53 AM IST

ప్రమాదం.. గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ

ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 544పై సోమవారం రాత్రి మాడమంచు ముసలయ్య గొర్రెల మందపైకి గుర్తుతెలియని లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 3 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. చింతకుంట్ల నుంచి తిరుప్పాయిపాలెం వైపు వెళ్తుండగా కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

April 14, 2026 / 07:20 AM IST