AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులు రాజేంద్రప్రసాద్, మారుతిగా గుర్తించారు. అలాగే, విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ప్రమాదాల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.