AP: విశాఖలో అనుమానాస్పద స్థితిలో GVMC ఉద్యోగి గౌరీనాయుడు మృతి చెందారు. ఆరిలోవలో గౌరీనాయుడు కుటుంబ సభ్యులు నివాసిస్తున్నారు. భార్యతో కాకుండా ఈనెల 12 నుంచి సహచర ఉద్యోగిని ఇంట్లో ఆయన ఉంటున్నారు. అయితే ఫోన్ చేసినా రాకపోవడంతో గౌరీనాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సహచర ఉద్యోగిని ఇంటికి వెళ్లగా ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది.