UPలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ముఖేశ్ పటేల్కు ప్రయాగ్రాజ్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఉరిశిక్షతో పాటు నిందితుడికి కోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.
UPలోని అమ్రోహాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని రూహి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఆహారంలో మత్తుమందు ఇచ్చి, గొంతు కోసి హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీ అని నమ్మించేందుకు రాత్రంతా శవం పక్కనే పిల్లలతో కలిసి నిద్రపోయింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రస్తుతం నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.
NLR: బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడింది. సంగం మండలం మక్తాపురానికి చెందిన డి. బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ. 42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన రాత్రి బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా రూ.25 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. డ్రగ్ నెట్వర్క్ కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
బీహార్ నలంద జిల్లాలోని శీతలా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి మంగళవారం మాదిరిగానే అమ్మవారిని పూజించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. మరో 12 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలను మోసం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసి కె.లక్ష్మీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ నరసింహ్మమూర్తి తెలిపారు. ఈ నెల 14న ఓ మహిళను హోటల్కు పిలిచి మత్తుమందు ఇచ్చి నగలు, నగదు, ఫోన్తో పరారయ్యాడు. అతనిపై 52 కేసులు, రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
AP: సైబర్ నేరగాళ్లు విజయవాడలోని 3 వేర్వేరు బ్రాంచుల్లో యాక్సిస్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. ఏలూరు రోడ్, గుణదల, బెంజిసర్కిల్ బ్రాంచుల్లో ఫేక్ ఆధార్, అడ్రస్, పే స్లిప్స్తో బ్యాంకు ఖాతాలు తెరిచి.. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5.28 కోట్లు దోచేశారు. ఎంతకూ తీసుకున్న క్రెడిట్ రీపే చేయకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయా అడ్రస్లకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.
AP: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. స్టేషన్లో నిల్వ ఉంచిన టపాసులు బయటకు తీస్తుండగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఎస్సై సహా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డి నగర్లో రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఐదో అంతస్తులో రీల్స్ చేస్తున్న బాలిక ఒక్కసారిగా కిందపడిపోయింది. మరణించడంతో ఆమె బాడీని తిరుపతి రుయాకు తరలించారు. ఆమె కుటుంబం నేపాల్ నుంచి రాగా.. తండ్రి బహదూర్ అదే అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో దారుణం చోటుచేసుకుంది. పులిగోనీపల్లి తండాలో బాణావత్ రామ్దాస్ నాయక్ మద్యం మత్తులో భార్య, పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో భార్య, కుమారుడు మృతిచెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం-మనుబోలు మధ్య గూడ్స్లోని పాల ట్యాంకర్ బోల్తా పడింది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్పై ట్యాంకర్ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: అమలాపురం దుడ్డివారి అగ్రహారానికి చెందిన బొంతు నవీనకుమార్(23)ను రెండు కేజీల గంజాయితో పట్టుకున్నట్లు సోమవారం రాత్రి పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… గతంలో నేర చరిత్ర ఉన్న నవీన్ గంజాయి అమ్ముతున్నాడనే సమా చారంతో దాడిచేసి పట్టుకున్నామని వెల్లడించారు. గతంలో అతడిపై ఎనిమిది కేసులు ఉన్నాయన్నారు.
మందారపువ్వు దిగువన ఉండే కాండం తిని 6 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక హుణసూరు తాలుకా దొడ్డహెజ్జూరుకు చెందిన సుదర్శన్-నవ్య దంపతుల రెండో కొడుకు చిన్మయ్ గౌడ.. తినే పదార్థం అనుకుని మందారం కాండం తిన్నాడు. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరింది. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
ASR: జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ బీమలోయ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గిన్నెల భాస్కరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సమయంలో చెట్టు కింద నిల్చున్న ఆయనపై పిడుగు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని సర్పంచ్ కోరారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుగ్గమ్మ గుడిలో సిబ్బంది చేతివాటం చూపించారు. హుండీ లెక్కింపులో బంగారాన్ని దారిమళ్లించేందుకు యత్నించారు. రోల్డ్ గోల్డ్ పెట్టి అసలైన బంగారం దోచేయబోయారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చేయించిన తనిఖీల్లో సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోగా.. EO శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు.