AP: సెల్ ఫోన్ చూడొద్దని మందలించారని యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజంపేటలో జరిగింది. సుమిత్ర(18) అనే యువతి అక్క, బావతో కలిసి నివాసం ఉంటోంది. యువతి ఎప్పుడూ ఫోన్ చూస్తుండటంతో అక్కా బావ మందలించారు. సెల్ ఫోన్ కూడా పగులగొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.