మందారపువ్వు దిగువన ఉండే కాండం తిని 6 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక హుణసూరు తాలుకా దొడ్డహెజ్జూరుకు చెందిన సుదర్శన్-నవ్య దంపతుల రెండో కొడుకు చిన్మయ్ గౌడ.. తినే పదార్థం అనుకుని మందారం కాండం తిన్నాడు. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరింది. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు.
ASR: జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ బీమలోయ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గిన్నెల భాస్కరరావు అనే గిరిజనుడు మృతి చెందాడు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సమయంలో చెట్టు కింద నిల్చున్న ఆయనపై పిడుగు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని సర్పంచ్ కోరారు.
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుగ్గమ్మ గుడిలో సిబ్బంది చేతివాటం చూపించారు. హుండీ లెక్కింపులో బంగారాన్ని దారిమళ్లించేందుకు యత్నించారు. రోల్డ్ గోల్డ్ పెట్టి అసలైన బంగారం దోచేయబోయారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చేయించిన తనిఖీల్లో సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోగా.. EO శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
AKP: కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో జామాదులపాలెం సమీపంలో గల వ్యవసాయ బావిలో రైతు గెంజి శివ అప్పారావు (38) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లిన శివ అప్పారావు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 29న వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం బావిలో మృతదేహం కనిపించడంతో బయటికి తీసారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణరావు తెలిపారు.
WNP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రాగి వేణు మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి మార్చరిలో ఉన్న రాగి వేణు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన వివిధ హోదాలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు.
KKD: అనారోగ్యంతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ ఆదివారం మృతిచెందాడు. ఏలూరుకు చెందిన బొబ్బా లక్ష్మణ రావు(86) 2025లో భార్యను హత్య చేశాడు. ఈ కేసులో గత ఏడాది జులై నుంచి రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల కిడ్నీ, ఇతర ఆనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు
దేశవ్యాప్తంగా హైకోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మైసూరుకు చెందిన శ్రీనివాస్ లూయిస్గా గుర్తించారు. తన భార్యతో ఉన్న గొడవల కారణంగా ఆమెను ఇరికించాలనే ఉద్దేశంతో.. ఆమె పేరు మీద ఉన్న ఇమెయిల్ ఐడిని ఉపయోగించి శ్రీనివాస్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది.
NLR: చిట్వేలి – రాపూరు ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. చిట్వేలి ఏఎస్ఐ వెంగయ్య తెలిపిన వివరాల మేరకు గూడూరు నుంచి వేంపల్లికి నిమ్మకాయల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ఘాట్ రోడ్డులోని కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. నిమ్మకాయల యజమాని లారీ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు.
WNP: రాయిగడ్డకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి రాగివేణు సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్కు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వేణు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణంతో పార్టీకి తీరని లోటని దేవన్న సంతాపం తెలిపారు.
AP: అనకాపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏసీ పేలిపోయి రేబాక రామారావు అనే విశ్రాంతి ఉద్యోగి మృతిచెందాడు. ఏసీ పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు మంచానికి ఉన్న దుస్తులకు అంటుకోవడంతో రామారావు మృతిచెందినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: వనపర్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత రాగి వేణు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం రాగి వేణు కుమారుడు చంద్రశేఖర్కు ఫోన్ లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని అన్నారు. రాగి వేణు తనకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు అని, మృతి చెందడం కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం రాత్రి బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన గౌతమి అనే మహిళా ప్రయాణికురాలి మూడు తులాల బంగారు గొలుసు మాయమైంది. గౌతమి గుత్తి నుండి గుంతకల్కు బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
AP: విశాఖ గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు బయటపెట్టాడు. మౌనిక డేటింగ్ యాప్లో పరిచయమైందని, రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు తెలిపాడు. జాబ్ ఐడీ కార్డు తీసుకుని డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. నెల క్రితం విజయనగరంలోని పుట్టింటికి తన భార్య వెళ్లడంతో మౌనికను ఇంటికి పిలిచినట్లు తెలిపాడు. రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు.
ప్రకాశం: మార్కాపురం మండలంలోని గొట్టిపడియలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో శ్రీరామ నవమి పండుగ వేడుకలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
WNP: యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు బానిసలవకుండా జాగ్రత్త పడాలని చిన్నంబావి ఎస్సై రామన్ గౌడ్ హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. బెట్టింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.